ప్రధాన మంత్రి కార్యాలయం

బిఎస్ఎఫ్ సిబ్బంది కి బిఎస్ఎఫ్ స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 DEC 2020 9:30AM by PIB Hyderabad

సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) స్థాపన దినం సందర్భం లో బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  శుభకామన లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘@BSF_India సిబ్బంది అందరికీ, వారి కుటుంబాలకు బిఎస్ఎఫ్ స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  బిఎస్ఎఫ్ ఒక పరాక్రమయుత బలగం గా తనకు తాను గుర్తింపు ను తెచ్చుకొంది.  దేశ ప్రజల ను కాపాడటంలో తన నిబద్ధత ఎంత దృఢమైందో నిరూపించుకొంది, ప్రాకృతిక విపత్తుల వేళల్లో పౌరులకు సాయపడింది కూడా.  బిఎస్ఎఫ్ ను చూసుకొని భారతదేశం గర్వపడుతోంది’’ అని పేర్కొన్నారు.

 

***



(Release ID: 1677315) Visitor Counter : 153