ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మరో మైలురాయి చేరిన భారత్: కోలుకున్నవారు 90%

చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య మరింత తగ్గుదల, మొత్తం పాజిటివ్ కేసులలో 8.5%

వారం రోజులుగా మరణాలు 1000 లోపు

2000 దాటిన మొత్తం లాబ్ ల్ సంఖ్య

Posted On: 25 OCT 2020 11:11AM by PIB Hyderabad

భారత దేశం కోవిడ్ నియంత్రణలో  మరో మైలురాయిని చేరుకుంది.  జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం ఈరోజు 90 కి చేరింది. గడిచిన 24 గంటలలో  62,077 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఉండగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు  50,129.

 

WhatsApp Image 2020-10-25 at 10.13.54 AM.jpeg

దీనివలన చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య కూడా వేగంగా తగ్గుతూ వస్తున్నది. వరుసగా మూడో రోజు కూడా ఆ సంఖ్య 7 లక్షలకు దిగువనే ఉంది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 8.5% గా నమోదై 6,68,154 దగ్గర ఉన్నాయి.  

WhatsApp Image 2020-10-25 at 10.16.21 AM.jpeg

మొత్తం కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికి అది 70.78.123 కు చేరింది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య అంతరం బాగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ అంతరం 64 లక్షలు దాటింది, కచ్చితంగా చెప్పాలంటే 64,09,969 కి చేరింది.

 

WhatsApp Image 2020-10-25 at 10.16.22 AM.jpeg

గడిచిన వారం రోజులుగా మరణాలు వెయ్యిలోపు నమోదవుతూ వస్తున్నాయి. అక్టోబర్ 2 నుంచి మరణాలు 1100  లోపు ఉంటున్న సంగతి తెలిసిందే.

WhatsApp Image 2020-10-25 at 10.13.55 AM (1).jpeg

కొత్తగా కోలుకున్నవారిలో 78% మంది కేవలం 10 రాష్ట్రాలనుంచే నమోదయ్యారు. అవి మహారాష్ట, కర్నాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, చతీత్స్ గఢ్ రాష్ట్రాలు.వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో ఒకే రోజు 10,000 మందికి పైగా కోలుకున్నారు.

 

WhatsApp Image 2020-10-25 at 10.13.56 AM.jpeg

గత 24 గంటలలో కొత్తగా 50,129 మంది పాజిటివ్ గా నిర్థారణ జరిగింది.  ఈ కొత్త కేసులలో 79% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  కేరళలో అత్యధికంగా 8,000 కు పైగా కొత్త కెసులు నమోదయ్యాయి. 6,000 కు పైగా కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది..

WhatsApp Image 2020-10-25 at 10.13.55 AM.jpeg

గడిచిన 24 గంటలలో 578 మంది కోవిడ్ వల్ల మరణించారు. వీరిలో దాదాపు 80% మంది  10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 137 మరణాలు నమోదయ్యాయి.  

WhatsApp Image 2020-10-25 at 10.13.55 AM (2).jpeg

భారత్ లో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిపే సామర్థ్యాన్ని పెంచుతూ మరో మైలురాయి చేరుకుంది. మొత్తం లాబ్ ల సంఖ్య 2000 దాటింది. మొదట్లో పూణె లో ఒక లాబ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2003 కు చేరింది. వాటిలో 1126 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా. 877 ప్రైవేట్ లాబ్ లు.

****



(Release ID: 1667450) Visitor Counter : 140