ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

క్రియాశీల కేసుల తగ్గుదల ధోరణిని కొనసాగిస్తున్న భారత్

వరుసగా రెండో రోజు కూడా క్రియాశీల కేసుల సంఖ్య 9 లక్షలకు లోపే ఉంది

మొత్తం కేసుల్లో క్రియాశీలంగా ఉన్నవి 1/8వ వంతు మాత్రమే

Posted On: 10 OCT 2020 11:18AM by PIB Hyderabad

క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతున్న ధోరణిని భారతదేశం నమోదు చేస్తునే ఉంది. క్రియాశీల కేసులు ఒక నెల తరువాత 9 లక్షల మార్క్ కంటే పడిపోయిన రెండవ రోజు. దీనిలో ప్రగతిశీల క్షీణత కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,83,185 క్రియాశీల కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం క్రియాశీల కేసులు దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 12.65% మాత్రమే. ఇవి దేశంలోని మొత్తం కేసులలో 1/8 వ వంతు. 

మొత్తం కోలుకున్న కేసులు 60 లక్షలకు (59,88,822) దగ్గరగా ఉన్నాయి. తద్వారా క్రియాశీల కేసులకు సంబంధించి వ్యత్యాసాన్ని పెంచుతుంది

గత 24 గంటల్లో 82,753 మంది రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా ధృవీకరించబడిన కేసులు 73,272 వద్ద ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 85.81% కి చేరుకుంది. 18 రాష్ట్రాలు / యుటిలు రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు చేశాయి.

 

సమగ్ర పరీక్షలు, ట్రాకింగ్, శీఘ్రంగా ఆసుపత్రిలో చేరడం మరియు ప్రామాణిక చికిత్స ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండటం వంటి కేంద్ర వ్యూహం ప్రకారం రాష్ట్రాలు / యుటిల సహకరించడం ఫలితం ఇది. కొత్తగా కోలుకున్న కేసులలో 10 రాష్ట్రాలు / యుటిలలో 76% కేంద్రీకృతమై ఉన్నట్లు గమనించారు. ఈ కేసుల్లో ఎక్కువ పాత్ర మహారాష్ట్రదిగానే  కొనసాగుతుంది 17,000 కంటే ఎక్కువ మంది ఒకే రోజు రికవరీతో అయిన గరిష్ఠ సంఖ్య అక్కడ కనిపిస్తుంది.

 

 గత 24 గంటల్లో 73,272 కొత్తగా ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. వీటిలో 10 రాష్ట్రాలు మరియు యుటిల నుండి 79% వచ్చాయి. మహారాష్ట్ర ఇప్పటికీ 12,000 కన్నా ఎక్కువ కేసులతో చాలా ఎక్కువ కొత్త కేసులను నివేదిస్తోంది, కర్ణాటకలో దాదాపు 11,000 కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో 926 కేసుల్లో మరణాలు సంభవించాయి. వీటిలో, దాదాపు 82% పది రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నాయి. కొత్త మరణాలలో 32% కంటే ఎక్కువ మహారాష్ట్ర (302 మరణాలు)లో నమోదయ్యాయి. 

 

                                                                     

****



(Release ID: 1663356) Visitor Counter : 155