ప్రధాన మంత్రి కార్యాలయం

తెలుగు భాషా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2020 6:54PM by PIB Hyderabad

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా  ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

'తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు.

తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు  నేను నివాళులు అర్పిస్తున్నాను.'  అని ప్రధానమంత్రి ట్వీట్‌ చేశారు


(రిలీజ్ ఐడి: 1649588) సందర్శకుల సూచీ సంఖ్య : : 214