ప్రధాన మంత్రి కార్యాలయం

లెబ‌నాన్‌లోని బీరుట్ న‌గ‌రంలో భారీ పేలుడు ప‌ట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 05 AUG 2020 9:30AM by PIB Hyderabad

లెబ‌నాన్ లోని బీరుట్ న‌గ‌రంలో భారీ పేలుడు సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్య‌క్తం చేశారు.
“బీరుట్‌లో పెద్ద ఎత్తున  పేలుడు సంభంవించి, ప్ర‌జ‌ల ప్రాణాలు కోల్పోవ‌డం, ఆస్తిన‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల షాక్ కు, బాధ‌కు గుర‌య్యాను.  మ‌ర‌ణించిన‌ వారికుటుంబాలు, గాయ‌ప‌డిన‌వారి చుట్టూనే మా ఆలోచ‌న‌లున్నాయి, వారికోసం ప్రార్థిస్తున్నాం ” ఆయ‌న త‌మ సందేశంలో తెలిపారు. 

 



(Release ID: 1643455) Visitor Counter : 151