ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం-19


వేగంగా పెరుగుతూ 60% చేరువలో కోలుకున్నవారి శాతం

చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 1,32,912 మంది అధికం

Posted On: 02 JUL 2020 3:29PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, సానుకూల చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం కోవిడ్ కు చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్నవారే 1,32,912 మంది ఎక్కువగా ఉన్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి శాతం 59.52% కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 11,881 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,59,859 కు చేరింది. ప్రస్తుతం ఇంకా 2,26,947 మంది బాధితులుండగా వారందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది.

కోలుకున్న కోవిడ్ బాధితులా సంఖ్యరీత్యా మొదటి  15స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవి:

క్రమ సంఖ్య

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

కోలుకున్నవారి సంఖ్య

1

మహారాష్ట్ర

93,154

2

ఢిల్లీ

59,992

3

తమిళనాడు

52,926

4

గుజరాత్

24,030

5

ఉత్తరప్రదేశ్

16,629

6

రాజస్థాన్

14,574

7

పశ్చిమ బెంగాల్

12,528

8

మధ్యప్రదేశ్

10,655

9

హర్యానా

10,499

10

తెలంగాణ

8,082

11

కర్నాటక

8,063

12

బీహార్

7,946

13

ఆంధ్రప్రదేశ్

6,988

14

అస్సాం

5,851

15

ఒడిశా

5,353

 

కోలుకున్నవారి శాతం ఆధారంగా మొదటి 15రాష్ట్రాలు:

క్రమ సంఖ్య

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

కోలుకున్నవారిశాతం

1

చండీగఢ్ 

82.3%

2

మేఘాలయ

80.8%

3

రాజస్థాన్

79.6%

4

ఉత్తరాఖండ్

78.6%

5

చత్తీస్ గఢ్

78.3%

6

త్రిపుర

78.3%

7

బీహార్

77.5%

8

మిజోరం

76.9%

9

మధ్యప్రదేశ్

76.9%

10

జార్ఖండ్

76.6%

11

ఒడిశా

73.2%

12

గుజరాత్

72.3%

13

హర్యానా

70.3%

14

లద్దాఖ్

70.1%

15

ఉత్తరప్రదేశ్

69.1%

 

పరీక్షలు, గుర్తింపు, చికిత్స అనే వ్యూహంలో భాగంగా ప్రతిరోజూ పరీక్ష్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటిదాకా 90 లక్షలకు పైగా శాంపిల్స్ కు పరీక్షలు జరిపారు. గడిచిన 24  గంటల్లో  2,29,588  పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన పరీక్షల సంఖ్య 90,56,173 కు చేరింది.

దేశ వ్యాప్తంగా కోవిడ్ పరీక్షల లాబ్ ల నెట్ వర్క్ ను విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనామండలి(ఐసీఎం ఆర్) చర్యలు తీసుకుంటున్నది.  ఇప్పుడు భారత్ లో మొత్తం లాబ్ ల సంఖ్య  1065 కు చేరింది. వీటిలో  768 ప్రభుత్వ లాబ్ లు,  297ప్రయివేట్ లాబ్ లు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.

  • తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 578 (ప్రభుత్వ: 366  + ప్రైవేట్:  212)
  • ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 398 (ప్రభుత్వ: 370   + ప్రైవేట్: 28)
  • సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 89 (ప్రభుత్వ: 32  + ప్రైవేట్: 57)

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIAను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSevaను సంప్రదించవచ్చు.

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

****



(Release ID: 1635972) Visitor Counter : 208