భారత ఎన్నికల సంఘం
సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు 2026: రూ.650 కోట్లకు పైగా సొమ్ము స్వాధీనం
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2026 2:53PM by PIB Hyderabad
-
అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు, మరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని 2026 మార్చి 15న ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కమిషన్ ఆదేశించింది.
-
ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, వాటికి సరిహద్దుగా ఉన్న 12 రాష్ట్రాలు/యూటీల ప్రధాన కార్యదర్శులు, సీఈవోలు, డీజీపీలు, ఉన్నతాధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధిపతులతో పలు పర్యాయాలు సమీక్ష సమావేశాలను కమిషన్ నిర్వహించింది. వారికి అహింసాయుతంగా, బెదిరింపులు లేని, ప్రలోభాలు లేని ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించింది.
-
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫిర్యాదులను 100 నిమిషాల లోపే పరిష్కరించేలా చూసేందుకు 5,173కి పైగా ఫ్లయింగ్ స్క్వాడ్లను మోహరించారు. అదనంగా వివిధ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు 5,200కు పైగా స్థిర నిఘా బృందాల(ఎస్ఎస్టీ)ను సైతం ఏర్పాటు చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2249251)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10