ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర మాజీ మంత్రి శ్రీ ముకుల్ రాయ్ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 FEB 2026 10:21AM by PIB Hyderabad
కేంద్ర మాజీ మంత్రి శ్రీ ముకుల్ రాయ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలతో పాటు, రాజకీయ రంగంలో ఆయనకున్న అపార అనుభవానికి గాను శ్రీ ముకుల్ రాయ్ని సదా స్మరించుకొంటామని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘కేంద్ర మాజీ మంత్రి శ్రీ ముకుల్ రాయ్ గారు మనను వీడివెళ్లారని తెలిసి బాధపడ్డాను. సమాజానికి ఆయన చేసిన సేవలతో పాటు, రాజకీయ రంగంలో ఆయనకున్న అపార అనుభవానికి గాను ఆయనను సదా స్మరించుకొంటాం. ఆయన కుటుంబానికీ, ఆయన మద్దతుదారులకూ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2231899)
आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam