ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

సెర్బియా దేశాధ్యక్షుడితో భారత ప్రధాన మంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 7:11PM by PIB Hyderabad

ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సెర్బియా దేశాధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ వుచిచ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

 

ఈ సదస్సులో పాల్గొన్నందుకు అధ్యక్షుడు వుచిచ్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 2017లో ‘వైబ్రెంట్ గుజరాత్ అంతర్జాతీయ సదస్సు’కు వుచిచ్ హాజరవటం.. నవంబర్ 2023లో వర్చువల్ విధానంలో జరిగిన రెండో ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సదస్సు’లో ఆయన భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.

 

వాణిజ్యంపెట్టుబడులుకృత్రిమ మేధఆర్థిక సాంకేతికతవిద్యవ్యవసాయంప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై ఇరువురు నాయకులు చర్చించారుపరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారుఐక్యరాజ్యసమితిఇతర బహుళ పక్ష వేదికలపై ఒకరికొకరు అందించుకుంటున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఇరువురు నేతలు అభినందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2230018) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam