సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర బడ్జెట్ 2026-27: సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ, విద్యా కార్యక్రమాలకు భారీ ప్రోత్సాహం ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


దేశవ్యాప్తంగా ఏవీజీసీ రంగం, నైపుణ్యాల వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా బడ్జెట్ ప్రకటనలు

బాధ్యత భావం స్ఫూర్తిగా... యువశక్తి, నారీ శక్తి బలోపేతం లక్ష్యంగా బడ్జెట్: శ్రీ అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 7:35PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత విద్య, నైపుణ్యాల వ్యవస్థ కోసం ఒక పరివర్తనాత్మక ప్రణాళికను సమర్పించిన ఆర్థిక మంత్రి... ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి, దేశంలో సృజనాత్మక పరిశ్రమల బలోపేతం కోసం కీలక కార్యక్రమాలను వివరించారు.

దేశంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం వేగవంతమైన వృద్ధిని హైలైట్ చేస్తూ... 2030 నాటికి పరిశ్రమకు దాదాపు 20 లక్షల మంది వృత్తి నిపుణుల అవసరం ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. విస్తరిస్తున్న ఈ వ్యవస్థకు ఊతమివ్వడం కోసం దేశవ్యాప్తంగా 15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడానికి ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్‌కు సహాయం అందించాలని ఆమె ప్రతిపాదించారు. ఈ ల్యాబ్‌లు యువతకు సృజనాత్మక రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తాయని భావిస్తున్నారు.

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా నిపుణులను తయారుచేయడం, భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా అభ్యాసకులకు అవకాశాలను విస్తరించడం దిశగా గణనీయ పురోగతిని ఈ కార్యక్రమం సూచిస్తుంది.

కేంద్ర బడ్జెట్ ప్రకటనలపై ఈ రోజు రైల్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్... "ఇది యువశక్తి, మహిళా శక్తి స్ఫూర్తితో రూపొందించిన బాధ్యతల ఆధారిత బడ్జెట్" అని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'వేవ్స్' కార్యక్రమం ద్వారా భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టారని ఆయన పేర్కొన్నారు. ఐఐటీలు, ఐఐఎంల తరహాలో స్థాపించిన ఐఐసీటీ ముంబయి... క్రియేటర్స్ ల్యాబ్స్ ద్వారా 15,000 పాఠశాలలు, 500 కళాశాలలతో అనుసంధానం ద్వారా 20 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన తెలిపారు.

ఆడియో-విజువల్ ప్రొడక్షన్, ప్రసారం, డిజిటల్ కంటెంట్, యానిమేషన్, గేమింగ్, ప్రచారం, ప్రత్యక్ష వినోదాలను మిళితం చేస్తూ భారత మీడియా-వినోద (ఎమ్&ఈ) రంగం సేవారంగ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా మారిందని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. గత దశాబ్ద కాలంలో ఈ రంగం ఆదాయ నమూనాలు, ఉపాధి, సరుకు రవాణా వ్యవస్థలను పరివర్తన చెందించడం ద్వారా డిజిటల్, ప్లాట్‌ఫామ్-ఆధారిత డెలివరీ దిశగా బలమైన ముందడుగు వేసింది. 2024లో సుమారు రూ. 2.5 ట్రిలియన్లుగా అంచనా వేసిన ఈ వృద్ధి పెరుగుతున్న ఆదాయాలు, ఇంటర్నెట్ వ్యాప్తి, ఓటీటీ విస్తరణ, ఏఐ-నేతృత్వంలోని ఆవిష్కరణల ద్వారా ముందుకు సాగుతోంది.

ఆరెంజ్ ఎకానమీ గురించి

సృజనాత్మకత, సంస్కృతి, మేధో సంపత్తి ఆధారంగా ముందుకు నడిచే ఆర్థిక వ్యవస్థను "ఆరెంజ్ ఎకానమీ" సూచిస్తుంది. ఇక్కడ ప్రధానంగా భౌతిక వస్తువుల కంటే ఆలోచనలు, జ్ఞానం, కళాత్మక వ్యక్తీకరణ, సాంస్కృతిక కంటెంట్ ద్వారా విలువ ఏర్పడుతుంది.


(రిలీజ్ ఐడి: 2222103) సందర్శకుల సూచీ సంఖ్య : : 189
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam