ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ ఏడాది పరీక్షా పే చర్చ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలను ఆహ్వానించిన ప్రధాని
प्रविष्टि तिथि:
07 JAN 2026 7:05PM by PIB Hyderabad
పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించనున్నారు.
ఈ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన తమ ప్రశ్నలు, ఆలోచనలు, అనుభవాలను పంచుకోవాలని దేశంలోని #ExamWarriors అందరినీ ప్రధానమంత్రి ఆహ్వానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“పది, పన్నెండో తరగతుల పరీక్షలు దగ్గరపడుతున్నాయి. అలాగే ఈ ఏడాది #ParikshaPeCharcha కూడా సమీపిస్తోంది!
పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ముఖ్యంగా పరీక్షల ఒత్తిడిని అధిగమించే మార్గాలతోపాటు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటూ చిరునవ్వుతో పరీక్షలకు హాజరవడం వంటి విషయాలపై వారితో సంభాషించాలనుకుంటున్నాను.
ప్రశ్నల రూపంలోగానీ, వారి అనుభవాల ద్వారాగానీ #ExamWarriors తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నాను. అవి ఇతరుల్లో స్ఫూర్తిని నింపుతాయి.
https://innovateindia1.mygov.in/“
(रिलीज़ आईडी: 2212267)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam