హోం మంత్రిత్వ శాఖ
నక్సల్ రహిత భారత్ దిశగా కీలక ముందడుగు
ఒడిశాలోని కంధ్మాల్లో నిర్వహించిన ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయ్కే సహా 6 గురు నక్సలైట్లు హతం
ఈ కీలక పురోగతితో నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు చేరువలో ఒడిశా
2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని మేం దృఢంగా నిర్ణయించుకున్నాం
నాడు పోస్టు చేయడమైనది:
25 DEC 2025 4:35PM by PIB Hyderabad
నక్సల్ రహిత భారత్ దిశగా కీలక ముందడుగు వేస్తూ ఒడిశాలోని కంధ్మాల్లో నిర్వహించిన ప్రధాన ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయ్కే సహా ఇప్పటివరకు 6 గురు నక్సలైట్లు హతమయ్యారు.
‘ఎక్స్’ వేదికగా హోంమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“నక్సల్ రహిత భారత్ దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఒడిశాలోని కంధ్మాల్లో నిర్వహించిన ఒక ప్రధాన ఆపరేషన్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయ్కే సహా 6 గురు నక్సలైట్లు ఇప్పటివరకు హతమయ్యారు. ఈ కీలక పురోగతితో ఒడిశా నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు చేరువలో ఉంది. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని మేం నిశ్చయించుకున్నాం.”
(రిలీజ్ ఐడి: 2208582)
సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam