ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్న భారత ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం

నాడు పోస్టు చేయడమైనది: 15 DEC 2025 5:00PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మాన్‌కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయానికి వచ్చిన భారత ప్రధానమంత్రిని.. గౌరవ జోర్డాన్ ప్రధానమంత్రి డాక్టర్ జాఫర్ హసన్ సాదరంగా ఆహ్వానించి, లాంఛనంగా స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇది ప్రతీక.

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్... మూడు దేశాల్లో భారత ప్రధానమంత్రి పర్యటనలో ఇది మొదటి దశ. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తయిన వేళ.. 37 ఏళ్ల విరామం అనంతరం భారత ప్రధానమంత్రి జోర్డాన్‌లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2204226) సందర్శకుల సూచీ సంఖ్య : : 45