ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
కోల్సేతు విండోను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
బొగ్గును పారదర్శకంగా అందుబాటులో ఉంచటంతో పాటు వనరులను అత్యుత్తమంగా ఉపయోగించేలా చూసుకునేందుకు వివిధ పారిశ్రామిక ఉపయోగాలు, ఎగుమతుల కోసం బొగ్గు లింకేజీల వేలం
प्रविष्टि तिथि:
12 DEC 2025 4:18PM by PIB Hyderabad
బొగ్గు పారిశ్రామిక వినియోగం- ఎగుమతి కోసం ఉద్దేశించిన కోల్సేతు (కోల్ లింకేజ్ ఫర్ సీమ్లెస్, ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ యుటిలైజేషన్) విధానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించింది. దీని ప్రకారం ఎన్ఆర్ఎస్ లింకేజ్ విధానంలో కోల్సేతు అనే విండోను కొత్తగా తీసుకురానున్నారు. బొగ్గు రంగంలో ప్రభుత్వం చేపడుతోన్న వరుస సంస్కరణల్లో ఈ కొత్త విధానం ఒక భాగంగా ఉంది.
2016 ఎన్ఆర్ఎస్ (అనియంత్రిత రంగాలు) లింకేజ్ వేలం విధానంలో కోల్సేత్ అనే ప్రత్యేక విండోను కొత్తగా తీసుకురావటం ద్వారా వేలం ఆధారంగా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు లింకేజీలను అన్ని రకాల పారిశ్రామిక వినియోగం, ఎగుమతి కోసం కేటాయించడానికి ఇది అనుమతిస్తుంది. ఈ వేలంలో బొగ్గు అవసరం ఉన్న అన్ని రకాల దేశీయ కొనుగోలుదారులు పాల్గొనవచ్చు. ఈ విండో కింద కోకింగ్ కోల్ లేదు.
ఎన్ఆర్ఎస్ బొగ్గు లింకేజీల వేలం విషయంలో ఇప్పటికే ఉన్న విధానం ప్రకారం అన్ని కొత్త బొగ్గు లింకేజీలను సీపీపీ (సొంత బొగ్గు గనులు ఉండే విద్యుతుత్పత్తి కేంద్రాలు) కంపెనీలతో సహా ఎన్ఆర్ఎస్లకు (అంటే సిమెంట్, స్టీల్ (కోకింగ్), స్పాంజ్ ఐరన్, అల్యూమినియం, ఎరువులు(యూరియా) మినహా ఇతరులు) వేలం ఆధారంగా కేటాయిస్తారు. ఈ ఎన్ఆర్ఎస్ లింకేజ్ విధానం ప్రకారం నిర్దిష్ట తుది వినియోగదారులకే ఉప-రంగాల కేటాయింపులు ఉంటాయి.
ప్రస్తుత, భవిష్యత్తు మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యాపార సౌలభ్యంతో పాటు ఇప్పటికే ఉన్న బొగ్గు నిల్వల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు, దేశ ఇంధన అవసరాలను తీర్చే విషయంలో దిగుమతి అయిన బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అనియంత్రిత రంగాలకు బొగ్గు సరఫరా విషయంలో ఉన్న ప్రస్తుత విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే ఎన్ఆర్ఎస్లోని లింకేజ్లను ఎటువంటి తుది వినియోగ పరిమితులు లేకుండా బొగ్గు వినియోగదారులకు విస్తరించాల్సిన అవసరం ఉంది. వాణిజ్య గనుల తవ్వకం కోసం బొగ్గు రంగాన్ని తెరిచేందుకు ఎటువంటి తుది వినియోగ పరిమితులు లేకుండా బొగ్గు బ్లాకుల కేటాయింపునకు ఇది అనుమతిస్తుంది. ఏదైనా పారిశ్రామిక వినియోగం, ఎగుమతి కోసం వేలం ఆధారంగా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు లింకేజీలను కేటాయించడానికి మరొక విండో లేదా ఉప-రంగాన్ని ఈ విధానం తీసుకొస్తుంది. ఈ ప్రతిపాదిత విండోలో వ్యాపారులు పాల్గొనరాదు. ఎన్ఆర్ఎస్లోని నిర్దిష్ట తుది-వినియోగదారులకు సంబంధించిన ఉప-రంగాలకు ఉన్న ప్రస్తుత బొగ్గు లింకేజ్ల వేలం కొనసాగుతుంది. ఆ నిర్దిష్ట తుది-వినియోగదారులు కూడా కోల్సేతు విండోలో పాల్గొనవచ్చు.
ఈ విండో కింద పొందిన బొగ్గు లింకేజ్లను దేశంలో తిరిగి విక్రయించరాదు. సొంత వినియోగం, బొగ్గు ఎగుమతి లేదా మరేదైనా ప్రయోజనం (కోల్ వాషింగ్తో సహా) కోసం ఉపయోగించుకోవచ్చు. బొగ్గు లింకేజ్లు పొందిన సంస్థలు బొగ్గు లింకేజ్ పరిమాణంలో 50 శాతం వరకు బొగ్గును ఎగుమతి చేయవచ్చు. బొగ్గు లింకేజ్లు కలిగి ఉన్న సంస్థలు ఈ విండో కింద పొందిన బొగ్గును గ్రూప్ కంపెనీలలో అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. శుభ్రం చేసిన బొగ్గుకు ఉన్న ప్రస్తుత డిమాండ్, భవిష్యత్తులో పెరిగే డిమాండ్ను పరిగణనలోకి తీసుకుంటే వాషరీ నిర్వహకులకు బొగ్గు లింకేజీలను కేటాయించడం వల్ల దేశంలో శుభ్రం చేసిన బొగ్గు లభ్యత పెరుగుతుంది. తత్ఫలితంగా దిగుమతులు తగ్గుతాయి. శుభ్రం చేసిన బొగ్గుకు విదేశాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఎగుమతుల కోసం ఈ బొగ్గును ఉపయోగించొచ్చు.
***
(रिलीज़ आईडी: 2203361)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Kannada
,
Malayalam
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil