ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నావికాదళ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2025 8:41AM by PIB Hyderabad

ఈ రోజు నేవీ డే సందర్భంగా భారత నావికాదళ సిబ్బంది అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ధైర్యానికీదృఢ సంకల్పానికీ మన నావికా దళం పర్యాయపదమని శ్రీ మోదీ అన్నారుమన తీర ప్రాంతాలను రక్షిస్తూసముద్రపరంగా మన ప్రయోజనాలను వారు కాపాడుతున్నారు. ‘‘ఈ సంవత్సరం దీపావళిని నేనెన్నటికీ మరచిపోలేనుఐఎన్ఎస్ విక్రాంత్లో నావికాదళ సిబ్బందితో కలిసి నేను పండుగ చేసుకున్నానుభవిష్యత్తులో భారత నావికా దళం మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘భారత నావికాదళ సిబ్బంది అందరికీ నేవీ డే శుభాకాంక్షలు. అసాధారణమైన ధైర్యసాహసాలకుదృఢ సంకల్పానికి మన నావికా దళం పర్యాయపదంవారు తీరప్రాంతాలను రక్షిస్తూమన సముద్ర ప్రయోజనాలను కాపాడుతున్నారుఇటీవల మన నావికాదళం స్వావలంబనఆధునికీకరణపై దృష్టి సారించింది. ఇది మన భద్రతా యంత్రాంగాన్ని మెరుగుపరిచింది.

ఈ ఏడాది దీపావళిని నేనెన్నటికీ మరచిపోలేనుఐఎన్ఎస్ విక్రాంత్లో నావికాదళ సిబ్బందితో కలిసి నేను పండుగ చేసుకున్నానుమన నావికా దళం భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.’’

 

*** 


(రిలీజ్ ఐడి: 2199168) సందర్శకుల సూచీ సంఖ్య : : 31