ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ భవిష్యత్తుకు నారీశక్తి కీలకంగా ఎలా మారిందన్న కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 DEC 2025 3:28PM by PIB Hyderabad
దేశ భవిష్యత్తులో నారీశక్తి ఎలా కీలక పాత్ర పోషిస్తుందన్న అంశాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు. ‘‘అమృత కాలంలోకి భారత్ ప్రవేశిస్తున్న ఈ తరుణంలో నారీశక్తి కేవలం ఒక నినాదం మాత్రమే కాదు.. ఇదో జాతీయ సంకల్పం. వన్-స్టాప్ సెంటర్ల నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వరకు, హెల్ప్లైన్ల నుంచి సామాజిక భద్రతా కేంద్రాల వరకు, మిషన్ శక్తి ఆధ్వర్యంలో మహిళలకు గౌరవం, భద్రత, అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి ‘ఎక్స్’ లో చేసిన పోస్టుకు స్పందిస్తూ ప్రధానమంత్రి ఇలా అన్నారు:
‘‘దేశ భవిష్యత్తు నారీశక్తి అత్యంత కీలకం. భారత్ అమృత కాలంలోకి ప్రవేశిస్తున్న వేళ.. ఈ పదం ఒక నినాదం మాత్రమే కాదు... ఓ పెద్ద యజ్ఞం. వన్-స్టాప్ సెంటర్ల నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వరకు, హెల్ప్లైన్ల నుంచి సామాజిక భద్రత కేంద్రాల వరకు మిషన్ శక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు గౌరవాన్నీ, అవకాశాలనీ అందిస్తోంది.
కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి విశ్లేషణ ఎంతో సముచితం. తప్పకుండా చదవండి’’
(रिलीज़ आईडी: 2197005)
आगंतुक पटल : 5