ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

Posted On: 23 NOV 2025 2:29PM by PIB Hyderabad

గౌరవ అధ్యక్షుడు రామఫోసా,

గౌరవ అధ్యక్షుడు లూలా,

మిత్రులారా,

నమస్కారం!

చైతన్యవంతమైనఅందమైన జోహన్నెస్‌బర్గ్‌ నగరంలో జరుగుతున్న ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందిఈ చొరవ తీసుకున్నందుకు ఐబీఎస్ఏ ఛైర్ అయిన అధ్యక్షుడు లూలాకుఆతిథ్యం ఇచ్చిన అధ్యక్షుడు రామఫోసాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదుఇది మూడు ఖండాలనుమూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను,  మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదికఇది మన వైవిధ్యంభాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయినశాశ్వతమైన భాగస్వామ్యం కూడా.

మిత్రులారా,

నేటి ఐబీఎస్ఏ నాయకుల సమావేశం చరిత్రాత్మకమైనదిసమయానుకూలమైనది కూడాఆఫ్రికా ఖండంలో జరుగుతున్న ఈ మొదటి జీ20 సదస్సుగ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాయకత్వం వహించిన నాలుగు జీ20 అధ్యక్ష హోదాల పరిసమాప్తిని సూచిస్తోందిగత మూడు సంవత్సరాలుగామూడు ఐబీఎస్ఏ దేశాలు జీ20కి నాయకత్వం వహించాయిఈ మూడు సదస్సుల ద్వారామనం మానవ కేంద్రీకృత అభివృద్ధిబహుళపక్ష సంస్కరణసుస్థిర అభివృద్ధి వంటి భాగస్వామ్య ప్రాధాన్యతలపై అనేక ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాంఈ కార్యక్రమాలను బలోపేతం చేయడంవాటి ప్రభావాన్ని పెంచడం అనేది ఇప్పుడు మన సమష్టి బాధ్యతఈ స్ఫూర్తితోమన సహకారంపై నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను.

మిత్రులారా,

మొదటగా... ప్రపంచ సంస్థలు 21వ శతాబ్దపు వాస్తవాలను ప్రతిబింబించడం లేదనే విషయాన్ని మనమంతా అంగీకరిస్తున్న్నాంమనలో ఎవరికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదుఇది ప్రపంచ సంస్థలు నేటి ప్రపంచానికి ఇకపై ప్రాతినిధ్యం వహించడం లేదని స్పష్టంగా రుజువు చేస్తోందిఅందువల్లఐబీఎస్ఏ ప్రపంచానికి ఐక్య సందేశాన్ని పంపాలి. సంస్థాగత సంస్కరణ అనేది కేవలం ఒక ఎంపిక కాదు.. అది ఒక హక్కు.

అదేవిధంగాఉగ్రవాదంపై పోరాటంలో కూడా మనం సన్నిహిత సమన్వయంతో పనిచేయాలిఇంతటి తీవ్రమైన సమస్యపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదుప్రపంచ శాంతి,  శ్రేయస్సు కోసం ఒకే విధమైననిర్ణయాత్మకమైన చర్య అవసరం.

మూడు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏమొదటి సమావేశం 2021లో భారత్ ఐబీఎస్ఏ అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు జరిగిందిభద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి మనం దీనిని సంస్థాగతం  చేయవచ్చు.

మిత్రులారా,

ప్రజా ప్రాధాన్య  అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందిముఖ్యంగా డిజిటల్ మౌలిక సదుపాయాలుకృత్రిమ మేధ వంటి రంగాలలో ఐబీఎస్ఏ ఒక ముఖ్యపాత్ర పోషించవచ్చుఈ విషయంలో మనం ‘ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్‘ ఏర్పాటును పరిశీలించవచ్చుదీని ద్వారా యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్కోవిన్ వంటి ఆరోగ్య వేదికలుసైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థలుమహిళల నేతృత్వంలోని సాంకేతిక కార్యక్రమాలను మన మూడు దేశాల మధ్య పంచుకోవచ్చుఇది మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థల వృద్ధిని వేగవంతం చేస్తుంది.  గ్లోబల్ సౌత్ కోసం పరిగణించదగిన పరిష్కారాలను సృష్టిస్తుందిసురక్షితమైనవిశ్వసనీయమైన ప్రజా ప్రాధాన్య ఏఐ నిబంధనల రూపకల్పనకు మనం కలసి దోహదపడగలందీనిని వచ్చే ఏడాది భారత్ లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రారంభించవచ్చు.

మిత్రులారా,

సుస్థిరవృద్ధి కోసంఐబీఎస్ఏ పరస్పర అభివృద్ధి ప్రయత్నాలకు తోడ్పడటమే కాకుండాప్రపంచానికి ఒక ఉదాహరణగా కూడా నిలబడగలదుచిరుధాన్యాలుప్రకృతి వ్యవసాయంప్రోత్సాహంలో అయినావిపత్తుల ప్రతిఘటనహరిత ఇంధనం విషయంలో అయినాలేదా సంప్రదాయ వైద్యంఆరోగ్య భద్రతలో అయినాఈ రంగాలలో మన బలాలను ఏకీకృతం చేయడం ద్వారాప్రపంచ సంక్షేమానికి మనం అర్థవంతంగా దోహదపడగలం.

ఈ దృష్టికోణంతోనే ఐబీఎస్ఏ నిధిని ఏర్పాటు చేశాందాని మద్దతుతోమనం 40 దేశాలలో దాదాపు 50 ప్రాజెక్టులను అమలు చేశాంవిద్యఆరోగ్యం నుంచి మహిళా సాధికారతసౌరశక్తి వరకు విస్తరించిన ఈ కార్యక్రమాలు స్థానిక సమాజాల అవసరాల ఆధారంగా రూపు దిద్దుకున్నాయిఈ సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి మనం వాతావరణ పరిస్థితుల ఆధారిత వ్యవసాయం కోసం కూడా ఐబీఎస్ఏ నిధి ఏర్పాటును పరిశీలించవచ్చు

 

మిత్రులారా,

నేటి ప్రపంచం అనేక రంగాలలో విచ్ఛిన్నంగావిభజించినట్టుగా కనిపిస్తోందిఇటువంటి సమయంలో ఐబీఎస్ఏ ఐక్యతసహకారం మానవత్వం సందేశాన్ని అందించగలదుఇది మూడు ప్రజాస్వామ్య దేశాలుగా మన బాధ్యత,  మన బలం కూడా.

చాలా ధన్యవాదాలు.

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం. 

 

***


(Release ID: 2193286) Visitor Counter : 2