ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధాని

నేడు ఉత్తరాఖండ్ అధిరోహించిన పురోగతి శిఖరాలను చూస్తుంటే

అప్పట్లో ఈ అందమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు పోరాడిన ప్రతి వ్యక్తీ సంతోషించడం ఖాయం: ప్రధాని

ఇది నిజంగా ఉత్తరాఖండ్ ఉన్నతి, పురోగతిని నిర్వచించే యుగం: ప్రధాని

దేవభూమి ఉత్తరాఖండ్ భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి గుండె చప్పుడు: ప్రధాని

ఉత్తరాఖండ్‌ నిజమైన గుర్తింపు దాని ఆధ్యాత్మిక శక్తిలోనే ఉంది: ప్రధాని

Posted On: 09 NOV 2025 2:54PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారుఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవంశంకుస్థాపన చేశారుఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలుహృదయపూర్వక వందనాలు తెలియజేశారు

అంకితభావంతో కూడిన సుదీర్ఘ పోరాట ఫలితమే నవంబర్ అన్న ప్రధాని.. ఈ రోజు మనందరిలో ప్రగాఢమైన ఉత్తేజాన్ని నింపుతుందని పేర్కొన్నారుఉత్తరాఖండ్‌లోని దైవసమానులైన ప్రజలు చాలా కాలంగా ఒక కలను కన్నారని.. అది 25 సంవత్సరాల కిందట శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి ప్రభుత్వం హయాంలో నెరవేరిందని అన్నారుగత 25 ఏళ్ల ప్రయాణాన్ని ప్రస్తావించిన ఆయన.. ఉత్తరాఖండ్ నేడు అధిరోహించిన పురోగతి శిఖరాలను చూస్తుంటే ఒకప్పుడు ఈ అందమైన రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడిన ప్రతి వ్యక్తీ సంతోషించడం సహజమని అభిప్రాయపడ్డారుపర్వతాలను ప్రేమించేవారుఉత్తరాఖండ్‌ సంస్కృతిదాని సహజ సౌందర్యాన్ని ఆదరించే వారుదేవభూమి ప్రజలపై అభిమానం ఉన్నవారు నేడు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

కేంద్రరాష్ట్ర భాజపా ప్రభుత్వాలు ఉత్తరాఖండ్ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చే విషయంలో నిబద్ధతతో ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుఉత్తరాఖండ్ రజతోత్సవం సందర్భంగా అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారురాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఈ సందర్భంగా ఆయన నివాళులు అర్పించారుఆనాటి ఉద్యమకారులందరికీ వందనం చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్తరాఖండ్‌తో ఉన్న లోతైన భావోద్వేగ అనుబంధం గురించి మాట్లాడిన ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టినప్పుడు... పర్వతాలలో నివసించే సోదరీసోదరుల కష్టాలుశ్రమసంకల్పం ఎల్లప్పుడూ  ప్రేరణనిస్తున్నాయన్నారుఉత్తరాఖండ్‌లో గడిపిన రోజులు రాష్ట్ర అపారమైన సామర్థ్యం గురించి ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చాయని పేర్కొన్నారుఈ బలమైన నమ్మకమే కేదార్‌ బాబాను సందర్శించిన తర్వాత ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే అని ప్రకటించేలా ప్రేరణనిచ్చినట్లు తెలిపారురాష్ట్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్న ఆయన.. "ఇది నిజంగా ఉత్తరాఖండ్ ఉన్నతిపురోగతిని నిర్వచించే యుగంఅని వ్యాఖ్యానించారు

25 సంవత్సరాల కిందట ఉత్తరాఖండ్ కొత్తగా ఏర్పడినప్పుడు చాలా సవాళ్లు ఎదురయ్యాయని గుర్తుచేసిన శ్రీ నరేంద్ర మోదీ..  ఆ కాలంలో వనరులు పరిమితంగా ఉండేవనిరాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉండేదన్నారుఅప్పుడు ఆదాయ మార్గాలు అరుదుగా ఉండేవని.. చాలా అవసరాలు కేంద్ర సహాయం ద్వారానే తీరేవని పేర్కొన్నారుఅయితే ఈ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారుఈ కార్యక్రమానికి రాకముందు రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అద్భుతమైన ప్రదర్శనను వీక్షించారుఇది గత 25 ఏళ్లలో ఉత్తరాఖండ్ చేసిన ప్రయాణాన్ని తెలియజేస్తోందనీమౌలిక సదుపాయాలువిద్యపరిశ్రమలుపర్యాటకంఆరోగ్యంవిద్యుత్గ్రామీణాభివృద్ధి వంటి రంగాలలో విజయ గాథలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ప్రధాని అన్నారు. 25 సంవత్సరాల కిందట ఉత్తరాఖండ్ బడ్జెట్ కేవలం రూ. 4,000 కోట్లుగా ఉండేదని.. అది ఇప్పుడు రూ. 1 లక్ష కోట్లను దాటిందని ఆయన తెలిపారుఈ కాలంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగిందనిరోడ్ల పొడవు రెట్టింపు అయిందని పేర్కొన్నారుగతంలో ఆరు నెలలకు కేవలం 4,000 మంది మాత్రమే విమాన ప్రయాణికులు ఇక్కడికి వచ్చేవారని.. ప్రస్తుతం ఒక్క రోజులోనే 4,000 మందికి పైగా ప్రయాణికులు విమానంలో ఇక్కడికి వస్తున్నారని అన్నారు.

గత 25 సంవత్సరాలలో ఉత్తరాఖండ్‌లో ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య పది రెట్లు పెరిగిందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారుగతంలో ఒక్క మెడికల్ కళాశాల మాత్రమే ఉండేదన్న ఆయన.. నేడు పది మెడికల్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. 25 సంవత్సరాల కిందట టీకాలు అందే జనాభా 25 శాతం కంటే తక్కువగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని దాదాపు ప్రతి గ్రామానికి టీకాలు అందుతున్నాయని పేర్కొన్నారుజీవితంలోని అన్ని కోణాల్లోనూ ఉత్తరాఖండ్ గణనీయమైన ప్రగతిని సాధించిందని ప్రధాని తెలిపారురాష్ట్ర అభివృద్ధి ప్రయాణం అద్భుతంగా ఉందన్న ఆయన.. ఈ పరివర్తనకు సమ్మిళిత వృద్ధి విధానంతో పాటు ఉత్తరాఖండ్‌లోని ప్రతి ఒక్కరి సామూహిక సంకల్పం కారణమని వ్యాఖ్యానించారుగతంలో పర్వతవాలు అభివృద్ధి మార్గానికి అడ్డు తగిలేవనికానీ ఇప్పుడు కొత్త మార్గాలు తెరచుకోవడం ప్రారంభమైందని ఆయన అన్నారు.

ఉత్తరాఖండ్‌లోని యువతవ్యవస్థాపకులతో ఇంతకుముందు చేపట్టిన సంభాషణ గురించి ప్రధాని మాట్లాడారువారు రాష్ట్ర వృద్ధి పట్ల అత్యంత ఉత్సాహంగా ఉన్నారని తెలిపారునేడు ఉత్తరాఖండ్ ప్రజల మనోభావాలను "2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరినప్పుడు.. నా ఉత్తరాఖండ్నా దేవభూమి పూర్తిగా సిద్ధంగా ఉంటుందిఅని గఢ్వాలీ భాషలో చెప్పారు.

ఉత్తరాఖండ్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఇవాళ అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంశంకుస్థాపన చేసినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. విద్యఆరోగ్యంపర్యాటకంక్రీడలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అన్నారుడెహ్రాడూన్హల్ద్వానీ ప్రాంతాలలో తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో జమ్రానీసోంగ్ నీటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారుఈ పథకాలపై రూ. 8,000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు తెలిపిన ప్రధాని.. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.


 

ఆపిల్కివి సాగుచేసే రైతులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ రూపంలో రాయితీల బదిలీని ప్రారంభించిందని శ్రీ మోదీ పేర్కొన్నారుతద్వారా ప్రభుత్వ సహాయం అసలైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించడం ఇకపై సాధ్యమవుతుందని ఆయన చెప్పారుఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ‘ఆర్‌బీఐ’ సహా ఇతర భాగస్వామ్య సంస్థలను ప్రధానమంత్రి అభినందించారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం భారత ఆధ్యాత్మిక జీవనాడి” అని అభివర్ణిస్తూ- ‘గంగోత్రియమునోత్రికేదార్‌నాథ్బద్రీనాథ్జగేశ్వర్‌ఆది కైలాస్‌’ వంటివి మన భక్తివిశ్వాసాలకు ప్రతీకలైన పవిత్ర తీర్థయాత్రా ప్రదేశాలని శ్రీ మోదీ సందదర్భంగా పేర్కొన్నారుఏటా లక్షలాదిగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు యాత్రగా వస్తుంటారనిఇవి భక్తి మార్గానికి బాటలు వేయడమేగాక ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థలో నవ్యోత్తేజం నింపుతాయని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ అభివృద్ధితో అనుసంధానం ఎంతగానో ముడిపడి ఉందంటూరాష్ట్రంలో ప్రస్తుతం ₹లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారురిషీకేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గం పనులు సాగుతుండగాఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌ వే దాదాపు పూర్తి కావస్తున్నదని తెలిపారుఅలాగే గౌరీకుండ్-కేదార్‌నాథ్గోవింద్‌ఘాట్-హేమకుండ్ సాహిబ్ రోప్‌వే పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారుఈ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో ప్రగతి వేగం పుంజుకుంటోందని శ్రీ మోదీ అన్నారు.

గడచిన పాతికేళ్లలో ఉత్తరాఖండ్ సుదీర్ఘ ప్రగతి ప్రయాణం చేసిందని ప్రధానమంత్రి గుర్తుచేశారుఈ నేపథ్యంలో రాబోయే 25 ఏళ్లలో ఎంత ఎత్తులో ఉండాలో ఒకసారి అంచనా వేద్దామాఅని ఆయన ప్రేక్షకులనుద్దేశించి ప్రశ్నించారు. “మనసుంటే మార్గం ఉంటుంది” అనే సామెతను ఉటంకిస్తూమన లక్ష్యాలేమిటో మొదట గ్రహిస్తేవాటిని సాధించే ప్రణాళిక సత్వరం రూపొందగలదని ఆయన వ్యాఖ్యానించారుకాబట్టిభవిష్యత్ లక్ష్యాలపై చర్చలకు శ్రీకారం చుట్టడానికి నవంబరు 9ని మించిన మంచి రోజు మరొకటి ఉండదన్నారు.

ఉత్తరాఖండ్ వాస్తవ ప్రతిష్ఠ దాని ఆధ్యాత్మిక బలంలోనే ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారుఆ దిశగా భవిష్యత్తులో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే ఈ రాష్ట్రం “ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని”గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలదని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారుఉత్తరాఖండ్‌లోని ఆలయాలుఆశ్రమాలుధ్యాన-యోగా కేంద్రాలను ప్రపంచ నెట్‌వర్కుతో అనుసంధానం చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు.

ఆరోగ్య శ్రేయస్సును ఆకాంక్షిస్తూ దేశవిదేశాల ప్రజలు ఉత్తరాఖండ్‌కు వస్తుండటంతో ఇక్కడి వన మూలికలుఆయుర్వేద ఔషధాలకు డిమాండ్ వేగంగా విస్తరిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారుగడచిన పాతికేళ్లుగా సుగంధ మొక్కలుఆయుర్వేద మూలికలుయోగాఆరోగ్య శ్రేయో పర్యాటకంలో అద్భుత ప్రగతి సాధించిందని ఆయన అన్నారుదీనికి అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో యోగాఆయుర్వేద కేంద్రాలుప్రకృతి వైద్య సంస్థల సంపూర్ణ  ప్యాకేజీ సౌలభ్యం ఉండాలని ప్రతిపాదిస్తూతద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునే వీలుందని ఆయన సలహా ఇచ్చారు.

సాధికార గ్రామాల కార్యక్రమం’ కింద దేశ సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారుఇందులో భాగంగా ఉత్తరాఖండ్‌ పరిధిలోని ప్రతి సాధికార గ్రామం ఒక చిన్న పర్యాటక కేంద్రంగా రూపొందడంతోపాటు ఆతిథ్య గృహాలు (హోమ్‌స్టే), స్థానిక వంటకాల సంస్కృతికి ప్రోత్సాహం లభించాలన్నది తన దృక్కోణమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ఇక్కడి ‘డబ్కేచుడ్కానీరోట్-అర్సారస్-భాత్ఝంగోర్ కి ఖీర్’ వంటి సంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తూగృహ వాతావరణాన్ని అనుభూతి చెందాలని శ్రీ మోదీ అన్నారుఇలాంటి ఆనందదాయక అనుభూతులు పదేపదే మదిలో మెదిలిపర్యాటలను మళ్లీమళ్లీ ఉత్తరాఖండ్‌కు తీసుకువస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తరాఖండ్‌లో నిబిడీకృత సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడండపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఈ మేరకు ‘హరేలాఫూల్ దేయిభిటౌలి’ వంటి పండుగ వేడుకలలో పాల్గొనేలా చేస్తే పర్యాటకులపై హృదయాలపై అవి చెరగని ముద్ర వేస్తాయన్నారుఅదే తరహాలో ‘నందా దేవి మేళాజౌల్జీవి మేళాబాగేశ్వర్ ఉత్తరాయణి మేళాదేవిధుర మేళాశ్రావణి మేళాబటర్‌ ఫెస్టివల్’ వంటి స్థానిక ఉత్సవానందాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుఈ వేడుకలన్నీ ఉత్తరాఖండ్ ఆత్మను కళ్లకు కడతాయని శ్రీ మోదీ పేర్కొన్నారుస్థానిక పండుగలుసంప్రదాయాలను ప్రపంచ పటంలోకి తేవడం లక్ష్యంగా “ఒక జిల్లా ఒక పండుగ” వంటి కార్యక్రమం చేపట్టడంపై యోచించాల్సిందిగా సూచించారు.

ఉత్తరాఖండ్‌లోని పర్వతప్రాంత జిల్లాలన్నీ పండ్ల సాగుకు అనువైనవనివాటిని ఉద్యాన పంటల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి కోరారు. ‘బ్లూబెర్రీకివిమూలికా-ఔషధ మొక్కల సాగును భవిష్యత్‌ వ్యవసాయంగా ఆయన అభివర్ణించారుఆహార తయారీహస్తకళలుసేంద్రియ ఉత్పత్తులు తదితర రంగాల్లో ‘ఎంఎస్‌ఎంఈ’లకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉందని స్పష్టం చేశారు.

ఉత్తరాఖండ్‌కు నిరంతర పర్యాటక ఆకర్షణ సామర్థ్యం ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారుఅనుసంధానం మెరుగుతో అన్ని సీజన్లలో పర్యాటక రంగాన్ని సరికొత్తగా రూపుదిద్దాలని ఇంతకుముందు కూడా ఆయన సూచించారుతదనుగుణంగా రాష్ట్రం ఇప్పుడు శీతాకాల పర్యాటకానికి కొత్త కోణాన్ని జోడిస్తున్నదని హర్షం వెలిబుచ్చారుదీనికి సంబంధించి తాజా అభివృద్ధి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారుఆ మేరకు శీతాకాల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని శ్రీ మోదీ అన్నారుపిథోడ్‌గఢ్‌లో 14,000 అడుగులకు పైగా ఎత్తున మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించడాన్ని ఆయన గుర్తుచేశారుఅదేవిధంగా ఆది కైలాస్‌ పరిక్రమ పరుగు దేశానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారుమూడేళ్ల కిందట ఆది కైలాస్‌ యాత్రలో 2,000కన్నా తక్కువ మంది యాత్రికులు పాల్గొనగాఆ సంఖ్య ఇప్పుడు 30,000 దాటిందని సంతోషం వ్యక్తం చేశారుశీతాకాల విపరీత వాతావరణం వల్ల కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను ఇటీవల మూసివేసే నాటికి ఈ ఏడాది మొత్తం మీద దాదాపు 17 లక్షల మంది భక్తులు దైవదర్శనం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారుతీర్థయాత్రా ప్రాముఖ్యంనిరంతర పర్యాటకం ఉత్తరాఖండ్ ప్రత్యేకతలనిరాష్ట్ర ప్రగతిని సమున్నత శిఖరాలకు చేర్చగల సామర్థ్యం వీటికి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఅలాగే పర్యావరణసాహస పర్యాటకానికి గల అవకాశాలు దేశ యువతను ఆకర్షించే వినూత్న మార్గాలని ఆయన అన్నారు.

‘‘చలనచిత్రాలకు గమ్యస్థానంగా ఉత్తరాఖండ్ మారుతోందిరాష్ట్ర కొత్త చలనచిత్ర విధానం చిత్రీకరణను సులభతరం చేసింది’’ అని ప్రధానమంత్రి అన్నారుఅలాగే వివాహ గమ్యస్థానంగా సైతం ఉత్తరాఖండ్ ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు. ‘వెడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కోసం పెద్ద స్థాయిలో సౌకర్యాలను ఉత్తరాఖండ్‌‌లో కల్పించాలనిదీనికోసం నుంచి ప్రధాన గమ్యస్థానాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు.

వోకల్ ఫర్ లోకల్ నినాదమే స్వావలంబనకు మార్గమంటూ.. ఆత్మనిర్భర భారత్ కోసం జాతీయ సంకల్పాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారుఈ దార్శనికతను ఉత్తరాఖండ్ ఎల్లప్పుడూ అవలంబించిందనిస్థానిక ఉత్పత్తుల పట్లవాటి వినియోగం పట్ల అభిమానం కలిగి ఉండటందైనందిన జీవితంలో వాటిని భాగం చేసుకోవడం ఈ రాష్ట్ర సంప్రదాయంలో అంతర్భాగమన్నారువోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వేగంగా అమలు చేసిందనిఫలితంగా రాష్ట్రంలో 15 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారుఇటీవలే బేడు ఫలంబద్రి ఆవు నెయ్యికి జీఐ ట్యాగు గుర్తింపు రావడం గర్వించాల్సిన అంశమన్నారుపర్వత ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి బద్రి ఆవు నెయ్యి గర్వకారణమని వర్ణిస్తూ.. ఇప్పుడు గ్రామాలను దాటి మార్కెట్లకు బేడు చేరుకుంటోందన్నారువీటితో తయారుచేసిన ఉత్పత్తులు ఇప్పుడు జీఐ ట్యాగునిఉత్తరాఖండ్ ఖ్యాతి తమతో తీసుకెళ్తాయిఇలాంటి జీఐ ట్యాగు ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అన్ని గృహాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ తెలిపారు.

ఉత్తరాఖండ్ ప్రాంతీయ గుర్తింపును ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ‘‘హౌస్ ఆఫ్ హిమాలయాస్’’ ఓ బ్రాండుగా ఎదుగుతోందని ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారుఈ బ్రాండు ద్వారా రాష్ట్రానికి చెందిన వివిధ రకాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడేందుకు వీలుగా ఒకే గుర్తింపు లభించిందని అన్నారుప్రస్తుతం ఈ ఉత్పత్తులు వినియోగదారులకు నేరుగా డిజిటల్ వేదికల్లో లభ్యమవుతున్నాయనిరైతులకుచేతివృత్తుల వారికిచిన్న వ్యాపారవేత్తలకు కొత్త మార్కెట్ అవకాశాలను అందిస్తున్నాయని వివరించారుబ్రాండింగ్ ప్రయత్నాల్లో కొత్త శక్తి నింపాలని శ్రీ మోదీ కోరారుఈ బ్రాండెడ్ ఉత్పత్తుల పంపిణీ వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

అభివృద్ధి ప్రయత్నాల్లో ఉత్తరాఖండ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొందనితమ సమర్థవంతమైన ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించిందనినిరంతరాయంగా పురోగతి కొనసాగుతోందని శ్రీ మోదీ తెలియజేశారుఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారుమత మార్పిడి నిరోధక చట్టంఅల్లర్ల నియంత్రణ చట్టం లాంటి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాహసోపేతమైన విధానాలను ప్రశంసించారుభూ ఆక్రమణలుజనాభా మార్పులకు సంబంధించిన సున్నితమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దృఢమైన చర్యలను సైతం ప్రధామంత్రి గుర్తించారువిపత్తు నిర్వహణ రంగంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొంటున్న వేగవంతమైనసున్నితమైన స్పందననుసాధ్యమైన అన్ని విధాలుగా ప్రజలకు సాయాన్ని అందించడంలో చేపడుతున్న ప్రయత్నాలను ప్రశంసించారు.

రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా భవిష్యత్తులో నూతన అభివృద్ధి శిఖరాలకు ఉత్తరాఖండ్ చేరుకుంటుందనితన సంస్కృతినిగుర్తింపును గర్వంగా ముందుకు తీసుకెళుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారువచ్చే 25 ఏళ్ల కోసం ఉత్తరాఖండ్ అభివృద్ధికి ప్రజలు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనిపురోగతి మార్గంలో దృఢ సంకల్పంతో నడవాలని సూచించారుఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అండగా నిలుస్తుందనిఅడుగడుగునా.. సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారురాష్ట్రంలోని ప్రతి పౌరునికీ ఆనందంశ్రేయస్సుఉజ్వలమైన భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తూ.. ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్గుర్మీత్ సింగ్ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామికేంద్ర మంత్రి శ్రీ అజయ్ టమ్టాఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

ఉత్తరాఖండ్ అవతరణ రజతోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారుఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారుసభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రూ.8140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపన చేశారువాటిలో రూ.930 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను ప్రారంభించగారూ.7210 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారుతాగు నీరునీటి పారుదలసాంకేతిక విద్యఇంధనంపట్టణాభివృద్ధిక్రీడలునైపుణ్యాభివృద్ధి తదితర కీలకమైన రంగాల్లో ఈ ప్రాజెక్టులున్నాయి.


 

పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా నేరుగా 28,000 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.62 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు.

ప్రధానమంత్రి ప్రారంభించిన వాటిలో అమృత్ పథకం ద్వారా డెహ్రాడూన్లో 23 జోన్లకు నీటి సరఫరాపిథోర్‌గఢ్ జిల్లాలో విద్యుత్ ఉపకేంద్రంప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లునైనిటాల్లోని హల్ద్వానీ స్టేడియలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ మైదానం తదితరమైనవి ఉన్నాయి.

జలరంగానికి చెందిన రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు డెహ్రాడూన్‌కు 150 ఎంఎల్‌డీ (రోజుకి మిలియన్ లీటర్లుసరఫరా చేసే సాంగ్ డ్యామ్ తాగునీటి ప్రాజెక్టుతాగునీటిని అందించేనీటిపారుదలవిద్యుత్ ఉత్పత్తికి సహకరించే నైనిటాల్లోని జమారానీ డ్యాం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారువిద్యుత్ సబ్ స్టేషన్లుచంపావత్‌లో మహిళల క్రీడా కళాశాలనైనిటాల్లో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న డెయిరీ ప్లాంట్తదితరమైనవి ప్రధానమంత్రి భూమిపూజ చేసిన వాటిలో ఉన్నాయి.

 

***


(Release ID: 2188157) Visitor Counter : 3