ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని కెవాడియాలో అద్భుతమైన ఏక్తా పరేడ్ దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2025 1:30PM by PIB Hyderabad

గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన ఐక్యతా కవాతు (ఏక్తా పరేడ్) కు సంబంధించిన కొన్ని ప్రత్యేక దృశ్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పలు పోస్టులు చేశారు.

‘‘కెవాడియాలో జరిగిన అద్భుతమైన ఐక్యతా కవాతులో పాల్గొన్నాను. సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కవాతు.. దేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించింది’’

‘‘కెవాడియాలో జరిగిన  ఐక్యతా కవాతుకు చెందిన మరికొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి’’

‘‘ఐక్యతా కవాతులో అత్యంత ప్రశంసలు పొందిన అంశాల్లో దేశీయమైన  జాతి శునకాల ప్రదర్శనలు ఒకటి’’

‘‘ఐక్యతా కవాతులో మీరు ఖచ్చితంగా ఇష్టపడే అంశం.. వైమానిక ప్రదర్శన’’


(రిలీజ్ ఐడి: 2184633) సందర్శకుల సూచీ సంఖ్య : : 36