ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 06 OCT 2025 4:28PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచిన భారత పారా అథ్లెట్ బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారుఈ పోటీల్లో భారత్ అత్యుత్తమ సంఖ్యలో పతకాలను సాధించింది. 6 స్వర్ణాలతో సహా 22 పతకాలను సొంతం చేసుకునిజాతీయ పారా క్రీడల ప్రయాణంలో సరికొత్త విజయాన్ని నమోదు చేసిందిఈ తరహా ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మొదటిసారి భారత్‌లో నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో శ్రీ మోదీ ఇలా అన్నారు:

‘‘మన పారా-అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు!

ఈ ఏడాది ప్రపంచ పారా-అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ చాలా ప్రత్యేకమైనవిఆరు స్వర్ణాలతో సహా 22 పతకాలను సాధించి భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసిందిమన క్రీడాకారులకు శుభాకాంక్షలువారి విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందిమన జట్టులోని ప్రతి క్రీడాకారుడిని చూసి గర్విస్తున్నానువారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

ఢిల్లీలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం భారత్‌కు గర్వకారణంఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న దాదాపు 100 దేశాలకు చెందిన క్రీడాకారులువారి సహాయకులకు ధన్యవాదాలు "

 

***


(रिलीज़ आईडी: 2175854) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada