ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో రూ.1,22,100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం


ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ ఇంధన కార్యక్రమం: పీఎం

సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి సేవలు అందించాలనే స్ఫూర్తితో మేం పనిచేస్తున్నాం: పీఎం

గిరిజన తెగలు దర్జాగా, ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే మా సంకల్పం: పీఎం

Posted On: 25 SEP 2025 4:40PM by PIB Hyderabad

రాజస్థాన్లోని బాన్స్‌వారాలో రూ. 1,22,100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవంశంకుస్థాపన చేశారునవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజున బాన్స్‌వారలోని మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని దర్శించే అవకాశం తనకు లభించిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారుకాంఠల్వాగడ్‌లో గంగగా పూజలందుకొనే మాతా మాహీని చూసే అవకాశం కూడా తనకు లభించిందన్నారుభారతీయ గిరిజన తెగల స్థైర్యానికీపోరాటతత్వానికీ మాహీ జలాలు ప్రతీక అని ప్రధానమంత్రి వర్ణించారుమహాయోగి గోవింద్ గురు స్ఫూర్తిదాయక నాయకత్వం గురించి వివరిస్తూ... ఆయన గొప్పతనం ఎప్పటికీ నిలిచి ఉంటుందనిఆ గొప్ప గాథకు మాహీ జలాలు సాక్ష్యంగా నిలుస్తాయని తెలిపారుమాతా త్రిపుర సుందరిమాత మాహీలకుశ్రీ మోదీ నమస్సులు అర్పించారుభక్తిధైర్యం నిండిన ఈ నేల నుంచి మహారాణా ప్రతాప్రాజా బాంసియా బీల్‌కు ఆయన నివాళులు అర్పించారు.

నవరాత్రి సమయంలో శక్తిని తొమ్మిది రూపాల్లో దేశ ప్రజలు ఆరాధిస్తారని శ్రీ మోదీ అన్నారుఈ రోజు బాన్స్‌వారాలో జరిగే ప్రధాన కార్యక్రమం ఊర్జా శక్తి విద్యుదుత్పత్తికి అంకితం చేశామని తెలిపారుభారతీయ విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయానికి రాజస్థాన్ భూమి శ్రీకారం చుట్టిందన్నారురాజస్థాన్మధ్యప్రదేశ్ఆంధ్రప్రదేశ్కర్ణాటకమహారాష్ట్రల్లో రూ.90,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారుఏకకాలంలో ఈ తరహా భారీ స్థాయి ప్రాజెక్టులు ప్రారంభించడం.. విద్యుత్ రంగంలో వేగవంతమవుతున్న భారత్ ప్రగతిని సూచిస్తుందనిదీనికి దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి చురుకైన సహకారం లభిస్తోందనీఅన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తామనీ ఆయన స్పష్టం చేశారుస్వచ్ఛ విద్యుత్ ప్రాజెక్టులుట్రాన్స్‌మిషన్ లైన్లకు రాజస్థాన్లో శంకుస్థాపన చేశారుఅలాగే సౌర విద్యుత్ ప్రాజెక్టులను కూడా శ్రీ మోదీ ప్రారంభించారువీటితో పాటుగా.. బాన్స్‌వారాలో రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభమైనట్లు ప్రకటించారువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాల్లో సౌరశక్తి నుంచి అణుశక్తి వరకు భారత్ కొత్త శిఖరాలను చేరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

‘‘నేటి సాంకేతికతపరిశ్రమల యుగంలో.. విద్యుత్ శక్తి ద్వారా అభివృద్ధి ముందుకెళుతుందివెలుగునీవేగాన్నీవృద్ధినీఅనుసంధానాన్నీఅంతర్జాతీయ అవకాశాలను విద్యుత్ తీసుకువస్తుంది’’ అని ప్రధానమంత్రి అన్నారుగత ప్రభుత్వాలు విద్యుత్తుకున్న ప్రాధాన్యానాన్ని విస్మరించాయన్నారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి, 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సదుపాయం లేదనిస్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత సైతం 18,000 గ్రామాల్లో కనీసం ఒక్క విద్యుత్ స్థంభమైనా లేదన్నారుఅంతేకాకుండా.. నగరాల్లో సైతం గంటల తరబడి విద్యుత్ కోతలుండేవనీగ్రామాల్లో 4-5 గంటల పాటు కరెంటు ఉంటే దాన్ని గొప్పగా భావించేవారనీ తెలిపారువిద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల కర్మాగారాల్లో కార్యకలాపాలకుకొత్త పరిశ్రమలు ఏర్పాటుకు ఆటంకం కలిగేదనిఈ పరిస్థితి రాజస్థాన్ సహా మొత్తం దేశంపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారుఈ పరిస్థితిని మార్చాలని 2014లో తన ప్రభుత్వం సంకల్పించుకుందనితద్వారా ప్రతి గ్రామానికీ విద్యుత్ సదుపాయం ఏర్పడిందనీ, 2.5 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందినట్లు వెల్లడించారువిద్యుత్ లైన్లు ఎక్కడి వరకు చేరుకున్నాయో.. అక్కడికి కరెంట్ కూడా వచ్చిందన్నారుఫలితంగా జీవన సౌలభ్యం ఏర్పడికొత్త పరిశ్రమల వృద్ధికి వీలు కలుగుతోందని అన్నారు.

ఏ దేశమైనా 21 వ శతాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే.. ఆ దేశం కచ్చితంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారుఅభివృద్ధి చెందిన దేశాలన్నీ స్వచ్ఛ విద్యుత్తులో అగ్రస్థానంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారుపీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన ప్రారంభాన్ని ప్రకటిస్తూ.. ‘‘మా ప్రభుత్వం స్వచ్ఛ ఇంధన కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తోంది’’ అని శ్రీ మోదీ తెలియజేశారుఈ పథకం కింద గ్రామీణపట్టణ ప్రాంతాల్లో ఇంటి కప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారురైతులకు విద్యుత్ చౌకగా అందించేందుకు పీఎం-కుసుమ్ పథకం ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ పంపులను ఏర్పాటు చేస్తున్నారుఈ రోజు వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించిన పథకాలు నేరుగా లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం అందిస్తాయని ప్రధాని అన్నారుపీఎం సూర్య ఘర్ పథకం గృహాలకుపీఎం-కుసుమ్ పథకం సాగుభూములకు ఉచిత విద్యుత్ అందిస్తాయన్నారుపీఎం-కుసుమ్ లబ్ధిదారులతో అంతకు ముందు జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ.. ఉచిత సోలార్ విద్యుత్ తమ జీవితాలకు గొప్ప వరంగా మారిందని వారు తనతో చెప్పారన్నారు.

‘‘అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ అత్యంత వేగంగా పనిచేస్తోందిఈ ప్రయాణంలో రాజస్థాన్ కీలకపాత్ర పోషిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారురాజస్థాన్ ప్రజల కోసం నీరువిద్యుత్ఆరోగ్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూ. 30,000 కోట్ల అదనపు ప్రాజెక్టుల ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారువందే భారత్ సహా మూడు కొత్త రైళ్లను ప్రధానమంత్రి ప్రారంభించారుదేశ వ్యాప్తంగా నూతన ఉపాధి అవకాశాలను కల్పించే జాతీయ కార్యక్రమం గురించి వివరిస్తూ.. దీని ద్వారా రాజస్థాన్లోని 15,000 మంది యువతప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలను ఈ రోజు అందుకున్నారని తెలిపారుతమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న వారందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారుఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం నేపథ్యంలో రాజస్థాన్ ప్రజలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజస్థాన్లోని తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పట్ల పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారుగత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికిదోపిడీకి పాల్పడటం వల్ల రాజస్థాన్‌కు అయిన గాయాలకు ప్రస్తుత ప్రభుత్వం చికిత్స చేస్తోందన్నారుగత పాలనా కాలంలో రాజస్థాన్ పేపర్ లీకులకు కేంద్రంగా మారిందనిఅవినీతి కారణంగా జల్ జీవన్ మిషన్ కుంటుపడిందని విమర్శించారుమహిళలపై అఘాయిత్యాలు తారస్థాయికి చేరుకున్నాయనినేరాలకు పాల్పడిన వారికి రక్షణ కల్పించారని ఆరోపించారుగత ప్రభుత్వ హయాంలో బాన్స్‌వారాడుంగార్ పూర్ప్రతాప్ ఘర్ ప్రాంతాల్లో నేరాలుఅక్రమ మద్యం వ్యాపారం పెరిగిపోయాయని తెలిపారుతమకు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత శాంతిభద్రతలు బలోపేతమయ్యాయనిఅభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారురాజస్థాన్ వ్యాప్తంగా పెరుగుతున్న హైవేలుఎక్స్‌ప్రెస్ వేలతో ప్రధాన ప్రాజెక్టులు ఇప్పుడు అమలు అవుతున్నాయన్నారురాజస్థాన్‌ను ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్‌ను అభివృద్ధి పథంలో తమ ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళుతుందని తెలియజేశారు.

సమాజంలో చివరి వ్యక్తికి సైతం అభ్యుదయ ఫలాలను అందించే అంత్యోదయ సూత్రాన్ని దేశానికి అందించిన పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి ఈ రోజే అని గుర్తు చేస్తూ.. ఆయన లక్ష్యమే ప్రస్తుతం తమ ప్రభుత్వ ధ్యేయంగా మారిందని శ్రీ మోదీ స్పష్టం చేశారుపేదలుదళితులువెనుకబడిన తరగతులుగిరిజన తెగల సంక్షేమం కోసం సేవా భావంతో పరిపాలన వ్యవస్థ పని చేస్తోందన్నారు.

గిరిజన సమాజాన్ని ప్రతిపక్షం ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేస్తోందనివారి అవసరాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతోందని ప్రధానమంత్రి విమర్శించారుమాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో మొదటిసారిగా గిరిజన వ్యవహారాల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుప్రతిపక్షం అధికారంలో ఉన్న సమయంలో.. గిరిజన ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులంటే అది ఊహించని విషయంగా ఉండేదని వ్యాఖ్యానించారువీటికి తమ ప్రభుత్వం వాస్తవ రూపం ఇస్తోందని తెలియజేశారుమధ్యప్రదేశ్‌లోని ధార్‌లో గిరిజన రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించే పీఎం మిత్ర పార్కు ప్రారంభాన్ని ప్రకటించారు.

తమ పార్టీ ప్రయత్నాల కారణంగానే పేద గిరిజన కుటుంబానికి చెందిన శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారని ప్రస్తావిస్తూ.. అత్యంత వెనకబడిన గిరిజన వర్గాల సమస్య గురించి రాష్ట్రపతి స్వయంగా తెలియజేశారనిఅదే పీఎం జన్మన్ యోజన ప్రారంభానికి దారి తీసిందని తెలియజేశారుఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారుధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా గిరిజన గ్రామాలను ఆధునికీకరిస్తున్నామనితద్వారా అయిదు కోట్ల మందికి పైగా గిరిజనులకు లబ్ది చేకూరుతోందని వెల్లడించారుదేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఏకలవ్య ఆదర్శ గురుకులు పాఠశాలలు ప్రారంభించామని ఆయన చెప్పారుఅడవుల్లో నివసించే వారుషెడ్యూలు తెగల అటవీహక్కులను ప్రభుత్వం గుర్తించిందని ప్రధానమంత్రి తెలియజేశారు.

‘‘వేల ఏళ్లుగా అటవీ వనరులను భారతీయ గిరిజన తెగలు ఉపయోగించుకుంటున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారుఈ వనరులు వారి ప్రగతికి తోడ్పడేలా ప్రభుత్వం వన్ ధన్ యోజనను ప్రారంభించింది.. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెరిగిందనిగిరిజన ఉత్పత్తులను మార్కెట్‌కు అనుసంధానించామని తెలిపారుఫలితంగా.. దేశవ్యాప్తంగా అటవీ ఉత్పత్తుల్లో భారత్ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని వెల్లడించారు.

గిరిజన తెగలు గౌరవంతో జీవించేలా చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తూ.. వారి నమ్మకంఆత్మ గౌరవంసాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే తమ సంకల్పమని ప్రధాని పేర్కొన్నారుసాధారణ పౌరుని జీవితం సులభతరమైనప్పుడు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తారని వివరించారు. 11 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ పాలనలో నెలకొన్న దారుణ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. వారు పౌరులను వ్యవస్థీకృతంగా దోచుకున్నారని విమర్శించారుఆ సమయంలో పన్నులుద్రవ్యోల్బణం అధికంగా ఉండేవని గుర్తు చేశారుతమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ఈ తరహా దోపిడీ విధానాలకు చరమగీతం పాడినట్లు తెలిపారు.


 

2017లో జీఎస్టీ అమలులోకి రావడంతో పన్నులుటోల్ వసూళ్ల సంక్లిష్టతల నుంచి దేశం విముక్తి పొందిందని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ సంవత్సరం నవరాత్రి మొదటి రోజున అమలులోకి తెచ్చిన ప్రధాన జీఎస్టీ  సంస్కరణ ఫలితంగా దేశమంతటా జీఎస్టీ పొదుపు ఉత్సవం జరుపుకుంటున్నారని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుఅనేక రోజువారీ అవసర వస్తువుల ధరలు బాగా తగ్గాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుపెద్ద సంఖ్యలో హాజరైన మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూఇంటివంటగది ఖర్చులు తగ్గడంతో దేశవ్యాప్తంగా తల్లులుక్కాచెల్లెళ్లకు ఎంతో ఉపశమనం లభించిందని అన్నారు

2014కు ముందు ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలో సబ్బుషాంపూటూత్‌పేస్ట్టూత్ పౌడర్ వంటి రోజువారీ నిత్యావసర వస్తువులపై రూ. 100 ఖర్చు చేస్తేఅధిక పన్నుల కారణంగా దాని మొత్తం ఖర్చు రూ. 131 అయ్యేదని శ్రీ మోదీ పేర్కొన్నారుప్రతిపక్షాలు ప్రతి 100 రూపాయల కొనుగోలుపై 31 రూపాయల పన్ను విధించాయన్నారు. 2017లో తమ ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసిన తర్వాతఅదే రూ.100 విలువైన కొనుగోలుపై పన్ను 18 రూపాయలకు తగ్గిందనిదీనివల్ల వినియోగదారులకు 13 రూపాయలు ఆదా అవుతోందని ఆయన తెలిపారుఇప్పుడు సెప్టెంబర్ 22న ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల తరువాత పన్ను మరింత తగ్గి రూ. 105 కి చేరిందనిఫలితంగా ఇంతకుముందుతో పోలిస్తే మొత్తం 26 రూపాయలు ఆదా అవుతుందని వివరించారుతల్లులుఆడపడుచులు ఇంటి ఖర్చులను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తారనిఇప్పుడు కొత్త పన్ను విధానంలో కుటుంబాలు  ప్రతినెలా వందల రూపాయలు ఆదా చేయగలుగుతాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు

పాదరక్షలు అందరికీ ప్రాథమిక అవసరమనిగత ప్రభుత్వ హయాంలో, 500 రూపాయల విలువైన పాదరక్షలను కొనుగోలు చేస్తే, 75 రూపాయల పన్ను భారం పడిదాని ధర రూ. 575 అయ్యేదనిజీఎస్టీ అమలులోకి వచ్చాకఈ పన్ను 15 రూపాయలు తగ్గితేఇప్పుడుతాజా జీఎస్టీ సంస్కరణల తర్వాతరూ. 50 ఆదా అవుతోందని అన్నారుగతంలో రూ.500 కంటే ఎక్కువ ధర ఉన్న పాదరక్షలపై మరింత ఎక్కువ పన్నులు పడేవనిఇప్పుడు రూ.2,500 వరకు ధర ఉన్న పాదరక్షలపై పన్ను రేట్లను ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందనిఇది సాధారణ పౌరులకు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.

స్కూటర్ లేదా మోటార్ సైకిల్ కలిగివుండాలనేది ప్రతి ఇంటికి ఒక సాధారణ ఆకాంక్ష అనిఅయితే ప్రతిపక్ష పాలనలో ఇది కూడా అందుబాటులో లేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. 60,000 మోటార్ సైకిల్ పై ప్రతిపక్షాలు 19,000 రూపాయలకు పైగా పన్ను విధించాయని ఆయన గుర్తుచేశారు. 2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టడంతోఈ పన్ను రూ. 2,500 తగ్గిందిఈ సెప్టెంబర్ 22 న అమలులోకి వచ్చిన సవరించిన రేట్లతో అదే మోటార్ సైకిల్ పై  ఇప్పుడు పన్ను రూ. 10,000 మాత్రమేఫలితంగా 2014 తో పోలిస్తే రూ. 9,000  ప్రయోజనం లభిస్తుంది.

గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారురూ.300 విలువైన సిమెంట్ బస్తాపై రూ. 90కి పైగా పన్నులు ఉండేవని, 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టడంతో ఈ పన్ను సుమారు రూ. 10 తగ్గిందని అన్నారుతాజా జీఎస్టీ  సంస్కరణలతో  అదే సిమెంట్  బస్తాపై ఇప్పుడు పన్ను రూ.50 మాత్రమేననిఫలితంగా 2014 తో పోలిస్తే  40 రూపాయలు ఆదా అవుతుందని వివరించారుప్రతిపక్ష పార్టీ పాలనలో అధిక పన్నుల భారం ఉంటేతమ ప్రభుత్వం సామాన్య పౌరులకు పొదుపు శకాన్ని ప్రారంభించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

జీఎస్టీ పొదుపు పండుగ మధ్యస్వావలంబన భారత్ లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదని శ్రీ మోదీ అన్నారుస్వదేశీ మంత్రాన్ని విస్మరించకూడదనిమనం అమ్మేదికొనేది కూడా స్వదేశీ అయి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. “ఇది స్వదేశీ” అని గర్వంగా చెప్పుకోవాలని అన్నారుప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొన్నప్పుడుఆ డబ్బు దేశంలోనే ఉంటుందనిస్థానిక చేతివృత్తులవారికికార్మికులకువ్యాపారులకు చేరుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  ఈ డబ్బు విదేశాలకు వెళ్లకుండా నేరుగా దేశాభివృద్ధికి దోహదం చేస్తుందికొత్త రహదారులురోడ్లను నిర్మించడంలో ఉపయోగపడుతుందిస్వదేశీని జాతీయ గర్వానికి చిహ్నంగా మార్చాలని ఆయన ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారుపండుగ సీజన్లో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని ప్రధానమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారుఅభివృద్ధి,  ఉపాధి ఆధారిత ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రజలకు మరోసారి అభినందనలు తెలిపారు.

రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావ్ కిశన్ రావ్ బగాడేరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మకేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

అందరికీ అందుబాటులోవిశ్వసనీయంగా,  నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించే విధంగా భారత విద్యుత్ రంగాన్ని మార్చాలనే తన నిబద్ధతకు అనుగుణంగాప్రధానమంత్రి మహి బనస్వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు (4X700 మెగావాట్లుకు శంకుస్థాపన చేశారుఅణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (అశ్విని)  రూ. .42,000 కోట్లతో ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోందిఇది విశ్వసనీయమైన బేస్ లోడ్ విద్యుత్ ను  సరఫరా చేసే దేశంలోని అతిపెద్ద అణు ప్లాంట్లలో ఒకటిగా ఉంటుందిపర్యావరణ నిర్వహణలో,  అభివృద్ధి చెందుతున్న అణు శక్తి రంగంలో భారత్  స్థానాన్ని బలోపేతం చేస్తుందిఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళుతూమహి బన్స్వారా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ నాలుగు స్వదేశీ 700 మెగావాట్ల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను కలిగి ఉందివీటిని ఎన్పీసీఐఎల్ స్వీయ డిజైనుతో అభివృద్ధి చేసిందిఇది భారతదేశం చేపట్టిన విస్తృతమైన “ఫ్లీట్ మోడ్” కార్యక్రమంలో భాగంఈ ప్రణాళిక కింద దేశవ్యాప్తంగా ఒకే రూపకల్పనఒకే విధమైన కొనుగోలు విధానాలతో పది సమానమైన 700 మెగావాట్ల రియాక్టర్లను నిర్మిస్తున్నారుఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యయ సామర్ధ్యంవేగవంతమైన నిర్మాణంఏకీకృత నిర్వహణ నైపుణ్యం లభిస్తాయి.

భారతదేశ స్వచ్ఛ ఇంధన మౌలిక సదుపాయాలకు పెద్ద ఊపునిస్తూరాజస్థాన్‌లో సుమారు 19,210 కోట్ల రూపాయల విలువైన హరిత ఇంధన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవంశంకుస్థాపనలు చేశారుఫలోడిజైసల్మేర్జలోర్సికర్  మొదలైన ప్రాంతాల్లో నిర్మించే సౌరశక్తి ప్రాజెక్టులను ప్రారంభించారుబికనీర్‌లో సౌరశక్తి ప్రాజెక్టుకు  ఆయన శంకుస్థాపన చేశారుఆంధ్రప్రదేశ్‌లోని రామగిరిలో సోలార్ పార్కుకు శంకుస్థాపన చేశారుఈ ప్రాజెక్టులు భారతదేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో గణనీయంగా దోహదం చేస్తాయిమిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారిస్తూ,  గణనీయమైన మొత్తంలో హరిత విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి.

భారత ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన జోన్ (ఆర్ఈజెడ్కింద 13,180 కోట్ల రూపాయల పైగా విలువైన మూడు విద్యుత్ ప్రసార ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారుఇది 2030 నాటికి ఎనిమిది రాష్ట్రాలలో 181.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందిఈ పునరుత్పాదక విద్యుత్తును లోడ్ సెంటర్లకు సమర్ధవంతంగా పంపిణీ చేయడానికిగ్రిడ్ స్థిరత్వాన్ని పెంచడానికి రాజస్థాన్ ఆర్ఈజెడ్ కోసం పవర్‌గ్రిడ్ కీలకమైన ప్రసార వ్యవస్థలను అమలు చేస్తోందిఇందులో భాగంగా రాజస్థాన్‌లోని బీవార్ నుంచి మధ్యప్రదేశ్‌లోని మాండ్సర్ వరకు 765 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్లువాటి అనుబంధ సబ్‌స్టేషన్ల విస్తరణరాజస్థాన్‌లోని సీరోహీ నుంచి  మాండసౌర్మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా వరకు ట్రాన్స్‌మిషన్ లైన్లుసీరోహీ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యాన్ని పెంచడంమాండసౌర్ఖండ్వా సబ్‌స్టేషన్ల విస్తరణరాజస్థాన్‌లోని బికనేర్ నుంచి హర్యానాలోని సివానీఫతేహాబాద్ వరకుఅక్కడి నుంచి పంజాబ్‌లోని పత్రాన్ వరకు 765 కేవీ, 400 కెవీ ట్రాన్స్‌మిషన్ లైన్లుబికనేర్‌లో కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటుసివానీ సబ్‌స్టేషన్ విస్తరణ ఉన్నాయిమొత్తంగాఈ ప్రాజెక్టులు రాజస్థాన్‌లోని హరిత విద్యుత్  ఉత్పత్తి కేంద్రాల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవసరమైన ప్రాంతాలకు 15.5 గిగావాట్ల స్వచ్ఛ ఇంధనాన్ని నిరాటంకంగా సరఫరా చేయడానికి సహాయపడతాయి.

జైసల్మేర్బికనేర్‌లలో 220 కేవీ సామర్థ్యం గల మూడు గ్రిడ్ సబ్‌స్టేషన్ల (జీఎస్ఎస్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారుబార్మేర్ జిల్లాలోని శివ్ వద్ద 220 కే వీ జీఎస్ఎస్ ను ప్రారంభించారురూ.490 కోట్లకుపైగా విలువ కలిగిన ఈ ప్రాజెక్టులుఆ ప్రాంతంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

రైతులకు సాధికారత కల్పించాలన్న సంకల్పానికి అనుగుణంగాపీఎం-కుసుమ్ (ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్పథకం (కాంపోనెంట్సీకింద 3,517 మెగావాట్ల సామర్థ్యం గల ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారురాజస్థాన్మహారాష్ట్రమధ్యప్రదేశ్కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేసే ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.16,050 కోట్లకు పైగా ఉందివ్యవసాయ ఫీడర్లను సోలరైజ్ చేయడం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతోనమ్మదగిన,  స్థిరమైన విద్యుత్‌ను అందించడం దీని లక్ష్యంఇందువల్ల విద్యుత్ బిల్లులుసాగు ఖర్చులు తగ్గుతాయిగ్రామీణ ప్రాంతాల్లో ఇంధన స్వయం సమృద్ధి పెరుగుతుందిఈ ప్రయోజనాలు లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

రామ్‌జల్ సేతు లింక్ ప్రాజెక్ట్‌కు పెద్ద ఊపునిస్తూనీటి భద్రతపై తన దార్శనికతను ముందుకు తీసుకువెళుతూరాజస్థాన్‌లో 20,830 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ నీటి వనరుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన,  ప్రారంభోత్సవాలు చేశారుఇసార్డా నుంచి వివిధ ఫీడర్ల నిర్మాణానికిఅజ్మీర్ జిల్లాలో మోర్ సాగర్ కృత్రిమ జలాశయ నిర్మాణానికి,  దానికి అనుసంధానమైన చిత్తౌర్గఢ్ నుండి వచ్చే ఫీడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారుఇతర పనుల్లో బిసల్పూర్ ఆనకట్ట వద్ద ఇన్‌టేక్ పంప్ హౌస్ నిర్మాణంఖారీ ఫీడర్ పునరుద్ధరణఅలాగే పలు ఫీడర్ కాలువ నిర్మాణం  ఉన్నాయిఇసార్డా డ్యామ్ధోల్పూర్ లిఫ్ట్ ప్రాజెక్ట్టక్లీ  ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు.

ప్రతి ఒక్కరికి సురక్షితమైన,  శుభ్రమైన తాగునీటిని అందించాలన్న తన సంకల్పానికి అనుగుణంగాఅటల్ మిషన్ ఫర్ రీజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0 కింద బంస్వారాడుంగర్పూర్ఉదయపూర్సవాయి మాధోపూర్చురుఅజ్మీర్భిల్వారా జిల్లాల్లో సుమారు రూ.5,880 కోట్ల విలువైన ప్రధాన తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు

రోడ్ల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూభరత్‌పూర్ నగరంలో ఫ్లైవోవర్లుబానాస్ నది మీద వంతెన, 116 అటల్ ప్రగతి పథ్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారుబార్మేర్అజ్మీర్డుంగర్పూర్ జిల్లాలు,  ఇతర ప్రాంతాల్లోని జాతీయ,  రాష్ట్ర హైవేలకు సంబంధించిన అనేక రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించిదేశానికి అంకితం చేశారురూ.2,630 కోట్లకు పైగా విలువ కలిగిన ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ సౌలభ్యాన్నిరోడ్డు భద్రతను పెంచుతాయి.

భరత్‌పూర్‌లో 250 పడకల ఆర్బీఎం  హాస్పిటల్జైపూర్‌లో ఐటి డెవలప్‌మెంట్,  -గవర్నెన్స్ సెంటర్మకరానా నగరంలో ట్రీట్మెంట్ ప్లాంట్లు,  పంప్ స్టేషన్లతో కూడిన మురుగునీటి నిర్వహణ  వ్యవస్థ,  మండావాజుంజూను జిల్లాల్లో డ్రైనేజ్,  తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు.

రైల్వే అనుసంధానాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికిప్రధానమంత్రి మూడు రైళ్లను ప్రారంభించారుప్రధాని ప్రారంభించిన బికనేర్ ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్జోధ్పూర్–ఢిల్లీ కంటోన్మెంట్  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ఉదయపూర్ సిటీ చండీగఢ్ ఎక్స్‌ప్రెస్  రైళ్లు రాజస్థాన్ఇతర ఉత్తర రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలను అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా రాజస్థాన్‌లోని ప్రభుత్వ శాఖలు,  సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 15,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి అందచేశారువీటిలో 5,770 పైగా పశు వైద్య సహాయకులు, 4,190 జూనియర్ అసిస్టెంట్లు, 1,800 జూనియర్ ఇన్‌స్ట్రక్చర్లు, 1,460 జూనియర్ ఇంజనీర్లు, 1,200 మూడో గ్రేడ్ లెవల్-2 ఉపాధ్యాయులు ఇతరులు ఉన్నారు.


(Release ID: 2171982) Visitor Counter : 9