ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంత్ గురు రవిదాస్ 647వ జయంతి సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 23 FEB 2024 2:02PM by PIB Hyderabad

జై గురు రవిదాస్!

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్గౌరవనీయులైన సాధువులుభారత్ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులునా సోదరీసోదరులారా,

గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నానుఎంతో దూరం నుంచి గురు రవిదాస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిముఖ్యంగా పంజాబ్ నుంచి వచ్చిన సోదరీసోదరులతో వారణాసి ‘మినీ పంజాబ్’గా మారిపోయిందిఇదంతా సంత్ రవిదాస్ కృప వల్లే సాధ్యమైందితన జన్మప్రదేశానికి రమ్మని రవిదాస్‌జీ నన్ను పదేపదే పిలుస్తున్నారుఇది ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికిఆయన్ను అనుసరించే లక్షల మందికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చిందిగురువు జన్మస్థలంలో ఆయన అనుచరులందరికీ సేవ చేయడమంటే అది నాకు ఆశీర్వాదమే.

నా సోదరీసోదరులారా,

ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగాకాశీ ప్రజాప్రతినిధిగా అది నా ప్రత్యేక బాధ్యతమీ అందరినీ బెనారస్‌కు స్వాగతించడంమీకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం నా కర్తవ్యంఈ శుభదినాన నా బాధ్యతలను పూర్తి చేసే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నానుబనారస్ అభివృద్ధికి తోడ్పడే వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభంశంకుస్థాపన చేసుకోబోతున్నాంఇవి ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ ప్రదేశాన్ని మరింత సౌకర్యవంతంగాఆహ్లాదంగా మారుస్తాయివీటికి అదనంగాసంత్ రవిదాస్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేయడానికి సైతం ఎన్నో కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయిఆలయాలుఆలయ ప్రాంతాల అభివృద్ధిగుడులకు రోడ్ల నిర్మాణంఇంటర్‌లాకింగ్డ్రైనేజీల పనులుసత్సంగాలు (ధార్మిక కార్యక్రమాలు), సాధన (ఆధ్యాత్మిక ఆచారం)కు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం వివిధ నిర్మాణాలుప్రసాదాన్ని స్వీకరించేందుకు ఏర్పాట్లు తదితర పనులన్నీ లక్షలాది ఉపాసకులకు మెరుగైన సదుపాయాలను అందిస్తాయిమాఘ పూర్ణిమ సందర్భంగా ఇక్కడికి వచ్చే యాత్రికులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడమే కాకుండా.. ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారునూతనంగా ఏర్పాటు చేసిన సంత్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ రోజు నాకు లభించిందిసంత్ రవిదాస్ మ్యూజియానికి సైతం ఈ రోజే శంకుస్థాపన చేశాంఈ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈ దేశం తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి సంత్ రవిదాస్ జయంతిమాఘపూర్ణిమలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

గొప్ప సాధువుసామాజిక సంస్కర్త అయిన గాడ్గే బాబా జయంతి కూడా ఈ రోజేసంత్ రవిదాస్ మాదిరిగానే గాడ్గే బాబా సైతం పాత ధోరణుల నుంచి సమాజాన్ని బయటకు తీసుకువచ్చేందుకుఅణగారినవెనకబడిన వర్గాల సంక్షేమానికి విస్తృతంగా కృషి చేశారుగాడ్గే బాబాను బాబా సాహెబ్ అంబేద్కర్ ఆరాధించేవారుబాబా సాహెబ్ నుంచి గాడ్గే బాబా స్ఫూర్తి పొందేవారుఈ రోజు గాడ్గే బాబా పాదాలకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

స్నేహితులారా,

ఈ వేదిక వద్దకు రావడానికి ముందు సంత్ రవిదాస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించేందుకు వెళ్లానుఆ సమయంలో ఆరాధనా భావంకృతజ్ఞతతో నా మనసు నిండిపోయిందికొన్నేళ్ల క్రితంనేను రాజకీయాల్లోకి రాక ముందుఏ పదవీ లేనప్పుడు.. సంత్ రవిదాస్ బోధనల ద్వారా నాకు మార్గదర్శకత్వం లభించిందిసంత్ రవిదాస్‌కు సేవ చేయాలనే కోరిక నా హృదయంలో ఎప్పుడూ మెదులుతూ ఉండేదిసంత్ రవిదాస్‌తో ముడిపడిన సంకల్పాలు ఇప్పుడు కాశీలోనే కాకుండా దేశమంతా వాస్తవ రూపం దాలుస్తున్నాయిరవిదాస్‌ బోధనలను ప్రచారం చేయడానికి నూతన కేంద్రాలు ఏర్పాటవుతున్నాయికొన్ని నెలల క్రితం.. మధ్యప్రదేశ్‌లోని సాగర్లో సంత్ రవిదాస్ స్మారక ఆర్ట్ గ్యాలరీకి భూమి పూజ చేసే సదవకాశం నాకు లభించిందిఅభివృద్ధి అనే గంగానది కాశీలో ప్రవహిస్తోంది.

స్నేహితులారా,

అవసరం వచ్చిన ప్రతిసారి ఒక సాధువురుషి లేదా గొప్ప వ్యక్తి ఈ నేలపై జన్మించారని భారత చరిత్ర చెబుతోందిబలహీనపడినవిభజనకు గురైన భారత్‌కు నూతన శక్తిని అందించిన భక్తి ఉద్యమంలో పాల్గొన్న గొప్ప సాధువు సంత్ రవిదాస్సమాజానికి స్వాతంత్ర్యం ప్రాధాన్యాన్ని వివరించిసామాజిక అంతరాలను తొలగించేందుకు రవిదాస్ కృషి చేశారుఆ కాలంలో ఆధిపత్యంవివక్షవిభజనకు వ్యతిరేకంగా తన గళం వినిపించారుఏదైనా మతంవర్గంభావజాలానికి సంత్ రవిదాస్ పరిమితం కాలేదుఆయన అందరివాడుఅందరూ రవిదాస్‌కి చెందినవారేజగద్గురు రామదాస్ శిష్యుడిగా వైష్ణవులు సైతం ఆయన్ను గురువుగా భావిస్తారుసిక్కు సోదరీసోదరులు ఆయన పట్ల అత్యంత గౌరవాన్ని ప్రదర్శిస్తారుఆయన కాశీలో నివసించిన సందర్భంలో ఓ సూత్రాన్ని బోధించారుఅదే ‘మన్ చంగాతో కఠైౌతీ మే గంగా’ (మీ మనసు స్వచ్ఛంగా ఉంటే.. బకెట్లో కూడా మీకు గంగ కనిపిస్తుంది). కాబట్టి కాశీని గౌరవించేవారుగంగా మాతపై విశ్వాసం ఉన్నవారు రవిదాస్ జీ నుంచి స్ఫూర్తిని పొందాలిరవిదాస్ ‌ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందిఅందరి కోసం బీజేపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. 140 కోట్ల మంది భారతీయులను ఏకం చేసే మంత్రంగా ‘సబ్కా సాథ్సబ్కా వికాస్సబ్కా ప్రయాస్’ పని చేస్తోంది.

స్నేహితులారా,

సమానత్వంసామరస్యం పాఠాలను రవిదాస్ జీ బోధించారుదళితులుఅణగారిన వర్గాల పట్ల ఎల్లప్పుడూ ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారుసమాజంలో అణగారిన వర్గాల వారికి ప్రాధాన్యమివ్వడం ద్వారానే సమానత్వం వస్తుందిఅందుకే గత పదేళ్లుగా.. అభివృద్ధికి దూరంగా ఉన్నవారిపై దృష్టి కేంద్రీకరించాంఒకప్పుడు నిరుపేదలుగానిమ్నవర్గాలుగా పరిగణించిన వారి కోసం ఇప్పుడు భారీ ఎత్తున పథకాలు అమలవుతున్నాయిఇవి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ పథకాలుగా పేరు గాంచాయికరోనా పెద్ద సంక్షోభాన్ని తీసుకువచ్చిందిఆ సమయంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు మేం ఒక పథకాన్ని ప్రారంభించాంకరోనా అనంతరం కూడా మేము దానిని ఆపలేదుఎందుకంటే.. తమ ప్రయాణాన్ని నిర్దేశించుకునేలా పేదలు మారాలని మేం భావించాంవారిపై ఎలాంటి అదనపు భారం పడకూడదుఇలా భారీ స్థాయిలో అమలవుతున్న పథకం ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనూ లేదుస్వచ్ఛ భారత్ అభియాన్ చేపట్టాందేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబానికి ఉచితంగా టాయిలెట్లు నిర్మించాంఇది దళితులువెనకబడిన కుటుంబాలకు ముఖ్యంగా మన ఎస్సీఎస్టీఓబీసీ తల్లులుఅక్కాచెల్లెళ్లకు ప్రయోజనం చేకూర్చిందిగతంలో వారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

ప్రస్తుతం దేశంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమం పనిచేస్తోందిదాదాపు 11 కోట్లకు పైగా గృహాలకు అయిదేళ్ల వ్యవధిలోనే కుళాయి నీటి సౌకర్యం కల్పించాంఉచిత చికిత్స కోసం కోట్లాది పేదలు ఆయుష్మాన్ కార్డులు తీసుకున్నారుఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే చికిత్సకు దూరమై జీవితం ముగిసిపోదనే నమ్మకం వారిలో మొదటిసారి ఏర్పడిందిఅలాగేజన్ ధన్ ఖాతాల ద్వారా బ్యాంకు సేవలను పొందే హక్కు పేదలకు లభించిందిఈ ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తోందిఈ ఖాతాల ద్వారానే రైతులు కిసాన్ సమ్మాన్ నిధి పొందుతున్నారువారిలో దాదాపు 1.5 కోట్ల మంది దళిత రైతులు ఉన్నారుఫసల్ బీమా యోజన ద్వారా దళితులువెనకబడిన వర్గాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారు. 2014 ముందు కాలంతో పోలిస్తే.. ఇప్పుడు దళిత యువతకు రెట్టింపు ఉపకార వేతనాలను అందిస్తున్నాంఅలాగే.. పీఎం ఆవాస యోజన పథకం ద్వారా కోట్లాది మంది దళిత కుటుంబాల ఖాతాలకు 2022-23లో కోట్లాది రూపాయలు చేరాయితద్వారా వారికి సొంతవైన పక్కా ఇళ్లు చేకూరతాయి.

సోదరీసోదరులారా,

సమాజంలో దళితులుఅణగారినవెనకబడినపేద వర్గాలకు చెందిన వారి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం వల్లే ఇలాంటి చరిత్రాత్మక పనులను భారత్ సాధించగలిగిందిమీ సాథ్ (సహకారం), విశ్వాస్ (నమ్మకంమాకు ఉండటం వల్లే భారత్ వీటిని సాధించిందిసాధువుల మాటలు ప్రతి యుగంలోనూ మనకు మార్గనిర్దేశం చేస్తాయిహెచ్చరిస్తాయి.

రవిదాస్ జీ ఇలా అనేవారు:

జాత్ పాత్ కే ఫేర్ మహిఉరఝి రహఈ సబ్ లోగ్।

మానుష్తా కుం ఖాత్ హయీరైదాస్ జాత్ కర్ రోగ్॥

దీనినే మరో మాటగా చెప్పాలంటే.. హానికారకమైన కులమత విభజన భావనల్లో చాలా మంది చిక్కుకుపోతున్నారుకులతత్వమనే రోగం మానవత్వానికి నష్టం కలిగిస్తుందిఅంటే.. కులంమతం ఆధారంగా ఇతరులపై వివక్ష చూపించి మానవజాతికి హాని చేస్తున్నారుఎవరైనా కులం పేరుతో ఇతరులను రెచ్చగొడితే వారు కూడా మానవత్వానికి చేటు చేస్తున్నారు.

కాబట్టిసోదరీసోదరులారా,

ఇప్పుడుదేశంలోని ప్రతి దళితుడూఅణిచివేతకు గురైన ప్రతి వ్యక్తి ఓ విషయం గుర్తుంచుకోవాలికులం ఆధారిత విభజనలుఘర్షణలు రెచ్చగొట్టడందళితులుఅణగారిన వర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం పైనే ఇండీ కూటమికి చెందినవారు ఆధారపడ్డారుకుల సంక్షేమం పేరుతో వీరు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారుమీకు గుర్తుండే ఉంటుంది.. పేదవారి కోసం టాయిలెట్ల నిర్మాణం ప్రారంభించినప్పుడు వారు ఎగతాళి చేశారుజన్ ధన్ యోజనను గేలి చేశారుడిజిటల్ ఇండియాను వ్యతిరేకించారుఅంతే కాదు.. దళిత లేదా గిరిజన వ్యక్తి తమను దాటి ముందుకు వెళ్లకూడదనుకోవడం.. ఈ కుటుంబ పార్టీలకున్న మరో లక్షణందళిత లేదా గిరిజన వ్యక్తి ఉన్నత పదవులను అలంకరిస్తే వారు సహించలేరుదేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును ఎవరు వ్యతిరేకించారుఆమెను ఓడించడానికి ఏ పార్టీలన్నీ ఏకమయ్యాయిఅవన్నీ ఎన్నికల సమయంలో దళితులనువెనకబడిన వర్గాలనుగిరిజనులను తమ ఓటు బ్యాంకుగా చూసే ఈ కుటుంబ పార్టీలేఇలాంటి వ్యక్తులువారి మనస్తత్వాల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలిమనం రవిదాస్ జీ సానుకూల బోధనలను అనుసరిస్తూకులతత్వమనే ప్రతికూల ధోరణిని విడనాడాలి.

స్నేహితులారా,

రవిదాస్‌ జీ ఇలా చెబుతూ ఉండేవారు

సౌ బరస్ లౌం జగత్ మంహి జీవత్ రహి కరూ కామ్।

రైదాస్ కరమ్ హీ ధరమ్ హై కరమ్ కర్హూ నిహకామ్॥

అంటే.. కార్యమే ధర్మ సారాంశం కాబట్టి మనం వందేళ్లు జీవించినా.. చివరి వరకూ పనిచేస్తూనే ఉండాలినిస్వార్థ వైఖరితో మనం బాధ్యతలు నిర్వర్తించాలిప్రస్తుతం మన దేశానికి సంత్ రవిదాస్ జీ బోధనలు అవసరంస్వాతంత్ర్య ‘అమృత కాలం’లోకి ఈ దేశం ప్రవేశించిందిఈ అమృత కాలంలో ‘వికసిత్ భారత్’ అభివృద్ధికి అవసరమైన బలమైన పునాదిని ఇటీవలి సంవత్సరాల్లో వేశాంవచ్చే అయిదేళ్లలో ఈ పునాదులపై అభివృద్ధికి అవసరమైన నిర్మాణాన్ని మెరుగుపరచాలిపేదలుఅణగారిన వర్గాల వారి కోసం గత పదేళ్లుగా చేపడుతున్న ప్రచారాలు వచ్చే అయిదేళ్లలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందిఇవన్నీ దేశంలోని 140 కోట్ల మంది పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతాయిఅందుకే ఈ దేశంలోని ప్రతి పౌరుడూ.. తమ బాధ్యతలను నిర్వర్తించడం చాలా అవసరంమనం దేశం గురించి ఆలోచించాలివిభజనపూరిత ఆలోచనలకు దూరంగా ఉంటూ.. దేశ ఐక్యతను మనం బలోపేతం చేయాలిసంత్ రవిదాస్ జీ కృపతో ఈ దేశ ప్రజల కలలు నెరవేరతాయని నేను విశ్వసిస్తున్నానుమరోసారి సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు

సూచనఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2168970) Visitor Counter : 5