ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన


‘స్వస్థ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవా’లను ప్రారంభించనున్న ప్రధాని

మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం దేశంలో అతిపెద్ద కార్యక్రమం

సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో లక్షకు పైగా శిబిరాలు

మధ్యప్రదేశ్‌లో ఆది సేవా పర్వ్‌ను ప్రారంభించనున్న ప్రధాని: గిరిజన ప్రాంతాల్లో వరుసగా సేవా కార్యక్రమాలు

మధ్యప్రదేశ్‌లో సికిల్‌సెల్ పరీక్ష, కౌన్సెలింగ్ కార్డుల పంపిణీ

ధార్‌లో పీఎం మిత్ర పార్కును ప్రారంభించనున్న ప్రధాని

Posted On: 16 SEP 2025 2:49PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారుమధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ధార్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ’ కార్యక్రమాలను ప్రారంభిస్తారుపలు ఇతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు చేయడంతోపాటు ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

ఆరోగ్యంపోషణదారుఢ్యంస్వస్థ సశక్త భారత్ పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిబద్దతకు అనుగుణంగా... ‘స్వస్థ్ నారీ సశక్త పరివార్’రాష్ట్రీయ పోషణ మాస’ కార్యక్రమాలను ప్రారంభిస్తారుదేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లుసామాజిక ఆరోగ్య కేంద్రాలుజిల్లా ఆస్పత్రులుఇతర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారుదేశవ్యాప్తంగా లక్షకుపైగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారుమహిళలుపిల్లల ఆరోగ్యానికి సంబంధించి దేశంలో అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా ఇది నిలవనుందిదేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోజూ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు.

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమం.. మహిళలు కేంద్రంగా సమాజంలో అనారోగ్య ముందస్తు నివారణఆరోగ్య ప్రోత్సాహకవ్యాధి నిర్మూలక వైద్య సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందిఅసాంక్రమిక వ్యాధులురక్తహీనతక్షయసికిల్‌సెల్ వ్యాధుల పరీక్షముందస్తు గుర్తింపుచికిత్స సంబంధిత అంశాలను ఇది బలోపేతం చేస్తుందిఅలాగే ప్రసవానంతర సంరక్షణరోగ నిరోధకతపోషకాహారంనెలసరి సమయంలో పరిశుభ్రతజీవన శైలిమానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాల ద్వారా.. మాతా శిశుకౌమార ఆరోగ్య రక్షణనూ ప్రోత్సహిస్తుందివైద్య కళాశాలలుజిల్లా ఆసుపత్రులుకేంద్ర ప్రభుత్వ సంస్థలుప్రైవేటు ఆసుపత్రుల ద్వారా.. గైనకాలజీశిశు వైద్యంకంటినేత్రఈఎన్టీదంతచర్మవ్యాధుల చికిత్సమానసిక వైద్యం వంటి సేవలను సమీకరించాలని నిర్ణయించారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారుదాతలు ఇరక్తకోశ్ పోర్టలులో నమోదు చేసుకుంటారుమైగవ్ ద్వారా ప్రతిజ్ఞా ప్రచారాలను నిర్వహిస్తారుపీఎంజేఏవైఆయుష్మాన్ వయోవందనఏబీహెచ్ఏ కింద లబ్ధిదారులు నమోదు చేసుకుంటారుకార్డు ధ్రువీకరణఫిర్యాదుల పరిష్కారం కోసం ఆరోగ్య శిబిరాల్లో సహాయక డెస్కులను ఏర్పాటు చేస్తారుమహిళల్లోకుటుంబాల్లో సంపూర్ణ ఆరోగ్యంసంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా యోగా సదస్సులుఆయుర్వేద సంప్రదింపులుఇతర ఆయుష్ సేవలను కూడా అందిస్తారుఊబకాయ నివారణమెరుగైన పోషకాహారంస్వచ్ఛంద రక్తదానంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతుల దిశగా ప్రజా సమూహాలను ఈ కార్యక్రమం సమీకరిస్తుందిఏకోన్ముఖ సమాజ దృక్పథంతో... పోషకాహారంకౌన్సెలింగ్సంరక్షణ ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనివ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక www.nikshay.inలో ‘నిక్షయ మిత్ర’లుగా నమోదు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తారు.

ఒక్క క్లిక్‌తో ప్రధానమంత్రి మాతృవందన యోజన నిధులను దేశవ్యాప్తంగా అర్హులైన మహిళల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారుదేశంలో దాదాపు పది లక్షల మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందుతారు.

మాతాశిశు ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన సుమన్ సఖి చాట్‌బాట్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ చాట్‌బాట్ గ్రామీణమారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు సకాలంలో కచ్చితమైన సమాచారాన్ని అందిస్తూఅవసరమైన ఆరోగ్య సేవలను పొందేలా చూస్తుంది.

సికిల్‌సెల్ రక్తహీనత నిర్మూలన కోసం దేశ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా.. రాష్ట్రానికి కోటి సికిల్ సెల్ పరీక్షకౌన్సెలింగ్ కార్డులను ప్రధానమంత్రి పంపిణీ చేస్తారు.

ఆది కర్మయోగి అభియాన్‌లో భాగంగా.. మధ్యప్రదేశ్‌లో ‘ఆది సేవా పర్వ్’ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారుగిరిజనుల స్వాభిమానమూ దేశ వికాసాల సమ్మేళనాన్ని ఇది ప్రతిబింబిస్తుందిఇందులో భాగంగా ఆరోగ్యంవిద్యపోషకాహారంనైపుణ్యాబివృద్ధిజీవనోపాధిని మెరుగుపరచుకోవడంపారిశుద్ధ్యంనీటి సంరక్షణపర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ.. గిరిజన ప్రాంతాల్లో వరుస సేవా కార్యక్రమాలు చేపడతారుప్రతి గ్రామానికీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం లక్ష్యంగా.. ట్రైబల్ విలేజ్ యాక్షన్ ప్లాన్ట్రైబల్ విలేజ్ విజన్-2030పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

పొలం నుంచి ఫైబర్ వరకు (ఫాం టు ఫైబర్), ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ వరకు (ఫైబర్ టు ఫ్యాక్టరీ), ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ వరకు (ఫ్యాక్టరీ టు ఫ్యాషన్), ఫ్యాషన్ నుంచి దేశాంతరాలకు (ఫ్యాషన్ టు ఫారిన్)- ఈ 5F దృక్పథానికి అనుగుణంగా... ధార్‌లో పీఎం మిత్ర పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

2,150 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ పార్కు.. ఉమ్మడి మురుగునీటి శుద్ధి కర్మాగారంసౌర విద్యుత్ ప్లాంటుఆధునిక రోడ్లు సహా ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఆదర్శవంతమైన పారిశ్రామిక టౌన్‌షిప్‌గా నిలవనుందిఉత్పత్తులకు మెరుగైన విలువను అందించిరైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా ఈ ప్రాంత పత్తి రైతులకు ఇది విశేష ప్రయోజనం చేకూరుస్తుంది.

వివిధ వస్త్ర కంపెనీలు రూ.23,140 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు సమర్పించడం ద్వారా కొత్త పరిశ్రమలకుభారీగా ఉపాధి కల్పనకు మార్గం సుగమమైందిఇది ఎగుమతులను విశేషంగా పెంచడంతోపాటు దాదాపు లక్షల ఉద్యోగావకాశాలను అందిస్తుంది.

పర్యావరణ పరిరక్షణమహిళల ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి.. రాష్ట్రంలో చేపట్టిన ‘ఏక్ బాగియా మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందంలోని ఒక లబ్ధిదారుకు ఓ మొక్కను బహూకరిస్తారుమధ్యప్రదేశ్‌లో 10,000 మందికి పైగా మహిళలు ‘మా కీ బాగియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారుమొక్కల సంరక్షణ కోసం కావాల్సిన అన్ని వనరులనూ మహిళా సంఘాలకు అందిస్తున్నారు.


(Release ID: 2167359) Visitor Counter : 18