ప్రధాన మంత్రి కార్యాలయం
సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా ప్రముఖ సీఈవోలతో ప్రధాని సంభాషణ
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2025 8:38PM by PIB Hyderabad
సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సెమీకండక్టర్ల రంగంలోని ప్రముఖ సీఈవోలతో సంభాషించారు. ‘‘బలమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వడం సహా ఈ రంగంలో భారత నిరంతర సంస్కరణల ప్రస్థానం గురించి నేను మాట్లాడాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘ఈ రోజు సెమికాన్ ఇండియా- 2025 సందర్భంగా సెమీకండక్టర్ల రంగానికి సంబంధించిన ప్రముఖ సీఈవోలతో మాట్లాడాను. భారత్ సామర్థ్యంపై వారికి స్పష్టమైన విశ్వాసం ఉంది. సెమీకండక్టర్ ఆవిష్కరణ, తయారీ విషయంలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ మారడంపై వారికి భారీ అంచనాలున్నాయి. బలమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వడం సహా ఈ రంగంలో భారత్ నిరంతర సంస్కరణల ప్రస్థానం గురించి నేను మాట్లాడాను.’’
***
(రిలీజ్ ఐడి: 2163519)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Manipuri
,
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam