ప్రధాన మంత్రి కార్యాలయం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడిన ప్రధానమంత్రి
ఉక్రెయిన్కు సంబంధించిన ఇటీవలి పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్న అధ్యక్షుడు జెలెన్స్కీ
ఘర్షణల శాంతియుత పరిష్కారం విషయంలో భారత సుస్థిర వైఖరిని.. శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్య బలోపేతం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇరువురు నేతలు
Posted On:
30 AUG 2025 7:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వొలొదిమిర్ జెలెన్స్కీతో టెలిఫోన్లో మాట్లాడారు.
ఉక్రెయిన్కు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల పట్ల తన దృక్పథాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి తెలియజేశారు.
అధ్యక్షుడు జెలెన్స్కీకి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి.. ఘర్షణల శాంతియుత పరిష్కారం, శాంతి పునరుద్ధరణ పట్ల భారత దృఢమైన, సుస్థిరమైన వైఖరిని స్పష్టం చేశారు. ఈ విషయంలో సాధ్యమైన మేరకు అన్ని విధాలా మద్దతునందించడం పట్ల భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యంలో పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ప్రయోజనం గల అన్ని రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే అవకాశం గల మార్గాలను చర్చించారు.
సంప్రదింపులు కొనసాగించడానికి వారు అంగీకరించారు.
***
(Release ID: 2162552)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam