ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం జరగటంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని
Posted On:
27 AUG 2025 1:01PM by PIB Hyderabad
శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి ప్రాణనష్టం జరగటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం జరగటం బాధాకరం. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులందరికీ ప్రభుత్వం సహాయం చేస్తోంది. అందరూ భద్రంగా, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను”
(Release ID: 2161278)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam