రాజ్యసభ సచివాలయం
పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
27 AUG 2025 3:34PM by PIB Hyderabad
2025 ఆగస్టు 25తో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలో కింది అభ్యర్థులు ఇరువురు పోటీలో ఉన్నారు.
|
S.No
|
NAME
|
ADDRESS
|
|
1
|
Shri Buchireddy Sudershan Reddy
|
8-2-293/82/NL, 12-A MLA and MP Colony, Jubilee Hills Road No 10C TSSP Greater Hyderabad, Telangana-500033
|
|
2
|
Shri C.P. Radhakrishnan
|
Jal Bhushan, Raj Bhavan,
Walkeshwar Road, Malabar Hill, Mumbai-400035
|
ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబరు 9వ తేదీ, మంగళవారం రోజున రూమ్ నంబర్ F-101, వసుధ, పార్లమెంట్ హౌస్, న్యూఢిల్లీ చిరునామాలో జరుగుతుంది. ఆ రోజు పోలింగ్ ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది.
భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టొరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు భాగంగా ఉంటారు. రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులకు కూడా ఈ ఎలక్టొరల్ కాలేజీలో చేరడం కోసం అర్హత ఉన్నందున వారూ ఈ ఎన్నికలో పాల్గొనడానికి అర్హులు.
2025 ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీ.సీ. మోదీ పార్లమెంట్ హౌస్లో పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అదే రోజున సాయంత్రం 6.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు.
***
(रिलीज़ आईडी: 2161268)
आगंतुक पटल : 30