ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో రూ. 5,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి


కోల్‌కతా వంటి నగరాలు భారతదేశ చరిత్ర, భవిష్యత్తు.. రెండింటికి గొప్ప ప్రతిరూపాలుగా ఉన్నాయి: ప్రధాని

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో

డమ్ డమ్, కోల్‌కతా వంటి నగరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి: ప్రధానమంత్రి

21వ శతాబ్దపు భారత్‌కు 21వ శతాబ్దపు రవాణా వ్యవస్థ అవసరం. అందువల్ల నేడు దేశవ్యాప్తంగా రైల్వేల నుంచి రోడ్ల వరకు, మెట్రోల నుంచి విమానాశ్రయాల వరకు ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించటమే కాకుండా అనుసంధానత సజావుగా ఉండేందుకు వాటన్నింటిని ఏకీకృతం చేస్తున్నాం: ప్రధానమంత్రి

Posted On: 22 AUG 2025 6:14PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూ. 5,200 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనప్రారంభోత్సవం చేశారుఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం తనకు మరోసారి లభించిందన్నారునోపారా నుంచి జై హింద్ విమానాశ్రయం వరకు కోల్‌కతా మెట్రో‌లో ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నారుఈ పర్యటన‌లో చాలా మంది సహచరులతో మాట్లాడాననికోల్‌కతా ప్రజా రవాణా వ్యవస్థ ఆధునికీకరించటం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారుఆరు వరుసల ఎలివేటెడ్ కోనా ఎక్స్‌ప్రెస్‌వేకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారువేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులకు సంబంధించి కోల్‌కతాపశ్చిమ బెంగాల్ ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

"కోల్‌కతా వంటి నగరాలు భారతదేశ చరిత్రభవిష్యత్తు రెండింటికీ గొప్ప ప్రతిరూపాలుప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ చేస్తోన్న ప్రయాణంలో డమ్ డమ్కోల్‌కతా వంటి నగరాలు కీలక పాత్ర పోషిస్తాయిఅని మోదీ వ్యాఖ్యానించారునేటి కార్యక్రమం కేవలం మెట్రో ప్రారంభంరహదారి శంకుస్థాపనకే పరిమితమైనది కాదని పేర్కొన్న ఆయన.. ఆధునిక భారత్ పట్టణ రూపురేఖలను ఎలా మారుస్తుందో చెప్పేందుకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని అన్నారుఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లుఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ దేశంలోని నగరాల్లో హరిత రవాణాను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానంగా చెప్పారు. 'వ్యర్థాల నుంచి సంపద (వేస్ట్ టు వెల్త్)' కార్యక్రమం కింద నగరాలు ఇప్పుడు చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారుమెట్రో సేవలుమెట్రో నెట్‌వర్క్‌ల విస్తరణ గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ను కలిగి ఉండటం తనకు గర్వకారణమని తెలిపారు. 2014కి ముందు దేశంలో 250 కిలోమీటర్ల మెట్రో మార్గం మాత్రమే ఉండేదని.. నేడు దేశంలో మెట్రో నెట్‌వర్క్ 1,000 కిలోమీటర్లకు పైకి చేరుకుందని ప్రధానంగా చెప్పారుకోల్‌కతాలో కూడా మెట్రో విస్తరణ నిరంతరం జరుగుతోందని అన్నారుకోల్‌కతా మెట్రో రైలు నెట్‌వర్క్‌లో సుమారు 14 కిలోమీటర్ల కొత్త మార్గంఏడు నూతన స్టేషన్లు కొత్తగా వచ్చాయని పేర్కొన్నారుఇవన్నీ కోల్‌కతా ప్రజల జీవనప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతాయని అన్నారు

"21వ శతాబ్దపు భారత్‌కు 21వ శతాబ్దపు రవాణా వ్యవస్థ అవసరంఅందుకే నేడు దేశవ్యాప్తంగా రైల్వేల నుంచి రోడ్ల వరకుమెట్రోల నుంచి విమానాశ్రయాల వరకు ఆధునిక రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తూ పరస్పరం అనుసంధానిస్తున్నాంఅని ప్రధానంగా పేర్కొన్నారుఒక నగరాన్ని మరొక నగరానికి అనుసంధానించడం మాత్రమే కాకుండా.. ప్రజలకు అందుబాటులో సరైన రవాణా సదుపాయాలు ఉండేలా చూసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారుకోల్‌కతా బహుళ నమూనా అనుసంధానతలో ఈ దార్శనికతను చూడొచ్చని అన్నారుదేశంలోని అత్యంత రద్దీగా హౌరాసీల్దా అనే రెండు రైల్వే స్టేషన్లు ఇప్పుడు మెట్రోతో అనుసంధానమయ్యాయని చెప్పారుగతంలో ఈ స్టేషన్ల మధ్య ప్రయాణించేందుకు దాదాపు ఒకటిన్నర గంటలు పట్టేదనిమెట్రో వల్ల అది కొన్ని నిమిషాలకు తగ్గిపోయిందన్నారుహౌరా స్టేషన్ సబ్‌వే బహుళ నమూనా అనుసంధానతను నిర్ధారిస్తోందని పేర్కొన్నారుగతంలో తూర్పు రైల్వేఆగ్నేయ రైల్వే ప్రధాన స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చేదనిఈ సబ్‌వే నిర్మాణంతో పరస్పర మార్పిడి సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారుకోల్‌కతా విమానాశ్రయం ఇప్పుడు మెట్రో నెట్‌వర్క్‌‌తో అనుసంధానమైందని.. ఇది నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విమానాశ్రయానికి చేరుకోవటాన్ని సులభతరం చేస్తుందని ప్రధాని అన్నారు

పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని పునరుద్ఘాటించారురైల్వే విద్యుదీకరణను 100 శాతం పూర్తి చేసిన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటని ప్రధానంగా పేర్కొన్నారుపురులియాహౌరా మధ్య మెమూ రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందనీకేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నెరవేర్చిందని తెలిపారుపశ్చిమ బెంగాల్‌లోని వివిధ మార్గాల్లో ప్రస్తుతం తొమ్మిది వందే భారత్ రైళ్లురెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయని ప్రధాని తెలియజేశారు.

గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో అనేక ప్రధాన రహదారి ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు ప్రధాని తెలిపారుఅనేక ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారుఆరు వరుసల కోన ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత నౌకాశ్రయాల మధ్య అనుసంధానత గణనీయంగా పెరుగుతుందని ప్రధానంగా పేర్కొన్నారుఈ మెరుగైన అనుసంధానత కోల్‌కతాపశ్చిమ బెంగాల్‌ల భవిష్యత్తుకు కావాల్సిన పునాదిని బలపరుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీ.వీఆనంద బోస్.. కేంద్ర మంత్రులు శ్రీ శాంతను ఠాకూర్శ్రీ రవ్నీత్ సింగ్ బిట్టుడాక్టర్ సుకాంత మజుందార్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం:

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలుఅధునాతన పట్టణ అనుసంధానత విషయంలో తమ నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి కోల్‌కతాలో పలు మెట్రో రైల్వే ప్రాజెక్టులను ఆవిష్కరించారుకొత్తగా నిర్మించిన 13.61 కి.మీ.ల మెట్రో మార్గాన్నిఆయా మార్గాల్లోని మెట్రో సేవలను ప్రారంభించారుఆయన జెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్‌ను సందర్శించారుఅక్కడ నుంచి నోపారా-జై హింద్ బిమన్‌బందర్ మెట్రో రైలును ప్రారంభించారువీటితో పాటు వర్చువల్ విధానంలో సీల్దా-ఎస్‌ప్లానేడ్ మెట్రో రైలుబెలెఘాటా-హేమంత ముఖోపాధ్యాయ మెట్రో రైలును ప్రారంభించారుజెస్సోర్ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి జై హింద్ బిమన్‌బందర్ వరకు మెట్రో ప్రయాణించిన ఆయన… తిరిగి మెట్రో రైలులోనే జై హింద్ బిమన్‌బందర్‌కు వచ్చారు

కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ మెట్రో విభాగాలనుహౌరా మెట్రో స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన సబ్‌వేను ప్రారంభించారునోపారా-జై హింద్ బిమన్‌బందర్ మెట్రో మార్గం విమానాశ్రయానికి వెళ్లటాన్ని సులభతరం చేస్తుందిసీల్దా-ఎస్‌ప్లానేడ్ మెట్రో రెండింటి మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 40 నిమిషాల నుంచి కేవలం 11 నిమిషాలకు తగ్గిస్తుందిబెలెఘాటా-హేమంత ముఖోపాధ్యాయ మెట్రో‌ మార్గం ఐటీ హబ్‌కు అనుసంధానతరను పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుందిఈ మెట్రో మార్గాలు కోల్‌కతాలో అత్యంత రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాలను కలుపుతాయిఇవి ప్రయామ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయిబహుళ నమూనా అనుసంధానతను బలోపేతం చేస్తాయిలక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

ఇక్కడ రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలకు పెద్ద ఊతం ఇస్తూ.. రూ. 1,200 కోట్లతో చేపట్టనున్న 7.2 కి.మీ.ల  ఆరు వరుసల ఎలివేటెడ్ కోన ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారుఇది హౌరాచుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలు.. కోల్‌కతా మధ్య అనుసంధానతను పెంచటమే కాకుండా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందిఅంతేకాకుండా ఈ ప్రాంతంలో వాణిజ్యంపర్యాటక రంగానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

 

***


(Release ID: 2160048) Visitor Counter : 4