ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మేఘ్ నాధ్ దేశాయ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
29 JUL 2025 10:44PM by PIB Hyderabad
ప్రముఖ మేధావి, రచయిత, ఆర్థిక నిపుణుడు శ్రీ మేఘ్ నాధ్ దేశాయ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఇలా పోస్ట్ చేశారు:
‘‘ప్రముఖ మేధావి, రచయిత, ఆర్థిక నిపుణుడు శ్రీ మేఘ్నాధ్ దేశాయ్ ఇక లేరని తెలిసి బాధపడ్డాను. భారతదేశానికిగానీ, భారతీయ సంస్కృతికిగానీ ఆయన ఎన్నడూ దూరం కాలేదు. భారత్-బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కూడా తన వంతు పాత్రను పోషించారు. కలిసినపుడు మేం మాట్లాడుకున్న విషయాలూ, తాను చెప్పిన అభిప్రాయాలనూ నేడు జ్ఞాపకం చేసుకున్నాను. దేశాయ్ కుటుంబానికీ, ఆయన మిత్రులకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఓం శాంతి’’.
(Release ID: 2150094)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam