మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్- 2025’ నామినేషన్ల దాఖలుకు గడువు తేదీ ఆగస్టు 15 వరకు పొడిగింపు
*జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in లో మాత్రమే నామినేషన్ల స్వీకరణ
Posted On:
22 JUL 2025 5:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకు (పీఎంఆర్బీఆర్పీ) ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించడానికి ఆఖరి తేదీని ఆగస్టు 15 వరకూ పొడిగించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in లో ఏప్రిల్ 1 న ప్రారంభించారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీలలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బాలలకు ఈ అవార్డులు ఇస్తారు.
ఈ నెల 31 నాటికి అయిదేళ్ల వయస్సు మించిన బాలలతో పాటు వయస్సు 18 ఏళ్లకు మించని భారతీయ పౌరులు, భారత్లో నివసిస్తున్న వారు ఈ అవార్డులకు అర్హులు.
దేశ పౌరుల్లో ఎవరైనా దాఖలు చేసే నామినేషన్లను ఒక్క జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in ద్వారానే స్వీకరిస్తారు. ఈ అవార్డులకు సిఫారసులను లేదా స్వీయ నామినేషన్ను ఆన్లైన్లో దాఖలు చేస్తేనే పరిశీలిస్తారు. మరిన్ని వివరాల కోసం, జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in ను సందర్శించవచ్చు.
***
(Release ID: 2147002)
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam