ప్రధాన మంత్రి కార్యాలయం
మేఘాలయ అసాధారణ ప్రగతిని ప్రశంసిస్తూ రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
20 JUL 2025 4:39PM by PIB Hyderabad
పర్యాటకం, యువతకు సాధికారిత, మహిళల- స్వయం సహాయక సంఘాలు, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి ప్రభుత్వ పథకాల అమలు, సరిహద్దు గ్రామాల అభివృద్ధి పథకం వంటి పథకాల కారణంగా మేఘాలయా రూపురేఖలు మారిపోతున్నాయంటూ వచ్చిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రాసిన పోస్టుకు ప్రధాని స్పందించారు.
‘‘పర్యటన రంగం, యువతకు సాధికారత కల్పన, మహిళల నాయకత్వంలోని స్వయంసహాయ బృందాలు, ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’, సరిహద్దు గ్రామాల అభివృద్ధి పథకంతో పాటు ఇతర కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో మేఘాలయలో చెప్పుకోదగ్గ మార్పు చోటుచేసుకొందని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ (@nsitharaman) వివరించారు. రాష్ట్రం నిలదొక్కుకోవడానికీ, స్వావలంబన భారతదేశానికీ... ప్రభుత్వం అందిస్తున్న గట్టి మద్దతు, సామాజిక చైతన్యమే కారణం.’’
***
(Release ID: 2146289)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam