హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'రాజ్యాంగ్ హత్యా దివస్' సందర్భంగా ఢిల్లీలో 'ది ఎమర్జెన్సీ డైరీస్ - ఇయర్స్ దట్ ఫోర్జ్‌డ్ ఏ లీడర్' పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్ర హోం, సహాకార మంత్రి శ్రీ అమిత్ షా


ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుభవాల సంకలనమే ఈ పుస్తకం

యువ సంఘ్‌ ప్రచారక్‌గా అజ్ఞాతవాసంలో జీవిస్తూ మోదీ పోరాడిన తీరును వివరిస్తోన్న 'ది ఎమర్జెన్సీ డైరీస్: ఇయర్స్ దట్ ఫోర్జ్‌డ్ ఏ లీడర్'
ప్రజాస్వామ్య మూలాలను బలపరిచేందుకు ప్రధానమంత్రిగా మోదీకి ప్రేరణనిస్తోన్న అత్యవరస పరిస్థితి నాటి ఆయన పోరాటం

ప్రతి గ్రామానికి వెళ్లి కుటుంబ రాజకీయాలను కాపాడుకునేందుకు విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రధాని.. 2014లో కుటుంబ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకలించిన మోదీ

Posted On: 25 JUN 2025 7:57PM by PIB Hyderabad

'రాజ్యాంగ హత్యా దివస్సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 'ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్జ్‌డ్ ఏ లీడర్అనే పుస్తకాన్ని కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా విడుదల చేశారుఅత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనుభవాల సంకలనం చేస్తూ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారుకేంద్ర ఎలక్ట్రానిక్స్ఐటీరైల్వేసమాచారప్రసార మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా.. ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తాఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ్నానాజీ దేశ్‌ముఖ్ నేతృత్వంలో జరిగిన 19 నెలల అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో అజ్ఞాతవాసంలో ఉంటూ మోదీ పోరాటాన్ని కొనసాగించిన తీరుతో పాటు సంఘ్ ప్రచారక్‌గా ఆ సమయంలో ఆయన చేసిన కృషిని ఈ పుస్తకం వివరిస్తోందన్నారుమిసా చట్టం కింద జైలుకు వెళ్లిన వారి ఇళ్లకు ఎలా వెళ్లారు!..  వారి కుటుంబాలతో మాట్లాడి వారి చికిత్స కోసం ఏ విధంగా ఏర్పాట్లు చేశారుఅన్న దానిని ఈ పుస్తకం తెలియజేస్తోందిరహస్యంగా ప్రచురితమైన వార్తా పత్రికలను మార్కెట్లలో విద్యార్థులుమహిళలకు పంపిణీ చేస్తూ 25 ఏళ్ల గుజరాతీ యువకుడైన మోదీ పోరాటం కొనసాగించారుదీనిని కూడా పుస్తకం వివరిస్తోందిఆ సమయంలో మోదీ ఆజ్ఞాతవాసంలోనే పనిచేశారని.. కొన్ని సార్లు సాధువుగాకొన్ని సార్లు సర్దార్జీగాకొన్నిసార్లు హిప్పీగాకొన్నిసార్లు అగరుబత్తీల విక్రేతగాకొన్నిసార్లు వార్తాపత్రిక విక్రేతగా పనిచేసేవారని అమిత్‌షా అన్నారు.

అప్పటి ప్రధానమంత్రి నియంతృత్వ ఆలోచనలను వ్యతిరేకించింది 25 ఏళ్ల యువకుడని కేంద్ర హోం మంత్రి అన్నారుకుటుంబ రాజకీయాలను మళ్లీ తెచ్చేందుకు అత్యవసర పరిస్థితిని విధించారు కానీ ఇంటింటికీగ్రామ గ్రామానికీప్రతి నగరానికీ మోదీ వెళ్లి నిరసన తెలిపారుచివరకు ఆయనే 2014లో దేశంలో కుటుంబ రాజకీయాలను నిర్మూలించారుమీడియా సెన్సార్‌షిప్ప్రభుత్వ అణచివేత.. సంఘ్జనసంఘ్ పోరాటం.. అత్యవసర పరిస్థితి బాధితుల వివరణలునియంతృత్వం ధోరణి నుంచి ప్రజా భాగస్వామ్యం వరకు.. ఇలా ఈ పుస్తకంలో అయిదు అధ్యాయాలు ఉన్నాయని అమిత్ షా తెలిపారు

యువత ఈ పుస్తకాన్ని చదవాలని హోం మంత్రి కోరారుతద్వారా తొలినాళ్లలో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ యువకుడే ఈ దేశంలో ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేస్తున్నారనిఆయనే మన ప్రధానమంత్రి అని తెలుసుకుంటారని అన్నారు

 

***


(Release ID: 2139744)