ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని


ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మారుతోన్న పరిస్థితుల గురించి వివరాలను ప్రధాని మోదీకి తెలిపిన ఆ దేశ ప్రధాని


భారత్‌‌కు ఉన్న ఆందోళనలు తెలిపిన మోదీ.. శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం అందని ప్రధానంగా పేర్కొన్న ప్రధాని

Posted On: 13 JUN 2025 11:15PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు. 

 

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి పరిణామాలు, మారుతున్న పరిస్థితుల గురించిన వివరాలను ఆ దేశ ప్రధాని మోదీకి తెలియజేశారు. 

 

భారత్‌ తరఫున ఆందోళనను ప్రధాని మోదీ ఆదేశ నాయకుడితో పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు. 


ఇద్దరు నాయకులు ఒకరికి ఒకరు అందుబాటులో ఉండేందుకు అంగీకరించారు. 


(Release ID: 2138939) Visitor Counter : 2