ప్రధాన మంత్రి కార్యాలయం
పట్టణాల్లో స్వచ్ఛ, హరిత రవాణాను ప్రోత్సహించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధానమంత్రి
Posted On:
05 JUN 2025 12:46PM by PIB Hyderabad
పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధిని, హరిత రవాణా సాధనాలను ప్రోత్సహించే ధ్యేయంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.
ఈ కార్యక్రమం స్వచ్ఛ, హరిత ఢిల్లీ ఆవిష్కారానికి తోడ్పడుతుందని ప్రధాని అన్నారు. ఈ చర్య ఢిల్లీ ప్రజలకు ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరుస్తుంది కూడా అని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి ఎక్స్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు:
‘‘స్వచ్ఛ, హరిత ఢిల్లీకి రూపకల్పన. పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధిని, స్వచ్ఛ రవాణా సాధనాలను ప్రోత్సహించే ధ్యేయంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాను. దీనికి అదనంగా, ఈ కార్యక్రమం ఢిల్లీ ప్రజలకు ‘జీవన సౌలభ్యాన్ని’ కూడా మెరుగుపరుస్తుంది.’’
***
(Release ID: 2134425)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam