ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని దాహోద్‌లో రూ. 24,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


* వికసిత భారత్‌ను నిర్మించేందుకు ఏకమైన140 కోట్ల మంది భారతీయులు: పీఎం

* మన దేశాభివృద్ధికి అవసరమైనవాటి తయారీ ఇక్కడే, భారత్‌లోనే: పీఎం

* మునుపెన్నడూ లేని విధంగా గడచిన 11 ఏళ్లలో గిరిజన సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక ప్రయత్నాలు: పీఎం

* ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు.. అది భారతీయుల విలువలు, భావోద్వేగాల ప్రతిరూపం: పీఎం

Posted On: 26 MAY 2025 2:42PM by PIB Hyderabad

గుజరాత్‌లోని దాహోద్ లో రూ.24,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనప్రారంభోత్సవంజాతికి అంకితం చేశారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2014లో తాను మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే 26నే కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైనదని అన్నారుదేశాన్ని నడిపించే బాధ్యతను నిర్వర్తించడంలో గుజరాత్ ప్రజలు తనకు అందించిన మద్దతునుఆశీర్వాదాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారుఈ నమ్మకంప్రోత్సాహమే దేశానికి రేయింబవళ్లు సేవ చేయాలనే తన అంకితభావానికి ఆధారంగా నిలిచాయని పేర్కొన్నారుదశాబ్దాల తరబడి అనుసరిస్తున్న పాత పద్దతులను వదిలించుకుని ప్రతి రంగంలోనూ దూసుకువెళ్లేలా గడచిన కొన్నేళ్లలో భారత్ అసాధారణమైనఊహకందని నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ఈరోజు నిరాశచీకటి నుంచి బయటపడి సరికొత్త విశ్వాసంఆశావాదం నిండిన కొత్తయుగంలోకి దేశం అడుగుపెట్టింది’’ అని చెప్పారు.

‘‘వికసిత్ భారత్‌ను నిర్మించడానికి 140 కోట్ల మంది భారతీయులు ఏకమయ్యారు’’ అని శ్రీ మోదీ అన్నారుఅవసరమైన వస్తువులను భారత్‌లోనే తయారు చేయాల్సిన ప్రాధాన్యాన్నిఈ సమయంలో స్వావలంబన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారుఅంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందనిదేశీయ ఉత్పత్తిఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారుప్రస్తుతం భారత్ స్మార్ట్ ఫోన్లుఆటోమొబైల్స్బొమ్మలురక్షణ సామగ్రిఔషధాలతో సహా వివిధ రకాలు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని పేర్కొన్నారురైలుమెట్రో టెక్నాలజీలను రూపొందించడం మాత్రమే కాకుండా వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోందని తెలిపారువేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమైన దాహోద్‌ను ఈ అభివృద్ధికి ప్రధాన ఉదాహరణగా శ్రీ మోదీ అభివర్ణించారుదాహోద్ విద్యుత్ రైలింజన్ల కర్మాగారాన్ని ప్రధాన విజయంగా పేర్కొన్నారుఈ పరిశ్రమకు మూడేళ్ల క్రితం భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు ఇక్కడ మొదటి విద్యుత్ రైలింజన్ విజయవంతంగా తయారైందని హర్షం వ్యక్తం చేశారువిద్యుత్ రైలింజన్ను ప్రారంభిస్తూ... ఇది గుజరాత్‌కుదేశానికి గర్వకారణమని పేర్కొన్నారువీటికి అదనంగారైల్వేల్లో నూరు శాతం విద్యుద్దీకరణ లక్ష్యాన్ని గుజరాత్ పూర్తి చేసిందని వెల్లడించారుదీనిని గొప్ప మైలురాయిగా వర్ణించిన ప్రధానిగుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

దాహోద్‌తో తనకు సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధాన్నిఈ ప్రాంతంతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారుదాహోద్‌ను దశాబ్దాలుగా సందర్శిస్తున్నాననిమొదట్లో సైకిల్‌పై ఈ ప్రాంతంలో తిరిగేవాడినని చెప్పారుఆ అనుభవాలే.. దాహోద్‌లోని సమస్యలనుఈ ప్రాంత సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడ్డాయని వివరించారుముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనూ ఈ ప్రాంతాన్ని తరచూ సందర్శించేవాడిననిఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారుదాహోద్‌లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం తనకు ఎనలేని సంతృప్తి కలిగిస్తుందనిఈ రోజు తనకు మరో అర్థవంతమైన రోజని తెలిపారు.

గడచిన 10-11 ఏళ్లుగా భారతీయ రైల్వే రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని శ్రీ మోదీ తెలిపారుమెట్రో సేవల విస్తరణసెమీ-హై-స్పీడ్ రైళ్ల ప్రారంభం దేశవ్యాప్తంగా రవాణా అనుసంధానాన్ని మారుస్తున్నాయని వివరించారువందే భారత్ రైళ్లు ప్రస్తుతం 70 మార్గాల్లో సేవలు అందిస్తూ భారత రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారుఅహ్మదాబాద్ నుంచి వెరావల్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారుదేశ సాంకేతికత రంగంలో వస్తున్న పురోగతులే భారత్‌లో ఆధునిక రైళ్లు పెరగడానికి కారణమని శ్రీమోదీ పేర్కొన్నారురైలు పెట్టెలురైలింజన్లు ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయనిదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని తెలిపారు. ‘‘రైల్వే ఎగుమతుల్లో అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించింది’’ అని శ్రీ మోదీ తెలిపారుఇండియాలో తయారైన మెట్రో కోచ్‌లు ఆస్ట్రేలియాకుట్రైన్ కోచ్‌లు ఇంగ్లాండ్సౌదీ అరేబియాఫ్రాన్స్‌కు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారుమెక్సికోస్పెయిన్జర్మనీఇటలీ దేశాలకు రైల్వే సంబంధిత విడిభాగాలు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారుభారత్ లో తయారైన ప్యాసింజర్ పెట్టెలు మొజాంబిక్శ్రీలంక దేశాల్లో వినియోగిస్తున్నారని తెలిపారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ రైలింజన్లు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారుది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిరంతర విస్తరణను తెలియజేస్తుందనిజాతి గౌరవాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌ సౌకర్యాన్ని పెంచటమే కాకుండా వ్యవసాయంపరిశ్రమలకు ఊతమిస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారుగత దశాబ్దంలో దేశంలో అనేక ప్రాంతాలు మొదటి సారిగా రైల్వే సదుపాయాన్ని అందుకున్నాయని తెలిపారుగతంలో గుజరాత్‌లో చాలా ప్రాంతాల్లో కేవలం చిన్న రైళ్లునెమ్మదిగా కదిలే రైళ్లు మాత్రమే నడిచేవని.. ఇప్పటికే పలు నారో గేజ్ మార్గాలను మార్చినట్లు తెలిపారుగిరిజన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే దహోద్వాల్సాద్ మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు సహా అనేక రైలు మార్గాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారుపరిశ్రమలు భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్న ప్రధాని.. దహోద్ రైల్వే కర్మాగారం 9,000 హార్స్‌పవర్ రైలిజంన్లను తయారు చేస్తుందని తెలిపారురైళ్ల విషయంలో దేశ శక్తిసామర్థ్యాన్ని ఇది పెంచుతుందని పేర్కొన్న మోదీ.. దహోద్‌లో ఉత్పత్తి చేసే ప్రతి రైలింజన్ ఈ నగరం పేరును కలిగి ఉంటుందని తెలియజేశారుఈ పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో వేల కొద్ది రైలింజన్లను తయారు చేయటం ద్వారా భారీగా ఉపాధిని కల్పిస్తుందన్నారుఈ పరిశ్రమ రైల్వే ఉపకరణాలను ఉత్పత్తి చేసే చిన్న స్థాయి పరిశ్రమలను కూడా మద్దతు ఇస్తుందనితద్వారా సమీప ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారుఉపాధి కల్పన ప్రయోజనాలు ఈ పరిశ్రమకు మాత్రమే పరిమతి కావని.. రైతులుపశు పోషకులుదుకాణదారులుకార్మికుల‌కు కూడా లాభం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారుఇది విస్తృతంగా ఆర్థిక పురోగతి జరిగేలా చూసుకుంటుందని అన్నారు

విద్యఐటీసెమీకండక్టర్లుపర్యాటకం వంటి బహుళ రంగాలలో గుజరాత్ అద్భుతమైన పురోగతి సాధించిందని ప్రధాని తెలిపారువివిధ పరిశ్రమలలో రాష్ట్రం తనను తాను అగ్రగామిగా స్థిరపరచుకుందని ప్రధానంగా చెప్పారువేల కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లో ప్రధానమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటువుతోందనిఇది ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారుఇవన్నీ గుజరాత్‌లోని లక్షలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయనితద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధికిఅభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

గుజరాత్‌లో దహోద్వడోదరగోద్రాకలోల్హలోల్‌లు హైటెక్ ఇంజనీరింగ్తయారీ కారిడార్‌గా మారాయని ప్రధానంగా వ్యాఖ్యానించిన మోదీ.. విమానాల తయారీలో వడోదర వేగంగా దూసుకెళ్తోందనికొన్ని నెలల క్రితం ఎయిర్‌బస్ అసెంబ్లీ కేంద్రం ప్రారంభమైందని పేర్కొన్నారువడోదర దేశంలోనే మొట్టమొదటి గతి శక్తి విశ్వవిద్యాలయానికి కూడా నిలయంగా ఉందని అన్నారుసావ్లిలో ఇప్పటికే ఒక ప్రధాన రైల్వే బోగీల తయారీ కర్మాగారం ఉందనిదహోద్ ఇప్పుడు 9,000-హార్స్‌పవర్ ఇంజిన్లతో కూడిన దేశంలోనే అత్యంత శక్తివంతమైన రైలింజన్లను తయారు చేసే కేంద్రాన్ని కలిగి ఉందని ప్రధానంగా పేర్కొన్నారుఇది దేశానికే గర్వకారణమని వ్యాఖ్యానించారుగోద్రాకలోల్హలోల్‌లు తయారీ యూనిట్లుచిన్న పరిశ్రమలుఎమ్‌ఎస్‌ఎమ్ఈలను కలిగి ఉన్నాయనిఇవి గుజరాత్ పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారుసైకిళ్లుమోటార్ సైకిళ్ల నుంచి రైల్వే ఇంజిన్లువిమానాల వరకు ప్రతిదీ తయారు చేసే ప్రాంతంగా మారేందుకు గుజరాత్‌కు మంచి భవిష్యత్ ‌ఉందని ఆశాభావం వ్యక్తం చేశారుఇటువంటి అధునాతన ఇంజనీరింగ్తయారీ రంగ కారిడార్ ఉండటం ప్రపంచంలోనే చాలా అరుదు అనిఇది పారిశ్రామిక శక్తి కేంద్రంగా రాష్ట్ర స్థానాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.

"అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించేందుకు గిరిజన ప్రాంతాల అభివృద్ధి చాలా అవసరంఅని మోదీ ప్రధానంగా వ్యాఖ్యానించారుగత 11 సంవత్సరాలుగా గిరిజన సమాజాలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు చాలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారురాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చేసిన పనుల సుదీర్ఘ అనుభవం జాతీయ స్థాయిలో కార్యక్రమాలకు దోహదపడిందని వ్యాఖ్యానించారుగుజరాత్‌లోని గిరిజన పిల్లలు శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసించటంలో సవాళ్లను ఎదుర్కొన్న సమయాన్ని గుర్తు చేసిన మోదీ.. నేడు మొత్తం గిరిజన ప్రాంతాలు నాణ్యమైన విద్యను పొందుతున్నాయని.. మంచి కళాశాలలుఐటీఐలువైద్య కళాశాలలురెండు ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయని ప్రధానంగా చెప్పారుగత 11 సంవత్సరాలుగా ఏకలవ్య మోడల్ పాఠశాలల నెటవర్క్ గణనీయంగా బలోపేతమైందనిఇవి గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా అందేలా చూసుకుంటున్నాయని అన్నారుకేవలం దహోద్‌లోనే అనేక ఏకలవ్య మోడల్ పాఠశాలలు ఉన్నాయనిఇవి గిరిజన విద్యకు మరింత మద్దతు ఇస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గిరిజనుల అభివృద్ధికి జరుగుతోన్న పనులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. స్వతంత్ర భారత్‌ చరిత్రలో తొలిసారిగా గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 'ధర్తీ ఆబా జన్‌జాతీ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ఒక కీలక కార్యక్రమమనిదీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 80,000 కోట్లు ఖర్చు చేసిందని అన్నారుఈ పథకం కింద గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా 60,000కి పైగా గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారుజీవన నాణ్యతను పెంచేందుకు  ఈ గ్రామాల్లో విద్యుత్ సదుపాయం కల్పిస్తూ.. నీరురోడ్లుపాఠశాలలుఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు ప్రధానంగా చెప్పారుగిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామనిఈ వర్గాలకు జీవన నాణ్యతలో మెరుగుదల వచ్చేలా చూసుకుంటాని ప్రధానంగా చెప్పారు

అత్యంత వెనుకబడిన గిరిజనుల అభ్యున్నతి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన మోదీ.. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతోన్న వారికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారుదశాబ్దాలుగా అవసరమైన సదుపాయాలు లేకుండా ఉన్న అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం మొదటిసారిగా ప్రధానమంత్రి జన్మన్ యోజనను ప్రవేశపెట్టిందని ప్రధానంగా చెప్పారుఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో కొత్త మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామనికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామనితద్వారా ఈ వర్గాలకు మరింత ఆర్థికసామాజిక సమ్మిళితత్వం అందేలా చూసుకుంటున్నామని వ్యాఖ్యానించారు

రక్తహీనత నుంచి ఆదివాసీ సమాజాలను విముక్తం చేయడానికి జాతీయ మిషన్ ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూదీనికింద ఇప్పటికే లక్షలాది మంది ఆదివాసీ ప్రజలు స్క్రీనింగ్ చేయించుకున్నారని పేర్కొన్నారువెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారుగతంలో 100కు పైగా జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా వర్గీకరించారనివాటిలో చాలా వరకు గిరిజన ప్రాబల్య ప్రాంతాలేనని ఆయన అన్నారుఅటువంటి జిల్లాలలో ఒకటైన దాహోద్ నేడు ఒక ఆకాంక్షాత్మక జిల్లాగా పురోగమిస్తోందనిఆధునిక మౌలిక సదుపాయాలు,  స్మార్ట్ సౌకర్యాలతో మార్పు చెందుతోందని తెలిపారుదక్షిణ దాహోద్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొందనికానీ ఇప్పుడువందల కిలోమీటర్ల పైపులైన్లు వేశారనినర్మదా నీరు ప్రతి ఇంటికీ చేరుతోందని చెప్పారుగత కొన్నేళ్లుగా ఉమర్గాం నుంచి అంబాజీ వరకు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం వల్ల గిరిజనులకు వ్యవసాయం సులువైందన్నారు.

వడోదరలో దేశాన్నిదాని సాయుధ దళాలను గౌరవించడానికి వేలాది మంది మహిళలు ఒక్కచోట చేరడాన్ని ప్రస్తావిస్తూఅలుపెరగని మద్దతు ఇస్తున్న భారత మహిళలకు తన ప్రగాఢ గౌరవాన్నికృతజ్ఞతను తెలియజేశారుదాహోద్ త్యాగంఅంకితభావం కలిగిన భూమి అని ఆయన తెలిపారుసృష్టిని రక్షించడానికి దధీచి మహర్షి దుధిమతి నది ఒడ్డున తన ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారుసంక్షోభ సమయాల్లో ఈ ప్రాంతం స్వాతంత్ర్య సమరయోధుడు తాంతియా తోపేకు మద్దతు ఇచ్చిందనిఅటు మంగర్ ధామ్ గోవింద్ గురువందలాది మంది గిరిజన యోధుల త్యాగాలకు చిహ్నంగా నిలుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారుభారతదేశపు సాంస్కృతిక విలువలు అన్యాయాన్ని ఎదుర్కోవాలని కోరుకుంటాయని అంటూజమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశం మౌనంగా ఉండగలదా అని ప్రశ్నించారు. “ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదుఅది భారతీయుల విలువలుభావోద్వేగాల ప్రతిబింబం” అని అన్నారుఉగ్రవాదులు తమ చర్యల పర్యవసానం గురించి అంచనా లేకుండా  ప్రవర్తించారని అంటూపిల్లల ముందు ఒక తండ్రిని కిరాతకంగా హత్య చేసిన దృశ్యాన్ని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయులను ఉగ్రవాదం సవాలు చేసిందనిఅలాంటి దృశ్యాలు దేశమంతటా ఇంకా ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయని ఆయన అన్నారుదేశ నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించాననిభారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోవారు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ప్రత్యేక ఆపరేషన్ ను నిర్వహించారని శ్రీ మోదీ తెలిపారుసరిహద్దుకు అవతల తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాలను గుర్తించికేవలం 22 నిమిషాల్లో ధ్వంసం చేశారని పేర్కొన్నారుపాకిస్తాన్ సైన్యం ప్రతిచర్యకు ప్రయత్నించినప్పటికీభారత దళాలు వాటిని నిర్ణయాత్మకంగా తిప్పికొట్టాయని ఆయన పేర్కొన్నారు.. భారత సాయుధ దళాల ధైర్యసాహసాల పట్ల తన ప్రగాఢ గౌరవాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారుపవిత్ర భూమి దాహోద్ నుంచి వారి ధైర్యానికిఅంకితభావానికి అభివందనం చేశారు.  

దేశ విభజన తర్వాత పుట్టిన దేశం భారత్ పట్ల శత్రుత్వంహాని కలిగించడంపై దృష్టి సారించిందని ప్రధాని వ్యాఖ్యానించారుమరోవైపు పేదరిక నిర్మూలనఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంఅభివృద్ధిని సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.

విభజన తరువాత ఏర్పడిన దేశం భారత్‌ పట్ల శత్రుత్వంతో పాటు హాని కలిగించడంపై దృష్టి పెట్టిందని అయితే  “భారత్ పేదరిక నిర్మూలనఆర్థిక స్థిరీకరణఅభివృద్ధి సాధన పట్ల నిబద్ధత కలిగి ఉందని”  ఆయన పేర్కొన్నారుసాయుధ బలగాలుఆర్థిక వ్యవస్థ రెండూ బలంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందిన భారత్ ను సాధించగలమని ప్రధాని ఉద్ఘాటించారుజాతీయ భద్రతఆర్థిక వృద్ధి కలిసికట్టుగా సాగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

దాహోద్ అపారమైన సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూఈ కార్యక్రమం దాని సామర్థ్యాలకు ఒక నిదర్శనం మాత్రమే అని పేర్కొన్న శ్రీ మోదీదాహోద్ ప్రజలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారుఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన సౌకర్యాలను వారు సద్వినియోగం చేసుకునిదాహోద్ ను దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాలలో ఒకటిగా తీర్చిదిద్దుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారుదాహోద్‌ ప్రజలను మరోసారి అభినందిస్తూవారి నిబద్ధతపురోగతిపై తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్కేంద్ర రైల్వేసమాచార,  ప్రసారఎలక్ట్రానిక్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌,  పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

నేపథ్యం

ప్రపంచ స్థాయి ప్రయాణ సదుపాయాలు కనెక్టివిటీని మెరుగు పరచాలన్న నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి దాహోద్‌లో భారత రైల్వేకు చెందిన లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారుఈ కర్మాగారంలో దేశీయ అవసరాలకే కాకుండా ఎగుమతుల కోసం కూడా 9000 హెచ్‌పీ సామర్థ్యం గల విద్యుత్తు ఇంజన్లను తయారు చేస్తారుఈ కర్మాగారంలో తయారైన తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారుఈ లోకోమోటివ్‌లు భారత రైల్వే సరకు లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయిపునరుత్పాదక బ్రేకింగ్ వ్యవస్థలతో ఈ లోకోమోటివ్‌లు తయారవుతున్నాయి,  విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా వీటిని రూపొందించారుతద్వారా ఇవి పర్యావరణ సుస్థిరతకు దోహదపడతాయి

తర్వాతప్రధానమంత్రి దాహోద్‌లో రూ.24,000 కోట్లకు పైగా విలువ గల పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారువీటిలో రైలు ప్రాజెక్టులు గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయివేరావల్ అహ్మదాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌నువల్సాద్ దాహోద్ స్టేషన్ల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

 

 

***

MJPS/SR


(Release ID: 2131381)