ప్రధాన మంత్రి కార్యాలయం
తిరుగుబాటు నుంచి ఏకీకరణ వరకు బస్తర్ ప్రస్థానం...ప్రజాకేంద్రిత పాలన శక్తికి అద్దం పట్టే వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని
Posted On:
26 MAY 2025 3:07PM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. తిరుగుబాటు నుంచి ఏకీకరణ వరకు బస్తర్ సాగించిన ప్రస్థానాన్ని ఈ వ్యాసం క్షుణ్నంగా వివరించడమే కాక, ప్రజలను కేంద్ర స్థానంలో నిలుపుతూ సాగించే పాలనకు ఎంతటి శక్తి ఉంటుందో అద్దంపట్టింది.
ఛత్తీస్గఢ్ సీఎంఓ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూ:
‘‘తిరుగుబాటు నుంచి ఏకీకరణ వరకు బస్తర్ సాగించిన ప్రస్థానం ప్రజా-కేంద్రిత పాలనకు ఉన్న శక్తిని ప్రతిబింబిస్తోంది. గిరిజన సంక్షేమం, భద్రత, అభివృద్ధి.. ఇవి ఏ విధంగా ఛత్తీస్గఢ్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందీ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి (@vishnudsai) వివరించారు. తప్పక చదవాల్సిన రచన ఇది!’’ అని పేర్కొంది.
***
MJPS/SR
(Release ID: 2131306)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam