పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదన్న భారత్


దృఢమైన సందేశాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు

Posted On: 17 MAY 2025 9:19AM by PIB Hyderabad

ఆపరేషన్ సింధూర్సీమాంతర ఉగ్రవాదంపై భారత్ కొనసాగిస్తున్న పోరాటం నేపథ్యంలో ఏడు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు ఈనెల తరువాత ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్య దేశాలతో సహా కీలక భాగస్వామ్య దేశాలను సందర్శించనున్నాయి.

అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న జాతీయ ఏకాభిప్రాయంఅవలంబిస్తున్న దృఢమైన విధానాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడం అఖిలపక్ష ప్రతినిధుల పర్యటన ఉద్దేశంఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదన్న భారత్ బలమైన సందేశాన్ని వారు ప్రపంచానికి చేరవేయనున్నారు.

ప్రతి ప్రతినిధి బృందంలో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులురాజకీయ ప్రముఖులుప్రముఖ దౌత్యవేత్తలు ఉంటారు.

ఈ కింద పేర్కొన్న పార్లమెంటు సభ్యులు ఏడు ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహిస్తారు

1)   శ్రీ శశిథరూర్ ఐఎన్ సీ 

2)   శ్రీ రవి శంకర్ ప్రసాద్ బిజెపి 

3)   శ్రీ సంజయ్ కుమార్ ఝాజెడియు 

4)   శ్రీ వైజయంతి పండాబిజెపి

5)  శ్రీమతి కనిమొళి కరుణానిధిడిఎంకె 

6)   శ్రీమతి సుప్రియ సూలేఎన్సిపి

7)   శ్రీ శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండేశివసేన 

 

***


(Release ID: 2129419)