ప్రధాన మంత్రి కార్యాలయం
సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
16 MAY 2025 10:13AM by PIB Hyderabad
సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సిక్కిం రాష్ట్రంగా అవతరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనది! ప్రకృతి రమణీయత, సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, కష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన రాష్ట్రమే సిక్కిం’’ అని శ్రీ మోదీ అన్నారు.
ప్రధానమంత్రి ఎక్స్లో చేసిన పోస్టు:
‘‘సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు! 50 వ అవతరణ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనది.
ప్రకృతి రమణీయత, సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, కష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన ఈ రాష్ట్రం.. వివిధ రంగాల్లో గొప్ప ప్రగతి సాధించింది. ఈ సుందరమైన రాష్ట్రానికి చెందిన ప్రజలు మరింత వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.’’
(Release ID: 2129029)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam