ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళలోని తిరువనంతపురంలో విజింజామ్ అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 02 MAY 2025 2:06PM by PIB Hyderabad

కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ జీముఖ్యమంత్రి శ్రీ పివిజయన్ జీనా కేంద్ర మంత్రివర్గ సహచరులువేదికపై ఉన్న ఇతర ప్రముఖులుకేరళకు చెందిన నా సోదర సోదరీమణులారా...

ఎల్లవర్క్కుమ్ ఎండే నమస్కారం. ఒరిక్కల్ కూడి శ్రీ అనంతపద్మనాభండే మణ్ణిలేక్క వరాన్  సాధిచ్చదిల్ ఎనిక్క అతియాయ్  సంతోష్ముండ్!

మిత్రులారా...

ఈరోజు భగవాన్ ఆదిశంకరాచార్య జయంతిమూడేళ్ల కిందట సెప్టెంబరులో ఆదిశంకరాచార్యుల పవిత్ర జన్మస్థలాన్ని సందర్శించే భాగ్యం నాకు కలిగిందినా పార్లమెంటరీ నియోజకవర్గమైన కాశీలోని విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్సులో ఆదిశంకరాచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందిఉత్తరాఖండ్లోని పవిత్ర కేదారనాథ్ ధామ్ లో ఆది శంకరాచార్యుల దివ్య విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం కూడా నాకు దక్కిందిఈరోజుకు మరో ప్రత్యేకత ఉంది.  దేవభూమి ఉత్తరాఖండ్ లో కేదారనాథ్ ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకునే విశేష దినమిదికేరళను దాటి ఆదిశంకరాచార్యులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలను స్థాపించి దేశాన్ని జాగరూకం చేశారు పవిత్ర దినాన నేను ఆయనకు వినమ్రపూర్వకంగా నమస్కరిస్తున్నాను.

మిత్రులారా...

ఓవైపు అపారమైన అవకాశాలను అందించే విస్తారమైన సముద్రంమరోవైపు అబ్బురపరిచే ప్రకృతి సౌందర్యం.. వీటి నడుమ ఇప్పుడు విజింజామ్ డీప్ వాటర్ సీ పోర్ట్ నవయుగ అభివృద్ధికి సంకేతంగా నిలుస్తోంది ఘనత సాధించినందుకు కేరళ ప్రజలతోపాటు యావద్దేశానికి నా అభినందనలు.

మిత్రులారా...

విజింజామ్ డీప్ వాటర్ సీ పోర్టును రూ. 8,800 కోట్లతో అభివృద్ధి చేశాంసరకు రవాణాలో భిన్న కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న  ఓడరేవు సామర్థ్యం మున్ముందు మూడు రెట్లు పెరుగుతుందిదీంతో ప్రపంచంలోని అతిపెద్ద సరుకు రవాణా నౌకలు సులువుగా ఇక్కడికి రావడానికి వీలు కలుగుతుందిఇప్పటిదాకా దేశ సరకు రవాణా కార్యకలాపాల్లో (ఒక నౌక నుంచి మరో నౌకకు సరకు మార్చడం వంటివి) 75% విదేశీ ఓడరేవుల్లోనే జరిగేవిదీంతో దేశం గణనీయంగా ఆదాయాన్ని కోల్పేయేది పరిస్థితి మారుబోతోందిఇప్పుడు మన డబ్బు మనకే ఉపయోగపడుతుంది.  ఇప్పుడు బయటవాళ్ళకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి ఇకపై  నిధులు కేరళవిజింజామ్ ప్రజలకు కొత్త ఆర్థిక అవకాశాలను తెచ్చిపెడతాయి

మిత్రులారా...

బానిసత్వానికి ముందు వేల సంవత్సరాల పాటు మనమెంతో సుభిక్షంగా ఉండేవాళ్ళం.  ఒక దశలో ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రధాన వాటా భారత్ దే కాలంలో మన నౌకావాణిజ్య సత్తామన ఓడరేవు నగరాల్లో ఆర్థిక కార్యకలాపాలు దేశాన్ని ఇతర దేశాలకు భిన్నంగా నిలిపాయిఇందులో కేరళది ముఖ్య భూమికకేరళ నుంచి అరేబియా సముద్రం మీదుగా  అనేక దేశాలతో మనం వాణిజ్య సంబంధాలు కొనసాగించాంకేరళ నుంచి నౌకలు వివిధ దేశాలకు సరుకును రవాణా చేసేవిమన ప్రబల ఆర్ధిక సామర్ధ్యంతో   మార్గాన్ని మరింతగా తీర్చిదిద్దడానికి కేంద్రం కట్టుబడి ఉందిమన సముద్ర తీర రాష్ట్రాలుఓడరేవు నగరాలు అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు కీలక కేంద్రాలుగా మారతాయి.  నేను ఇప్పుడే పోర్టు అంతా కలియ తిరిగి వచ్చానుఅదానీ కేరళలో ఇంత గొప్ప పోర్టును నిర్మించడం ద్వారా గుజరాత్ లో చేయని పనిని కేరళలో చేశాడని అక్కడి ప్రజలు తెలుసుకున్నప్పుడుఆయన గుజరాత్ ప్రజల కోపాన్ని చవిచూసేందుకు సిద్ధంగా ఉండక తప్పదునేను కూడా మా ముఖ్యమంత్రికి చెప్పాలనుకుంటున్నా...మీరు ఇండి కూటమికి చాలా బలమైన స్తంభంశశి థరూర్ కూడా ఇక్కడే ఉన్నారు కార్యక్రమం చాలామందికి   రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేస్తుందినా మాటలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లాయి అనుకుంటా.

మిత్రులారా...

మౌలిక సదుపాయాలువ్యాపార నిర్వహణలో సౌలభ్యం...  రెండూ కలిసికట్టుగా అడుగేస్తే ఓడరేవులు ప్రధాన పాత్రను పోషించే ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందుతుందిగత పదేళ్లకు పైగా  భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఓడరేవులు-జలమార్గాల సంబంధిత విధానానికి ఇదే అంశం నమూనాగా నిలిచిందిపారిశ్రామిక కార్యకలాపాలురాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందికేంద్ర ప్రభుత్వం ‘సాగర్ మాలప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఓడరేవులకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాయిని పెంచిందిఓడరేవులతో ముడిపడిన సంధాన సదుపాయాలను బలోపేతం చేసింది.  ‘పీఎం గతిశక్తిలో భాగంగా నిరంతరాయ సంధానాన్ని సమకూర్చే ఉద్దేశంతో జలమార్గాలురైలుమార్గాలుహైవేలువాయుమార్గాలను శరవేగంగా ఏకీకృతం చేస్తున్నాంవ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని సమకూర్చడానికి చేసిన  సంస్కరణలతో ఓడరేవులుమౌలికసదుపాయాల రంగాల్లోకి పెట్టుబడులు మరింత పెరిగాయికేంద్ర ప్రభుత్వం భారతీయ నావికులకు సంబంధించిన నియమనిబంధనలను కూడా సవరించింది.  దీంతో గొప్ప ఫలితాలు లభించాయి. 2014లో భారతీయ నావికుల సంఖ్య 1.25 లక్షల కంటే తక్కువేఇవాళ  సంఖ్య 3.25 లక్షలకు మించిందినావికుల సంఖ్య పరంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి మూడు దేశాల సరసన భారత్ చేరింది.

మిత్రులారా...

దశాబ్దం క్రితం ఓడరేవులలో నౌకలు ఎంతకాలం ఎదురుచూసేవో  రంగంతో సంబంధమున్న వాళ్లందరికీ తెలుసుముఖ్యంగా సరకును దింపడానికి ఎక్కువ సమయం పట్టేది జాప్యం వాణిజ్య సంస్థలుపరిశ్రమలుమొత్తంమీద ఆర్థికవ్యవస్థనే ప్రభావితం చేసేది.  ప్రస్తుతం  పరిస్థితి మారిందిగత పది సంవత్సరాల్లో భారత్ లోని  ప్రధాన ఓడరేవుల్లో టర్నరౌండ్ సమయం 30 శాతం తగ్గిందిదీంతో కార్యనిర్వహణ సామర్థ్యం మెరుగైందిఓడరేవుల సామర్థ్యం పెరిగినందువల్ల భారత్ ప్రస్తుతం తక్కువ సమయంలో ఎక్కువ సరకును హ్యాండిల్ చేయగలుగుతోందిఇది దేశ ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్సామర్ధ్యంతో పాటు వాణిజ్య సామర్ధ్యాన్ని కూడా బలోపేతం చేస్తోందని ఆయన వివరించారు.

మిత్రులారా...

దశాబ్దాల తరబడి కనబరుస్తూ వచ్చిన దూరదృష్టిప్రయత్నాల ఫలితమే నౌకావాణిజ్య రంగంలో భారత్ దక్కిన  విజయంగత పది సంవత్సరాల్లో భారత్ ఓడరేవుల సామర్థ్యాన్ని రెట్టింపైంది.  జాతీయ జలమార్గాలను ఎనిమిదింతలు విస్తరించిందిప్రస్తుతం మన దేశంలోని రెండు ఓడరేవులు ప్రపంచ అగ్రగామి 30 ఓడరేవుల్లో స్థానం సంపాదించాయిలాజిస్టిక్స్ పనితీరు సూచీలో ఇండియా స్థానం కూడా మెరుగుపడిందిదీనికి తోడుభారత్ ఇప్పుడు ప్రపంచంలో నౌకానిర్మాణంలో అగ్రగామి 20 దేశాల సరసన నిలిచిందిదేశంలో మౌలిక సదుపాయాల వ్యవస్థను పటిష్ఠపరచిన తరువాతఇక ప్రపంచ వాణిజ్యంలో భారత్ వ్యూహాత్మక స్థితిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందినౌకావాణిజ్యంలో అమృత్ కాల దార్శనికతను అవలంబిస్తాంఇది అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించాల్సిన నౌకావాణిజ్య వ్యూహ రూపురేఖలను వివరిస్తుంది.  భారతమధ్య ప్రాచ్యఐరోపా ఆర్థిక నడవాను ఏర్పాటు చేయడానికి అనేక ప్రధాన దేశాలతో కలసి పనిచేస్తామని జీ-20 శిఖరాగ్ర సదస్సులో భారత్ చెప్పిన విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాలి కారిడార్లో కేరళ పోషిస్తున్న పాత్ర కీలకంఇది  కేరళ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది.  

మిత్రులారా...

భారత నౌకా వాణిజ్య రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తోంది.  ప్రభుత్వప్రైవేటు భాగస్వామ్యం కింద గత పదేళ్లలో వేలాది కోట్ల పెట్టుబడులు పెట్టాందీంతో భారత ఓడరేవులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే కాదుభవిష్యత్తుకు అనుగుణంగా సిద్ధం చేశాంప్రైవేటు రంగ భాగస్వామ్యం వినూత్నతనుసామర్థ్యాన్ని పెంచాయి.

మన నౌకా మంత్రి  అది కూడా.. మనప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక  కమ్యూనిస్ట్ మంత్రి తన ప్రసంగంలో అదానీ అంటూ ప్రైవేట్  గురించి మాట్లాడుతున్న విషయంపై మీడియా వర్గాలు దృష్టి సారించి ఉండవచ్చుఇది మారుతున్న భారత దేశం విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మిత్రులారా... 

కొచ్చిలో నౌకానిర్మాణంమరమ్మతు క్లస్టర్ ఏర్పాటు దిశగా భారత్ ముందడుగు వేస్తోంది క్లస్టర్ నిర్మాణం పూర్తైతే అనేక నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయికేరళలోని స్థానికులుయువతకు ఇదెంతో లబ్ది చేకూరుస్తుంది.

మిత్రులారా...

నౌకా నిర్మాణ సామర్థ్యాలను పెంచుకునేందుకు దేశం ఇప్పుడు ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంటోందిభారత్లోనే పెద్ద నౌకల నిర్మాణం జరిగేలా ప్రోత్సహించేందుకు  సంవత్సరం కేంద్ర బడ్జెట్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందిఇది తయారీ రంగానికి గట్టి ప్రోత్సాహాన్ని అందిస్తుందిఅంతేకాదు  ఎంఎస్ఎమ్ఈలకు ప్రత్యక్ష ప్రయోజనాలను కలగజేస్తుందిపెద్ద సంఖ్యలో ఉపాధిసంస్థలను నెలకొల్పే అవకాశాలను సృష్టిస్తుంది.

 

మిత్రులారా...

తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చివాణిజ్యం విస్తరించిసామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలు తీరినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లుగత 10 ఏళ్లలో రహదారులురైల్వేలువిమానాశ్రయాలలోనే కాక నౌకాశ్రయాల్లో మౌలికాభివృద్ధి  స్థాయిలో జరిగిందో కేరళ ప్రజలకు తెలుసుఏళ్ల తరబడి నిలిచిపోయిన కొల్లం బైపాస్అలప్పుజ బైపాస్ వంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందికేరళకు ఆధునిక వందే భారత్ రైళ్లను అందించాం

మిత్రులారా...

కేరళ అభివృద్ధి దేశ సమగ్ర వృద్ధికి దోహదం చేస్తుందనే సూత్రాన్ని భారత ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందిసహకార సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందిగత దశాబ్దకాలంగా కీలకమైన సామాజిక అంశాల్లో కేరళ పురోగతిని సాధించేలా చూసుకుందిజల్ జీవన్ మిషన్ఉజ్వల యోజనఆయుష్మాన్ భారత్ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం వంటి పలు పథకాల ప్రయోజనాలను కేరళవాసులు పొందగలిగారు.

మిత్రులారా...

మత్య్సకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాంనీలి విప్లవంప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేరళకు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి.  పొన్నానిపుతియప్పతో వంటి ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరించాంకేరళలోని వేలాది మంది మత్స్యకార సోదర సోదరీమణులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాంతద్వారా వారికి వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది.

 మిత్రులారా...

సామరస్యంసహనానికి కేరళ పుట్టినిల్లువందల సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని పురాతన చర్చిలలో ఒకటైన సెయింట్ థామస్ చర్చిని ఇక్కడ నిర్మించారుకొద్ది రోజుల క్రితం పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కలచివేసిన విషయం మీకు తెలుసుభారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన అంతిమయాత్రకు హాజరై నివాళులు అర్పించారుకేరళకు చెందిన మా సహచర మంత్రి జార్జ్ కురియన్ కూడా ఆమె వెంట వెళ్లారునేను కూడా పవిత్ర ప్రాంతమైన కేరళ నుంచి శోకసంద్రంలో మునిగిన వారందరికీ మరోసారి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా.

మిత్రులారా...

పోప్ ఫ్రాన్సిస్ సేవా స్ఫూర్తితో ఉండేవారుక్రైస్తవ సంప్రదాయాల్లో ప్రతి ఒక్కరికి తగిన స్థానం ఉండేలా ఎంతో కృషి చేశారుఆయన సేవలను ప్రపంచం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందిపోప్ ఫ్రాన్సిస్ ను కలిసే అవకాశం లభించడం నా అదృష్టంపలు అంశాలపై ఆయనతో చర్చించే అవకాశం దక్కిందిఆయన నాపై ఎంతో ఆప్యాయత కనబరచిన విషయాన్ని నేను గుర్తించామానవత్వంసేవశాంతి విషయంలో మా మధ్య ఎన్నో సంభాషణలు జరిగాయిఅవి ఎల్లవేళలా నాకు స్ఫూర్తినిస్తాయి.

మిత్రులారా...

 కార్యక్రమానికి హాజరైన వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా..  ప్రపంచ నౌకా వాణిజ్యంలోనూవేలాది ఉద్యోగాల కల్పనలోను కేరళను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్ధేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందిపనిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారుకేరళ ప్రజల సామర్థ్యాలతో భారత నౌకా వాణిజ్య రంగం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న విశ్వాసం నాకుంది.

నముక్కు ఓరుమిచ్ ఓరు వికసిత్ కేరళం పడత్తుయర్తం, జై కేరళం... జై భారత్!

కృతజ్ఞతలు. 

 

***


(Release ID: 2126558) Visitor Counter : 4