WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారతదేశ సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ- 2030 నాటికి వినియోగదారుల వ్యయంలో 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ప్రభావాన్ని చూపుతుందని అంచనా: వేవ్స్ 2025లో నివేదిక విడుదల చేయనున్న బీసీజీ

 Posted On: 02 MAY 2025 2:33PM |   Location: PIB Hyderabad

భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ పెరుగుతుండడంతో దేశ డిజిటల్ రంగం కూడా గణనీయమైన మార్పులు చెందుతోంది"ఫ్రమ్ కంటెంట్ టు కామర్స్మ్యాపింగ్ ఇండియాస్ క్రియేటర్ ఎకానమీ" అనే పేరుతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీఈ నెల 3వ తేదీన ఒక నివేదికను ముంబయిలోని వేవ్స్ 2025లో విడుదల చేయనున్నదిభారతదేశ క్రియేటర్లు ప్రస్తుతం ఏటా 350 బిలియన్ డాలర్లకు పైగా వినియోగదారులు చేసే ఖర్చుపై ప్రభావం చూపుతున్నారని వెల్లడించిందిఈ సంఖ్య 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉంది

డిజిటల్ సృజనకారుడు అంటే ఒక్కొక్కరికి వెయ్యి మందికి పైగా ఫాలోవర్లు ఉంటారని నిర్ధారిస్తూభారతదేశంలో నుంచి 2.5 మిలియన్ల మంది యాక్టివ్ డిజిటల్ సృజనకారులు ఉన్నారని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించనున్నదిప్రమాణాలు ఎలా ఉన్నావారిలో నుంచి 10 శాతం మంది మాత్రమే ప్రస్తుతం తమ కంటెంట్‌ పై సమర్థవంతంగా డబ్బు ఆర్జిస్తున్నారువేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ఇంకా అన్వేషించని అవకాశాలను అందిపుచ్చుకుంటోందని నివేదిక వెల్లడించనున్నదిడిజిటల్ క్రియేటర్ ప్రత్యక్ష ఆదాయం నేడు 20 నుంచి 25 బిలియన్ డాలర్లని అంచనా వేస్తేదశాబ్దం చివరి నాటికి అది 100 నుంచి 125 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

నివేదికలో కొన్ని కీలకమైన అంశాలు:

  • సృజనకారులు 30 శాతానికి పైగా వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారుఇది 350 నుంచి 400 బిలియన్ డాలర్లు ఉంటుంది.

  • స్వల్ప కాల వ్యవధి వీడియో కంటెంట్ ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందికామెడీసినిమాలురోజువారీ ధారావాహికలుఫ్యాషన్ వంటి విభాగాల వైపే ఎక్కువగా వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు

  • వేగవంతమైన కంటెంట్ ప్రొడక్షన్ఎక్కువ సృజనాత్మక స్వేచ్ఛవైవిధ్యభరితమైన వినియోగదారుల అవసరాలుఫలితాల ఆధారిత లక్ష్యాల వంటి అంశాలలో పెరిగిన ప్రాధాన్యతలను బట్టి బ్రాండ్ వ్యూహాలు అభివృద్ధి చెందుతున్నాయి.

  • ఆదాయ నమూనాలు వైవిధ్యంగా విస్తరిస్తున్నాయివర్చువల్ గిఫ్టింగ్లైవ్ కామర్స్సబ్‌స్క్రిప్షన్‌లు పెంచే వ్యూహాల వంటి వినియోగదారుల పెట్టుబడులకు సంబంధించిన అంశాలు బాగా ఆదరణ పొందుతున్నాయి.

  • రాబోయే సంవత్సరాల్లో బ్రాండ్లుక్రియేటర్ మార్కెటింగ్‌లో తమ పెట్టుబడులను 1.5 నుండి రెట్లు పెంచుకుంటాయని భావిస్తున్నారుఇది విస్తృతమైన డిజిటల్ క్రియేటర్ వ్యవస్థ ద్వారా మార్కెటింగ్వాణిజ్యంలో కీలకమైన మార్పును సూచిస్తుంది.

ముంబయిలో 3వ తేదీన జరిగే వేవ్స్ 2025 సందర్భంగా బీసీజీ నివేదిక అధికారికంగా విడుదల అవుతుందిఏఐసోషల్ మీడియాఏవీజీసీ రంగంచలనచిత్రాల రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఈ మెగా ఈవెంట్ వేవ్స్ 2025 లో జరిగే చర్చలుడిజిటల్ మీడియా రంగంలో భారత్ విస్తరిస్తున్న తీరును ప్రతిబింబిస్తాయి.

 

* * *


Release ID: (Release ID: 2126311)   |   Visitor Counter: 21