ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

చక్కెర సీజన్ 2025-26కు చెరకు రైతులకు చక్కెర మిల్లులు చెల్లించాల్సిన న్యాయబద్ధమైన, లాభదాయకమైన ధరను ఆమోదించిన క్యాబినెట్


చెరకు రైతులకు క్వింటాలుకు రూ. 355 న్యాయబద్ధమైన, లాభదాయకమైన ధరగా ఆమోదం

5 కోట్ల మంది చెరకు రైతులు, వారిపై ఆధాపడినవారు, చక్కెర మిల్లుల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులు, ఇతర అనుబంధ కార్యకలాపాల్లో ఉపాధి పొందుతున్న వారికి ఈ నిర్ణయంతో లబ్ధి

Posted On: 30 APR 2025 4:09PM by PIB Hyderabad

చెరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. 2025-26 (అక్టోబరు సెప్టెంబరుచక్కెర సీజనుకు సంబంధించి న్యాయబద్ధమైనలాభదాయకమైన ధర (ఎఫ్ఆర్‌పీ)ను 10.25 ప్రాథమిక రీకవరీ రేటుకు క్వింటాలుకు రూ. 355గా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించిందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందిరీకవరీలో 10.25మించి ఎక్కువగా ఉన్న ప్రతీ 0.1పెరుగుదలకు రూ. 3.46 ప్రీమియాన్ని రైతులకు అందిస్తారురీకవరీ అంతకన్నా తక్కువగా ఉంటే ప్రతీ 0.1తగ్గుదలకు ఎఫ్ఆర్‌పీలో రూ. 3.46 తగ్గిస్తారు.

అయితేచెరకు రైతుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో.. రీకవరీ రేటు 9.5% కన్నా తక్కువ ఉంటే చక్కెర మిల్లుల్లో ఎలాంటి కోతా ఉండబోదని కూడా ప్రభుత్వం నిర్ణయించిందిఆ రైతులకు 2025-26 చక్కెర సీజనులో చెరకుకు క్వింటాలుకు రూ.329.05 చెల్లిస్తారు.

2025-26 చక్కెర సీజన్‌లో చెరకు ఉత్పత్తి ఖర్చు (A2 +FL) క్వింటాలుకు రూ.173గా ఉంది. 10.25రీకవరీ రేటుకు క్వింటాలుకు రూ. 355  న్యాయబద్ధమైనలాభదాయకమైన ధర (ఎఫ్ఆర్‌పీ). ఇది ఉత్పత్తి వ్యయం కన్నా 105.2% ఎక్కువప్రస్తుత 2024-25 చక్కెర సీజనులోని ధర కన్నా 2025-26 షుగర్ సీజనుకు నిర్ణయించిన ఈ ఎఫ్ఆర్‌పీ 4.41ఎక్కువ.

2025-26 చక్కెర సీజనులో (2025 అక్టోబరు నుంచి మొదలయ్యేచక్కెర మిల్లులు రైతుల నుంచి చెరకు కొనుగోలు చేయడానికి కొత్తగా ఆమోదం పొందిన ఈ న్యాయబద్ధమైన లాభదాయకమైన ధర (ఎఫ్ఆర్పీవర్తిస్తుందిచక్కెర రంగం ఒక ముఖ్యమైన వ్యవసాయ ఆధారిత రంగందాదాపు కోట్ల మంది చెరకు రైతులూవారిపై ఆధారపడిన వారుచక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న లక్షల మంది కార్మికుల జీవనోపాధిని ఇది ప్రభావితం చేస్తుందివారితోపాటు వ్యవసాయ కార్మికులురవాణా రంగంలో ఉపాధి పొందుతున్న వారు సహా వివిధ అనుబంధ కార్యకలాపాల్లో పనిచేసే వారి ఉపాధి అవకాశాలు కూడా ఈ రంగంతో ముడిపడి ఉన్నాయి.

నేపథ్యం:

వ్యవసాయ వ్యయాలుధరల కమిషన్ (సీఏసీపీసిఫార్సుల ఆధారంగానుఅనంతరం రాష్ట్ర ప్రభుత్వాలూ సంబంధిత ఇతర పక్షాలతో సంప్రదింపుల ద్వారాను న్యాయబద్ధమైనలాభదాయకమైన ధర (ఎఫ్ఆర్‌పీ)ని నిర్ణయించారు.

గత 2023-24 చక్కెర సీజన్‌లో చెరకు రైతులకు రూ1,11,782 కోట్ల చెరకు బకాయిలు చెల్లించాల్సి ఉండగాఈ ఏడాది ఏప్రిల్ 28 నాటికి దాదాపు రూ.1,11,703 కోట్లు చెల్లించారుఆ విధంగా 99.92% చెరకు బకాయిల చెల్లింపులు పూర్తయ్యాయిప్రస్తుత 2024-25 షుగర్ సీజనులో రూ. 97,270 కోట్ల చెరకు బకాయిలు చెల్లించాల్సి ఉండగాఈ ఏడాది ఏప్రిల్ 28 నాటికి దాదాపు రూ. 85,094 కోట్ల చెరకు బకాయిలనుఅంటే 87 శాతం రైతులకు చెల్లించారు.  

 

***


(Release ID: 2125681)