ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దయ, కారుణ్య భావనలను చాటే గుడ్ ఫ్రైడే: ప్రధాని

Posted On: 18 APR 2025 9:42AM by PIB Hyderabad

పవిత్ర గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దయ, కరుణ, దాతృత్వ భావాలను మన జీవితాల్లో పుణికిపుచ్చుకోవాలని ఈ పవిత్ర దినం మనకు గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

“గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుందాం. దయ, కారుణ్య భావాలను స్వీకరించి, ఎల్లప్పుడూ విశాల హృదయంతో మెలిగేలా ఈ పవిత్ర దినం మనందరినీ ప్రేరేపిస్తుంది. శాంతి, ఐక్యతా స్ఫూర్తి ఎన్నటికీ నిలిచి ఉంటాయి.” 


(Release ID: 2122811)