ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ సముద్ర దినోత్సవం నేపథ్యంలో సముద్ర రంగం... ఓడరేవుల బలోపేతానికి ప్రభుత్వ నిబద్ధతపై ప్రధాని పునరుద్ఘాటన
Posted On:
05 APR 2025 9:06AM by PIB Hyderabad
జాతీయ సముద్ర దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతి దిశగా సముద్ర రంగంతోపాటు ఓడరేవుల బలోపేతంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“జాతీయ సముద్ర దినోత్సవం సందర్భంగా భారత సుసంపన్న సముద్ర చరిత్రను, దేశ పురోగమనంలో ఈ రంగం పోషించిన అద్వితీయ పాత్రను ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ సర్వతోముఖాభివృద్ధి దిశగా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసే కృషిని ఇకపైనా కొనసాగిస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 2119743)
Visitor Counter : 21
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam