ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత శాంతి పరిరక్షక దళం (ఐపికెఎఫ్‌) స్మారకం వద్ద ప్రధానమంత్రి నివాళి

Posted On: 05 APR 2025 8:36PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని శ్రీ జయవర్ధనేపుర కొట్టేలోగల ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపికెఎఫ్‌) స్మారకం వద్ద సైనిక సిబ్బందిని స్మరిస్తూ నివాళి అర్పించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

   “శ్రీలంక ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ కర్తవ్య దీక్షలో అసమాన త్యాగం చేసిన ఐపీకేఎఫ్‌ సైనికుల ధైర్యసాహసాలను ఈ స్మారక చిహ్నం సదా స్మరించుకుంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు

.


(Release ID: 2119731) Visitor Counter : 16