ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అంశాల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్ మార్గనిర్దేశనం ఎంతో స్ఫూర్తిదాయకమన్న ప్రధానమంత్రి

Posted On: 14 FEB 2025 8:12PM by PIB Hyderabad

ఆరోగ్యం, మానసిక ప్రశాంతత విషయాల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్ మార్గదర్శనం ఎల్లప్పుడూ స్ఫూర్తిని కలిగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చా’ నాలుగో కార్యక్రమాన్ని అందరూ తప్పక వీక్షించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో మై గవ్ ఇండియా (MyGovIndia) పోస్టుకి స్పందిస్తూ..

 “ఆరోగ్యం, మానసిక ప్రశాంతత విషయాల్లో స్ఫూర్తిని అందించే వారిలో @SadhguruJV ముందు వరసలో ఉంటారు. రేపు, అంటే ఫిబ్రవరి 15 న ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని తప్పక చూడమని #ExamWarriors అందరికీ, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR


(Release ID: 2106341) Visitor Counter : 11