ప్రధాన మంత్రి కార్యాలయం
హేరత్ పోష్తే సందర్భంగా కాశ్మీరీ పండితులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
25 FEB 2025 6:16PM by PIB Hyderabad
హేరత్ పోష్తే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాశ్మీరీ పండితులకు శుభాకాంక్షలు తెలియజేశారు
ఎక్స్ వేదిక ద్వారా అందించిన సందేశంలో..
“హేరత్ పోష్తే!
ఈ పండుగ మన కాశ్మీరీ పండిట్ సోదర సోదరీమణుల చైతన్యవంతమైన సంస్కృతితో ముడిపడినది.
మంగళప్రదమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అందరికీ సుఖశాంతులు, చక్కని ఆరోగ్యం, సౌభాగ్యం సమకూరాలని ఆకాంక్షిస్తున్నాను. అందరి కలలూ ఆశయాలూ నెరవేరి, నూతన అవకాశాలు సిద్ధించాలని, అందరూ సదా సంతోషాన్ని చవిచూడాలని కోరుకుంటున్నాను ” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
*****
MJPS/SR
(Release ID: 2106326)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam