ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక స్థానం: ప్రధాని
Posted On:
17 JAN 2025 5:54PM by PIB Hyderabad
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో, మనస్సులో విశిష్ట స్థానముందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘‘కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా ఈక్విటీని అందించి దన్నుగా నిలవాలని నిన్నటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో, మనస్సులో విశిష్ట స్థానముంది. కర్మాగారానికి రూ. 10,000 కోట్లకు పైగా ఈక్విటీని అందించి దన్నుగా నిలవాలని నిన్నటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో ఉక్కు రంగం ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నాం’’.
***
MJPS/VJ
(Release ID: 2094119)
Read this release in:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam