ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌ ధోల్‌పూర్‌లో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు ప్రకటన

Posted On: 20 OCT 2024 1:43PM by PIB Hyderabad

ఈ రోజు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారురాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు :


 

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాదం హృదయాన్ని కలచివేసిందిఅమాయక పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానుఈ బాధను భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలిక్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానురాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను అన్ని విధాలా ఆదుకునే పనిలో నిమగ్నమైందిప్రధాన మంత్రి”

ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారుక్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు.


ఎక్స్’లో ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారుక్షతగాత్రులకు రూ.50వేలు అందజేస్తామని తెలిపారు”.

 

***

MJPS/SR/RT


(Release ID: 2066667)