ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐటీయూ - వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 15 OCT 2024 1:39PM by PIB Hyderabad


నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా జీచంద్రశేఖర్ జీఐటీయూ సెక్రటరీ జనరల్వివిద దేశాల మంత్రులుమన దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులుపరిశ్రమ ముఖ్యులుటెలికాం నిపుణులుఅంకుర సంస్థలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలుభారత్విదేశాలకు చెందిన విశిష్ట అతిథులుసోదర సోదరీమణులారా,


 

ఇండియా మొబైల్ కాంగ్రెస్‌కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతంఅంతర్జాతీయ టెలికాం యూనియన్ (ఐటీయూ)కు చెందిన సహచరులందరికీ నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నానుమీరు డబ్ల్యూటీఎస్ఏ కోసం మొదటిసారిగా భారత్‌ను ఎంచుకున్నారుమీ అందరికీ నా కృతజ్ఞతలు అలాగే మీ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను.

 

మిత్రులారా,

టెలికాంసంబంధిత సాంకేతికతల రంగంలో ప్రపంచంలోనే అత్యంత పురోగతి సాధించిన దేశాల్లో నేడు భారత్ ఒకటిగా ఉందిభారత్‌లో 120 కోట్లు లేదా 1200 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారుభారత్‌లో 95 కోట్లు లేదా 950 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారుప్రపంచంలోని రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీల్లో 40 శాతానికి పైగా భారత్‌లోనే జరుగుతున్నాయిడిజిటల్ కనెక్టివిటీని భారత్ ఆఖరి వ్యక్తి వరకూ సమర్థమైన సాధనంగా మార్చిందిగ్లోబల్ టెలికమ్యూనికేషన్ ప్రమాణాలుదాని భవిష్యత్తు గురించి ఇక్కడ చర్చించడం... ప్రపంచానికి మేలు చేసే ఒక మాధ్యమం అవుతుందిమీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

మిత్రులారా,

డబ్ల్యూటీఎస్ఏఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండింటినీ కలిపి నిర్వహించుకోవడం ముఖ్యవిశేషండబ్ల్యూటీఎస్ఏ లక్ష్యం ప్రపంచ ప్రమాణాల కోసం కృషి చేయడంఅయితే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సేవల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుందిఅందువల్లనేటి ఈ కార్యక్రమంప్రమాణాలుసేవలు రెండింటినీ ఒకే వేదికపైకి తెచ్చిందిభారత్ ఇప్పుడు నాణ్యమైన సేవలపై ఎక్కువగా దృష్టి సారిస్తోందిఅదే సమయంలో మేం మా ప్రమాణాలను కూడా స్పష్టంగా చేస్తున్నాంఈ నేపథ్యంలో డబ్ల్యూటీఎస్‌ఏ అనుభవం భారత్‌కు కొత్త శక్తిని తెస్తుంది.

 

మిత్రులారా,

ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రపంచాన్ని శక్తిమంతం చేయడం గురించి డబ్ల్యూటీఎస్ఏ మాట్లాడుతుందికనెక్టివిటీ ద్వారా ప్రపంచాన్ని శక్తిమంతం చేయడం గురించి ఇండియా మొబైల్ కాంగ్రెస్ మాట్లాడుతుందిఈ సందర్భంలోఏకాభిప్రాయంకనెక్టివిటీ రెండూ కలిసి వస్తున్నాయిఈ రోజు పలు సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి ఈ రెండూ ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకున్నారువేలాది సంవత్సరాలుగాభారత్ "వసుధైక కుటుంబంఅనే గొప్ప సందేశానికి అనుగుణంగా జీవనం సాగిస్తున్నదిమేం జీ-20కి నాయకత్వం వహించే అవకాశం పొందినప్పుడు"ఒక భూమి కుటుంబంఒక భవిష్యత్తుఅనే సందేశాన్ని కూడా ఇచ్చాంప్రపంచాన్ని అనుసంధానించడానికివివాదాలను పరిష్కరించడానికి భారత్ కట్టుబడి ఉందిపురాతన సిల్క్ రోడ్ నుంచి నేటి సాంకేతిక మార్గాల వరకుప్రపంచాన్ని అనుసంధానించడంపురోగతికి కొత్త దారులు తెరవడం అనే భారత్ లక్ష్యంలో మార్పు లేదుఈ సందర్భంలోడబ్ల్యూటీఎస్ఏఐఎమ్‌సీ భాగస్వామ్యం స్ఫూర్తిదాయకంస్థానికంప్రపంచం కలిస్తేఅది ఒక దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందిఇదే మా లక్ష్యంగా ఉంది.

మిత్రులారా,

21వ శతాబ్దంలోభారత్‌లో మొబైల్టెలికాం రంగాల్లో పురోగతి మొత్తం ప్రపంచానికి అధ్యయనాంశంగా మారిందిప్రపంచవ్యాప్తంగామొబైల్టెలికాం రంగాలను ఒక సౌకర్యంగా భావించారుకానీ భారత్‌ మోడల్‌ భిన్నంగా ఉందిభారత్‌లోమేం టెలికాం రంగాన్ని కేవలం కనెక్టివిటీ సాధనంగా మాత్రమే కాకుండా ఈక్విటీఅవకాశాల మాధ్యమంగా చూశాంఈ మాధ్యమం గ్రామాలునగరాల మధ్య అలాగే ధనికులుపేదల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 10 ఏళ్ల క్రితం డిజిటల్ ఇండియా దార్శనికతను దేశానికి అందించినప్పుడుమనం సమగ్ర దృక్పథంతో పని చేయాలని నేను పిలుపునిచ్చానుడిజిటల్ ఇండియాకు నాలుగు మూల స్తంభాలను మేం గుర్తించాంమొదటిదిపరికరాల ధర తక్కువగా ఉండాలిరెండోదిడిజిటల్ కనెక్టివిటీ దేశంలోని ప్రతి మూలకూ చేరుకోవాలిమూడోదిడేటా అందరికీ అందుబాటులో ఉండాలినాలుగోది, ‘డిజిటల్ ఫస్ట్’ మా లక్ష్యంగా ఉండాలిమేం ఈ నాలుగు స్తంభాలపై ఏకకాలంలో పని చేయడం ప్రారంభించిఫలితాలను సైతం రాబట్టగలిగాం.


 

మిత్రులారా,

మేం భారత్‌లో ఫోన్లను తయారు చేయడం ప్రారంభించే వరకూ ఫోన్లు అందుబాటు ధరల్లో లేవు. 2014లో భారత్‌లో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగానేడు 200లకు పైగా తయారీ యూనిట్లు ఉన్నాయిఇంతకుముందుమేం చాలా ఫోన్లను దిగుమతి చేసుకున్నాంకానీ ఇప్పుడు మేం భారత్‌లో ఆరు రెట్లు ఎక్కువ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాంమొబైల్ ఎగుమతిదారులుగా సైతం మేం గుర్తింపు సాధించాంఅయితే మేం అక్కడితో ఆగలేదుఇప్పుడుచిప్‌ల నుంచి తుది ఉత్పత్తుల వరకుపూర్తిగా భారత్‌లోనే తయారైన ఫోన్‌ను మేం ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాంభారత్‌లో సెమీకండక్టర్ రంగంలో కూడా గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నాం.

మిత్రులారా,

కనెక్టివిటీ లక్ష్యంగా పని చేస్తూభారత్‌లోని ప్రతి ఇంటినీ అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నాందేశవ్యాప్తంగా బలమైన మొబైల్ టవర్ల వ్యవస్థను మేం నిర్మించాంగిరిజన ప్రాంతాలుకొండ ప్రాంతాలుసరిహద్దు ప్రాంతాల్లో తక్కువ సమయంలో వేలాది మొబైల్ టవర్లను ఏర్పాటు చేశాంరైల్వే స్టేషన్లుఇతర బహిరంగ ప్రదేశాల్లో వై-ఫై సౌకర్యాలను కల్పించాంమేం అండమాన్-నికోబార్లక్షద్వీప్ వంటి దీవులను సముద్రగర్భ కేబుల్స్ ద్వారా అనుసంధానించాంకేవలం 10 ఏళ్లలోనేభూమి-చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ ఆప్టికల్ ఫైబర్‌ను భారత్ ఏర్పాటు చేసిందిభారత్ వేగానికి ఒక ఉదాహరణ చెబుతానురెండేళ్ల కిందట మొబైల్ కాంగ్రెస్‌లో మేం 5జీని ప్రారంభించాంనేడుభారత్‌లోని దాదాపు ప్రతి జిల్లా 5జీ సేవలతో అనుసంధానమైందిభారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా ఎదిగిందిఅలాగే ఇప్పుడు మేం 6జీ సాంకేతికతపై వేగంగా పని చేస్తున్నాం.

 

మిత్రులారా,

భారత్‌లో టెలికాం రంగంలో అనూహ్యమైనఅపూర్వమైన సంస్కరణలుఆవిష్కరణలు జరిగాయిఫలితంగా డేటా ఖర్చులు గణనీయంగా తగ్గాయినేడుభారత్‌లో ఇంటర్నెట్ డేటా ధర ఒక జీబీ కోసం సుమారుగా 12 సెంట్లు ఉంటేచాలా దేశాల్లోఒక జీబీ డేటా ధర 10 నుంచి 20 రెట్లు ఎక్కువ ఉందిప్రతీ భారతీయుడు నెలకు సగటున 30 జీబీ డేటాను వినియోగిస్తున్నాడు.

 

మిత్రులారా,

మా నాలుగో లక్ష్యండిజిటల్ ఫస్ట్’ స్ఫూర్తి ఈ ప్రయత్నాలన్నింటినీ కొత్త స్థాయికి తీసుకువెళ్లిందిభారత్ డిజిటల్ టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించిందిమేం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను సృష్టించాంవాటిలో జరిగిన ఆవిష్కరణలు లక్షలాది కొత్త అవకాశాలను సృష్టించాయిజేఏఎమ్ త్రయం (జన్ ధన్ఆధార్మొబైల్అనేక ఆవిష్కరణలకు పునాదిగా మారిందియూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐఅనేక కొత్త కంపెనీలకు అవకాశాలను సృష్టించిందిఈ రోజుల్లో... ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్గురించి కూడా అదే విధమైన చర్చ నడుస్తున్నదిఇది డిజిటల్ వాణిజ్యంలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తుందికరోనా మహమ్మారి సమయంలోమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అవసరమైన వారికి నగదును బదిలీ చేయడంకోవిడ్-19తో వ్యవహరించే ఉద్యోగులకు సకాలంలో మార్గదర్శకాలను పంపడంటీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడం లేదా డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను అందించడం వంటి ప్రతీ పనినీ సులభతరం చేయడం మనం చూశాంభారత్‌లో ఈ ప్రక్రియ అంతా సాఫీగా జరిగిందినేడుభారత్ సంక్షేమ పథకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలకు చేర్చే డిజిటల్ బొకేను కలిగి ఉందిఅందుకేజీ-20 అధ్యక్షత సమయంలోభారత్ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల గురించి ప్రధానంగా ప్రస్తావించిందిఈరోజుభారత్ అన్ని దేశాలతో యూపీఐకి సంబంధించిన అనుభవాన్నిపరిజ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందని నేను పునరుద్ఘాటిస్తున్నాను.

 

మిత్రులారా,

డబ్ల్యూటీఎస్ఏలో మహిళల పాత్ర గురించి చర్చ ఉంటుందిఇది చాలా ముఖ్యమైన అంశంమహిళల సారథ్యంలో అభివృద్ధి కోసం భారత్ తీవ్రంగా కృషి చేస్తోందిజీ-20 అధ్యక్షత సమయంలోమేం ఈ సమస్య పట్ల మా నిబద్ధతను మరింత పెంచుకున్నాంసాంకేతిక రంగాన్ని కలుపుకొనిసాంకేతిక వేదికల ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం భారత్ లక్ష్యంమా అంతరిక్ష యాత్రల్లో మా మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించడం మీరు చూశారుమా అంకుర సంస్థల్లో మహిళా సహ వ్యవస్థాపకుల సంఖ్య నిరంతరం పెరుగుతోందినేడుభారత్‌లో ఎస్‌టీఈఎమ్ విద్యలో 40 శాతానికి పైగా మన ఆడబిడ్డలే ఉన్నారుసాంకేతికతకు నాయకత్వం వహించడంలో భారత్ మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పిస్తోందిప్రభుత్వం చేపడుతున్న నమో డ్రోన్ దీదీ కార్యక్రమం గురించి మీరు కచ్చితంగా వినే ఉంటారుఈ కార్యక్రమం వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. భారత్‌లోని గ్రామాల మహిళలు దీనిని నడిపిస్తున్నారుగృహాల్లో డిజిటల్ బ్యాంకింగ్డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మేం బ్యాంక్ సఖి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాంఅంటే మహిళలు డిజిటల్ అవగాహన కార్యక్రమానికి నాయకత్వం వహించారుమా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణప్రసూతిశిశు సంరక్షణలోఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్రను పోషిస్తున్నారునేడుఈ కార్మికులు టాబ్లెట్లుయాప్‌ల ద్వారా ఈ పనులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారుమేం మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మహిళా ఇ-హాత్ ప్రోగ్రామ్‌ను కూడా నడుపుతున్నాంఅంటే ఒకప్పుడు ఊహకు సైతం అందని విధంగా నేడు పల్లెటూళ్లలో భారత మహిళలు సాంకేతికతతో పని చేస్తున్నారుభవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించబోతున్నాంప్రతి ఆడబిడ్డ టెక్ లీడర్‌గా మారే భారత్‌ను నేను చూడాలనుకుంటున్నాను.

 

మిత్రులారా,

భారత్ జీ-20కి అధ్యక్షత వహించిన సమయంలో... మేం ప్రపంచానికి ఒక కీలక అంశాన్ని అందించాంనేను ఈ అంశాన్ని డబ్ల్యూటీఎస్ఏ వంటి ప్రపంచ వేదికపై కూడా ప్రస్తావించాలనుకుంటున్నాఆ అంశమే డిజిటల్ టెక్నాలజీ కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్గ్లోబల్ మార్గదర్శకాలుగ్లోబల్ గవర్నెన్స్ కోసం దీని ప్రాముఖ్యతను ప్రపంచ సంస్థలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందిసాంకేతికత కోసం ప్రపంచవ్యాప్తంగా చేయాల్సినవిచేయకూడనివి ఏమిటనే విషయంలో స్పష్టత ఉండాలినేడుఅన్ని డిజిటల్ సాధనాలుఅప్లికేషన్లు అన్ని దేశాల సరిహద్దులుపరిమితులకు మించి పనిచేస్తున్నాయిఏ ఒక్క దేశం కూడా తన పౌరులను సైబర్ దాడుల నుంచి స్వయంగా రక్షించుకోలేని పరిస్థితి ఉందిమనమంతా కలిసి పని చేయాలిప్రపంచ సంస్థలు బాధ్యత తీసుకోవాలివిమానయాన రంగంలో నియమనిబంధనల కోసం మేం గ్లోబల్ ద‌ృక్పథాన్ని ఏర్పాటు చేసుకున్న విధంగానేడిజిటల్ ప్రపంచానికి కూడా ఇలాంటి ఫ్రేమ్‌వర్క్ అవసరమని మా అనుభవం ద్వారా మాకు అవగతమైందిఈ విషయంలో డబ్ల్యూటీఎస్ఏ మరింత క్రియాశీలంగా పనిచేయాలిప్రతి ఒక్కరి కోసం సురక్షిత టెలికమ్యూనికేషన్ వ్యవస్థను అందించడం గురించి ఆలోచన చేయాలని నేను ప్రతీ డబ్ల్యూటీఎస్ఏ సభ్యుడిని కోరుతున్నానుఈ పరస్పర అనుసంధాన ప్రపంచంలోభద్రత ద్వితీయ ప్రాధాన్యం కానేకాదుభారత్ అమలు చేస్తున్న డేటా ప్రొటెక్షన్ యాక్ట్నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ సురక్షిత డిజిటల్ వ్యవస్థ నిర్మాణం పట్ల మా నిబద్ధతకు నిదర్శనంసమగ్రమైనసురక్షితమైనప్రతీ భవిష్యత్ సవాలుకు అనుగుణంగా ఉండే ప్రమాణాలు రూపొందించాలని నేను ఈ అసెంబ్లీ సభ్యులందరినీ కోరుతున్నానువివిధ దేశాల భిన్నత్వాన్ని గౌరవించే నైతిక ఏఐ, డేటా గోప్యత కోసం మీరంతా ప్రపంచ ప్రమాణాలను అభివృద్ధి చేయాలి.

 

మిత్రులారా,

ఈ సాంకేతిక విప్లవంలోసాంకేతికతకు మానవ-కేంద్రిత కోణాన్ని జోడించడానికి మనం నిరంతరం కృషి చేయడం చాలా ముఖ్యంఈ విప్లవం బాధ్యతాయుతంగాసుస్థిరంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యతనేడు మనం రూపొందించుకునే ప్రమాణాలు మన భవిష్యత్తు దిశను నిర్దేశిస్తాయికాబట్టిభద్రతగౌరవంఈక్విటీ సూత్రాలు కేంద్రంగా మన చర్చలు సాగాలిఈ డిజిటల్ యుగంలో ఏ దేశంఏ ప్రాంతంఏ సమాజం వెనుకబడిపోకుండా చూడడమే మన లక్ష్యంఆవిష్కరణలుసమగ్రత ప్రధాన కేంద్రంగా మన భవిష్యత్తు సాంకేతికంగా బలంగానైతికంగా దృఢంగా ఉండేలా మనం చూసుకోవాలి.

 

మిత్రులారా,

డబ్ల్యూటీఎస్ఏ విజయం కోసం నా శుభాకాంక్షలను అలాగే నా మద్దతును తెలుపుతున్నానుఅంతా బాగా జరగాలని నేను కోరుకుంటున్నానుధన్యవాదాలు!

 

***



(Release ID: 2065165) Visitor Counter : 14