రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సియాచిన్ బేస్ క్యాంప్‌ ను సందర్శించి, సైనికులతో మాట్లాడిన భారత రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2024 2:40PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు సియాచిన్ బేస్ క్యాంప్‌ను సందర్శించారుఈ సందర్భంగా సియాచిన్ హిమపర్వతంపై యుద్ధవీరుల స్మారక స్థూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. 1984, ఏప్రిల్ 13న భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించినప్పటి నుంచి అమరులైన సైనికులుఅధికారుల త్యాగానికి గుర్తుగా ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారుఅక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ఆమె సంభాషించారు.

సైనికులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ... సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా వారి గురించి చాలా గర్వంగా భావిస్తున్నాననీవారి ధైర్యసాహసాలకు దేశప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారని అన్నారు

1984 ఏప్రిల్‌లో ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభమైనప్పటి నుంచిభారత సాయుధ దళాల వీర సైనికులుఅధికారులు ఈ ప్రాంత రక్షణ కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారువారు తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాఏమాత్రం చలించకుండా తమ విధుల్ని నిర్వహిస్తున్నారన్నారుభారీ హిమపాతంమైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత వంటి క్లిష్ట పరిస్థితులలోనూ వారు పూర్తి అంకింతభావంఅప్రమత్తతతో పనిచేస్తున్నారని కితాబిచ్చారుమాతృభూమి రక్షణ కోసం వారి త్యాగంసహనం అసాధారణమైనవని పేర్కొన్నారుభారతీయులందరికీ సైనికుల త్యాగంధైర్యసాహసాలు తెలుసుననిదేశమంతా వారిని గౌరవిస్తున్నదని ఆమె అన్నారు.

 

రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

***


(రిలీజ్ ఐడి: 2059278) సందర్శకుల సూచీ సంఖ్య : : 86
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam